Krishna

News October 29, 2024

విజయవాడ: 20 సెకన్లపాటు గాల్లో వేలాడిన చిన్నారి

image

విజయవాడలోని ఓ హోటల్ పైనుంచి పడి సోమవారం ఉదయం బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే. సీఐ ప్రకాశ్ వివరాలు..బాలిక అన్నతో దాగుడుమూతలు ఆడుకుంటూ కిటికీ కర్టెన్ వెనుక దాక్కుంది. ప్రమాదవశాత్తు జారిపోయి, 20 సెకన్లు కిటికీని పట్టుకుని వేలాడింది. కింద ఉన్న యువకులు పట్టుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. పాపను రోడ్డుపై చూసి తండ్రి కంగుతిన్నాడు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

News October 29, 2024

విజయవాడ: చిన్నారి గీసిన చిత్రానికి సీఎం చంద్రబాబు ఫిదా

image

విజయవాడకు చెందిన 8వ తరగతి విద్యార్థిని లాస్య గీసిన చంద్రబాబు రేఖాచిత్రాన్ని తీసుకొని సోమవారం అమరావతి సచివాలయానికి వచ్చింది. ‘సంపద సృష్టించి పేదవారికి పంచి ఇచ్చే పెన్నిధికి ఒక పేద విద్యార్థి ఇచ్చే చిరుజ్ఞాపిక’ అంటూ చంద్రబాబు గురించి గీసిన ఆ చిత్రాన్ని చూసి సీఎం ఫిదా అయ్యారు. అనంతరం లాస్యను అభినందించారు. బాగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆయన ఆకాంక్షించారు.

News October 29, 2024

కృష్ణా: విద్యార్థులకు అలర్ట్: టైంటేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో మూడేళ్ల LLB కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 5వ సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ) థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. నవంబర్ 19, 21, 23, 25, 27వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని ANU పరీక్షల విభాగం తెలిపింది. పూర్తి వివరాలకై https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలంది.

News October 28, 2024

కృష్ణా: ఆ రెండు రైల్వేస్టేషన్లకు మహర్దశ 

image

కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సౌలభ్యం కోసం మౌలిక వసతులను విస్తృతంగా అభివృద్ధి చేస్తున్నామని విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ నరేంద్ర పాటిల్ చెప్పారు. ఈ రెండు స్టేషన్లలో రూ.17కోట్ల వ్యయంతో మౌలిక వసతులను ఏర్పాటు చేయిస్తామన్నారు. విజయవాడ డివిజన్ పరిధిలో 11 స్టేషన్లలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మౌలిక వసతులను శరవేగంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. 

News October 28, 2024

UPDATE: గన్నవరంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి

image

నూజివీడు వాసి శబరి భవాని, రాజమండ్రికి చెందిన బంధువు వెంకట పద్మకుమారిలు భవాని భర్త చికిత్స పొందుతుండగా చిన్న అవుటపల్లి ఆసుపత్రిలో పరామర్శించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో విజయవాడ నుంచి వేగంగా వస్తున్న ఓ బైక్ ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలైన ఇద్దరూ చికిత్స పొందుతూ.. మృతిచెందారు. ఆ ఇద్దరి మరణం అటు నూజివీడు, ఇటు రాజమండ్రిలో తీవ్ర విషాదాన్ని నింపింది. అనంతరం రోడ్డుపై వేగాన్ని నియంత్రించాలని పలువురు కోరారు. 

News October 27, 2024

ఉంగుటూరు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందిన ఘటన ఉంగుటూరులో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. నూజివీడుకి చెందిన భవాని భర్త అనారోగ్యంతో పెద్దఔటుపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. దీంతో అతడిని చూసేందుకు భవానితో పాటు పద్మకుమారి ఆదివారం ఆసుపత్రికి వచ్చారు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా వారిని ఓ బైక్ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఇద్దరూ చికిత్స పొందుతూ మృతి చెందారు.

News October 27, 2024

విజయవాడలో హోటల్‌కు బాంబు బెదిరింపులు

image

విజయవాడలోని బందర్ రోడ్‌లో గల వివంత హోటల్‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన కృష్ణలంక సీఐ నాగరాజు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది హోటల్‌లో తనిఖీలు చేపట్టారు. అయితే ఆ ఫోన్ కాల్ నిజమా కాదా అనేది అధికారులు వెల్లడించాల్సి ఉంది.

News October 27, 2024

కృష్ణా: బీఈడీ పరీక్షల రివైజ్డ్ టైం టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(హియరింగ్ ఇంపెయిర్‌మెంట్) కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. ఈ పరీక్షలు నవంబర్ 5, 6, 7, 8,11 తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల మధ్య జరుగుతాయని ANU తెలిపింది. సబ్జెక్టు వారీగా టైం టేబుల్ వివరాలకై https://www.nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చూడాలని సూచించింది.

News October 27, 2024

కృష్ణా: విద్యార్థులకు గమనిక.. గడువు పొడిగింపు

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో MBA/MCA కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ (Y20 నుంచి Y24 బ్యాచ్‌లు) థియరీ పరీక్షలను డిసెంబర్ 5 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు నవంబర్ 7లోపు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 24తో ఫీజు చెల్లింపు గడువు ముగియగా నవంబర్ 7 వరకు గడువు పొడిగించినట్లు చెప్పారు. 

News October 27, 2024

నూజివీడు: వ్యవసాయ కూలీ జంట మృతిపై UPDATE

image

నూజివీడు మండలం పోతురెడ్డిపల్లికి చెందిన వ్యవసాయ కూలీలు ప్రశాంతి, రాంబాబుల మృతి గ్రామంలో విషాదాన్ని నింపింది. పశువులను మేత కోసం తోలుకు వెళ్లిన ప్రశాంతి, రాంబాబు దంపతులు కుంపిని చెరువులో ప్రమాదవశాత్తు శనివారం మృతిచెందిన విషయం తెలిసిందే. చెరువులో ఉన్న ఊబిలో ఇరుక్కుపోవడం వలన ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు చెప్పారు. రూరల్ ఎస్ఐ లక్ష్మణ్ బాబు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.