Krishna

News May 20, 2024

కృష్ణా: కొండెక్కిన మిర్చి ధరలు రూ.100

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో పచ్చిమిర్చి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాలలో పచ్చిమిర్చి ధర కేజీ రూ.100 వరకు చేరింది. దీంతో సామాన్యుల వంటింటికి పచ్చిమిర్చి రానంటోంది. మిర్చి తోటల నుంచి దిగుబడి తగ్గడంతో పచ్చిమిర్చి ధర పెరిగిందని అమ్మకందారులు చెబుతున్నారు. రిటైల్ మార్కెట్లో పచ్చిమిర్చి ధర పెరగడంతో అధికారులు రైతుబజార్ల ద్వారా తక్కువ ధరకు అమ్మకం సాగించాలని ప్రజలు కోరుతున్నారు.

News May 20, 2024

కృష్ణా: కొండెక్కిన మిర్చి ధరలు

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో పచ్చిమిర్చి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాలలో పచ్చిమిర్చి ధర కేజీ రూ.100 వరకు చేరింది. దీంతో సామాన్యుల వంటింటికి పచ్చిమిర్చి రానంటోంది. మిర్చి తోటల నుంచి దిగుబడి తగ్గడంతో పచ్చిమిర్చి ధర పెరిగిందని అమ్మకందారులు చెబుతున్నారు. రిటైల్ మార్కెట్లో పచ్చిమిర్చి ధర పెరగడంతో అధికారులు రైతుబజార్ల ద్వారా తక్కువ ధరకు అమ్మకం సాగించాలని ప్రజలు కోరుతున్నారు.

News May 20, 2024

విజయవాడ: ప్రయాణీకుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా ఎర్నాకులం (ERS), హెచ్. నిజాముద్దీన్(NZM) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR) పేర్కొంది. నం.06071 ERS- NZM ట్రైన్‌లను జూన్ 7 నుంచి 28 వరకు ప్రతి శుక్రవారం, నం.06072 NZM- ERS ట్రైన్‌లను జూన్ 10 నుంచి జూలై 7 వరకు ప్రతి సోమవారం నడపనున్నట్లు SCR తెలిపింది. ఈ ట్రైన్లు ఏపీలో విజయవాడతో పాటు ఒంగోలు, చిత్తూరు, తిరుపతి తదితర స్టేషన్లలో ఆగుతాయి.

News May 19, 2024

గంపలగూడెంలో విద్యుత్ షాక్.. భార్యాభర్తల మృతి

image

గంపలగూడెం పడమట దళితవాడకు చెందిన గోరంట్ల తిరపయ్య, భార్య జమలమ్మలు షార్ట్ సర్క్యూట్‌తో మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి రేకుల షెడ్డుపై ఉన్న సర్వీస్ వైరుకు, బట్టల ఆరేసుకునే జీఐ వైర్ దగ్గరగా ఉండటంతో షాక్ వచ్చింది. అయితే బట్టలు తీసే ప్రయత్నంలో జములమ్మ (48) షాక్‌కు గురికాగా, గమనించిన భర్త తిరుపతయ్య (52) భార్యను కాపాడే ప్రయత్నం చేయగా ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

News May 19, 2024

పెట్రోల్ బంక్ ఓనర్లను బ్లేడు బ్యాచ్ బెదిరించలేదు: సీపీ

image

విజయవాడలోని పెట్రోల్ బంక్ యజమానులను బ్లేడ్ బ్యాచ్ బెదిరిస్తుందని కొన్ని పత్రికల్లో, చానెళ్లలో వచ్చిన వార్త పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ రామకృష్ణ తెలిపారు. విజయవాడకు చెందిన బొజ్జ డానియల్ అనే వ్యక్తి బాటిల్లో పెట్రోల్ కొట్టమని పలు బంకుల వద్దకు వెళ్లి సిబ్బందిని అడిగినట్లు చెప్పారు. బంకు సిబ్బంది ఫిర్యాదుతో డానియల్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News May 19, 2024

కొనకళ్ళను పరామర్శించిన వైసీపీ MLA పేర్ని నాని

image

హార్ట్ స్ట్రోక్‌కి గురై శస్త్ర చికిత్స చేసిన అనంతరం విజయవాడలోని ఓ ప్రయివేటు హాస్పిటల్‌లో కోలుకుంటున్న, మాజీ బందరు పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావుని మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ఆదివారం పరామర్శించారు. త్వరగా ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని నాని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు.

News May 19, 2024

ఎలక్షన్ ఆధారిత కేసులపై చార్జ్‌షీట్ దాఖలు చేయాలి: ఎస్పీ

image

ఎలక్షన్ ఆధారిత కేసులను త్వరితగతిన విచారణ పూర్తి చేసి చార్జ్‌షీట్ దాఖలు చేయాలనీ ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. జిల్లా పోలీస్ అధికారులతో ఆయన నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ప్రతి ఒక్క కేసును క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన విచారణ పూర్తి చేసి, చార్జ్ షీట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

News May 19, 2024

కృష్ణా: హజ్ యాత్ర నిర్వహణపై కలెక్టర్ సూచనలు

image

హజ్ యాత్ర నిర్వహణపై కృష్ణా జిల్లా కలెక్టర్ DK బాలాజీ సంబంధిత అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ అంశంపై తాజాగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 25 నుంచి 30 వరకూ గన్నవరం మండలం కేసరిపల్లిలోని జామియా మసీదు వద్ద హజ్ యాత్రికులకై ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. ఈ శిబిరం ద్వారా హజ్ యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

News May 19, 2024

ఇబ్రహీంపట్నంలో రోడ్డు ప్రమాదం.. ASI పరిస్థితి విషమం

image

ఇబ్రహీంపట్నంలో శనివారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నిమ్రా కాలేజ్ స్ట్రాంగ్ రూమ్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ రమణకు తీవ్ర గాయాలయ్యాయి.. హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న కారు కాలేజ్ గేటు వద్ద విధులు నిర్వహిస్తున్న రమణను ఢీకొట్టింది. ఇబ్రహీంపట్నం ఏఎస్ఐ సాదిక్ హుటాహుటిన చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

News May 19, 2024

ఎన్టీఆర్: విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

ట్రాఫిక్ మెయిన్‌టెనెన్స్ కారణంగా రాయనపాడు మీదుగా విశాఖపట్నం(VSKP), మహబూబ్‌నగర్(MBNR) మధ్య ప్రయాణించే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నెం.12861 VSKP- MBNR ట్రైన్‌ను ఈ నెల 19 నుండి జూన్ 3 వరకు, నెం.12862 MBNR- VSKP ట్రైన్‌ను ఈ నెల 20 నుండి జూన్ 4 వరకూ రద్దు చేస్తున్నట్లు రైల్వే వర్గాలు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.