India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విజయవాడ నగర శివారులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్నానానికి దిగి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. జక్కంపూడి పోలవరం పట్టిసీమ కాలవ సమీపంలో ఘటన జరిగింది. విజయవాడకి చెందిన ఆరుగురు యువకులు గురువారం పట్టిసీమ కాలంలో స్నానానికి దిగగా ఇద్దరు గల్లంతు కాగా నలుగురు యువకులు సురక్షితంగా బయటకు వచ్చారు. గల్లంతయిన వారు విజయవాడ సింగ్ నగర్కు చెందిన మునీర్ శివతేజగా గుర్తించినట్లు సీఐ కొండలరావు తెలిపారు.

వైవీ సుబ్బారెడ్డి వైసీపీ అధిష్ఠానం గురువారం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా రీజనల్-కో ఆర్డినేటర్గా ఉన్న ఆయనకు ఉమ్మడి కృష్ణా జిల్లా బాధ్యతలు కూడా అప్పగించింది. ఈ మేరకు కేంద్ర కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.

శాసనసభలో శుక్రవారం జరగనున్న పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) ఎన్నికకు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య నామినేషన్ వేశారు. కాగా తాతయ్యతో పాటు NDA కూటమి నుంచి మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు నామినేషన్ సమర్పించారు. ఛైర్మన్తో పాటు PACలో మొత్తం 9 మంది సభ్యులను నేడు శాసనసభలో స్పీకర్ అయ్యన్న సమక్షంలో సభ్యులు ఎన్నుకుంటారు.

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో MBA & MCA కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ (Y20 నుంచి Y24 బ్యాచ్లు) థియరీ పరీక్షలను డిసెంబర్ 28 నుంచి నిర్వహిస్తామని వర్శిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 25లోపు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవాలని వర్సిటీ కోరింది.

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో బీఈడీ, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ థియరీ పరీక్షల రివైజ్డ్ టైం టేబుల్ గురువారం విడుదలైంది. డిసెంబర్ 6,7,9, 10న బీఈడీ, డిసెంబర్ 6,7, 9,10,11,12న బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా టైం టేబుల్ వివరాలకై https://kru.ac.in/ చూడాలని కోరింది.

విజయవాడ పటమట పోలీసులు పనితీరుపై ప్రజలు ప్రశంసించారు. విజయవాడ మహానాడు రోడ్లో ఓ బ్యాంక్లో పీఓగా పనిచేస్తున్న కిషోర్ అనే వ్యక్తి తన ఫోన్ ఈనెల 1వ తేదీన పోగొట్టుకున్నాడు. ఈ క్రమంలో బాధితుడు పటమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సాంకేతిక సాయంతో ఫోన్ గుర్తించి బాధితుడికి గురువారం అందజేసినట్లు సీఐ పవన్ కిషోర్ తెలిపారు. ఫోన్లు పోతే ఎవరు నిరుత్సాహానికి గురవ్వాల్సిన అవసరం లేదని సీఐ అన్నారు.

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో ఇటీవల నిర్వహించిన ఫార్మ్డీ కోర్సు 2, 3, 4వ ఏడాది పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఆయా పరీక్షలు రాసిన విద్యార్థులు రిజల్ట్స్ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ అధ్యాపక వర్గాలు సూచించాయి. ఈ పరీక్షల ఫలితాలకై యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ https://kru.ac.in/ చూడాలని విద్యార్థులకు ఈ మేరకు ఒక ప్రకటనలో సూచించాయి.

అరెస్ట్ భయంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడకు చెందిన నీలం సూర్యప్రభాస్(21)పై 15 కేసులున్నాయి. భార్య, కుమారుడితో ప్రభాస్ 3 నెలలుగా తిరుపతిలో నివాసం ఉంటున్నాడు. ప్రభాస్ను గాలిస్తూ పోలీసులు ఇంటి వద్దకు వెళ్లారు. వారిని చూసి అరెస్టు చేస్తారని భయపడి బుధవారం ఇంట్లో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు.

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో ఇటీవల నిర్వహించిన బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(బీపీఈడీ) కోర్సు 2వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. పరీక్ష ఫలితాలు, రీవాల్యుయేషన్/పర్సనల్ వెరిఫికేషన్ వంటి వివరాల కోసం యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ https://kru.ac.in/ చూడాలని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.

ఆడ పశువుల్లో గర్భస్రావానికి, మగ పశువుల్లో కీళ్ల వాపులు, వంధ్యత్వానికి కారణమయ్యే బ్రూసెల్లోసిస్ వ్యాధి నియంత్రణకు డిసెంబర్ 15 వరకు బ్రూసెల్లోసిస్ టీకా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఇన్ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా పశు సంవర్థక అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ వ్యాధి పశువుల నుంచి మనుషులకు సోకే అవకాశం ఉంది.
Sorry, no posts matched your criteria.