Krishna

News May 19, 2024

కృష్ణా: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

ట్రాఫిక్ మెయిన్‌టెనెన్స్ కారణంగా విజయవాడ మీదుగా తిరుపతి, కాకినాడ మధ్య ప్రయాణించే ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నెం.17249 తిరుపతి- కాకినాడ టౌన్ ట్రైన్‌ను జూన్ 3 వరకు, నెం.17250 కాకినాడ టౌన్- తిరుపతి ట్రైన్‌లను జూన్ 4 వరకూ రద్దు చేస్తున్నట్లు రైల్వే వర్గాలు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.

News May 18, 2024

కృష్ణా: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన దక్షిణ మధ్య రైల్వే

image

ప్రయాణికుల సౌకర్యార్ధం విజయవాడ మీదుగా తాంబరం, సత్రాగచ్చి మధ్య ప్రయాణించే రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR) తెలిపింది. నెం. 06095 తాంబరం-సత్రాగచ్చి
ట్రైన్‌ను జూన్ 6 నుంచి జూలై 4 వరకూ ప్రతి గురువారం, నెం.06096 సత్రాగచ్చి-తాంబరం ట్రైన్‌ను జూన్ 7 నుంచి జూలై 5 వరకూ ప్రతి శుక్రవారం పొడిగిస్తున్నట్లు SCR తెలిపింది.

News May 18, 2024

కృష్ణా: ప్రయాణికుల రద్దీ మేరకు స్పెషల్ ట్రైన్

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా చెన్నై ఎగ్మూరు నుంచి సత్రాగచ్చి (పశ్చిమ బెంగాల్)కు స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం. 06077 ట్రైన్‌ను జూన్ 1 నుంచి 29 వరకు ప్రతి శనివారం చెన్నై ఎగ్మూరు, సత్రాగచ్చి మధ్య నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్ తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News May 18, 2024

ముదినేపల్లిలో పగిలిన గ్యాస్ పైప్ లైన్

image

ముదినేపల్లిలో గురజ రహదారిలో మెగా సంస్థకు చెందిన గ్యాస్ పైప్ లైన్ ప్రమాదవశాత్తు లీక్ కావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఎదురుగా పెట్రోల్ బంక్ ఉండటంతో భారీ ప్రమాదం జరుగుతుందని భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఎస్సై వెంకట్ కుమార్, గుడివాడ అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ముందస్తు చర్యలు చేపట్టారు. మంటలు ఏర్పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

News May 18, 2024

కృష్ణా: డిగ్రీ పరీక్షల రీవాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్/మే 2024లో నిర్వహించిన డిగ్రీ ఆరవ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు మే 24వ తేదీలోగా.. ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.8,00 చెల్లించాల్సి ఉంటుందని వర్శిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు.

News May 18, 2024

కృత్తివెన్ను: కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి ఆత్మహత్య

image

మండలంలోని ఒర్లగొందితిప్ప గ్రామానికి చెందిన దుర్గారావు (35) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల మేరకు దుర్గారావు, అతని భార్య దుర్గల మధ్య కొద్ది రోజులుగా కుటుంబ కలహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఎస్ఐ తెలిపారు. మృతుడి తండ్రి వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

News May 18, 2024

విజయవాడ: సీసాలు, డబ్బాలలో పెట్రోల్ విక్రయాలు నిషేదం

image

పల్నాడులో పెద్ద పెద్ద మెత్తంలో పెట్రోల్ బాంబులు లభ్యమైన నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు విజయవాడ నగరంలో సీసాలు, డబ్బాలలో పెట్రోల్ విక్రయాలు నిషేదించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, పోలీస్ కమిషనర్ తమకు ఆదేశాలు జారీ చేశారని పెట్రోల్ బంక్ యాజమాన్యాలు వెల్లడించాయి. ఈ మేరకు ఎం.జీ రోడ్డులోని పైలట్ సర్వీస్ స్టేషన్ యాజమాన్యం పెట్రోల్, డీజిల్‌ను డబ్బాలలో విక్రయించేది లేదని స్పష్టం చేశాయి

News May 18, 2024

విజయవాడ నుంచి ముంబైకి ప్రత్యేక విమాన సర్వీస్

image

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా మంబై స్వదేశీ సర్వీస్ నడిపేందుకు ఎయిర్ ఇండియా విమాన సంస్థ ముందుకొచ్చింది. జూన్ 15 నుంచి ప్రత్యేక ముంబై సర్వీస్ నడపనున్నట్లు విమాశ్రయ అధికారులు తెలిపారు. వారు మాట్లాడుతూ.. ప్రతిరోజు సాయంత్రం 3.55గంటలకు చేరుకోనున్న సదరు సర్వీస్ రాత్రి 7.10గంటలకు తిరిగి బయలుదేరి 9 గంటలకు ముంబై చేరుకుంటుందన్నారు. ఈ సర్వీస్ 180మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగి ఉంటుందన్నారు.

News May 18, 2024

విజయవాడ: 27 నుంచి మచిలీపట్నం-విశాఖపట్నం రైళ్లు రద్దు

image

విజయవాడ రైల్వే డివిజన్‌లో నిర్వహణ పనుల నిమిత్తం పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 27 నుంచి జాన్ 4 వరకు మచిలీపట్నం-విశాఖపట్నం మధ్య నడిచే రైలు నం.17219, రైలు నం.17220 రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు.

News May 18, 2024

జి.కొండూరు: టైర్ పేలి వ్యక్తి మృతి.. ఇద్దరికి గాయాలు

image

జి.కొండూరులో వ్యాన్ టైర్లు పేలి పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటనలో ప్రవీణ్(36)అనే వ్యక్తి మృతిచెందగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు మంగళగిరికి చెందిన ప్రసాదరావు, ఇర్మీయా, ప్రవీణ్ గేదెల వ్యాపారం చేస్తుంటారు. శుక్రవారం తిరువూరులో గేదెలు కొని మంగళగిరి వెళుతుండగా జి.కొండూరులో వ్యాను టైర్ పేలి ప్రవీణ్ మృతిచెందాడు. సంఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.