Krishna

News May 18, 2024

విజయవాడ పార్లమెంట్‌లో ఓటు వేయని వారు ఎంత మందో తెలుసా.!

image

విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ ముగిసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. కాగా నియోజకవర్గంలో 17,04,077 మంది ఓటర్లు ఉంటే వారిలో 13,69,985 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వివిధ కారణాలతో 3,34,092 మంది ఓటు వేయలేదు. ఇక్కడ నుంచి కేశినేని నాని (వైసీపీ), కేశినేని చిన్ని(కూటమి), తదితరులు పోటీ చేయగా.. ఎవరు గెలుస్తారని మీరనుకుంటున్నారో COMMENT చేయండి. 

News May 18, 2024

కృష్ణా జిల్లాలో 18.9మి.మీల సరాసరి వర్షపాతం

image

అల్పపీడన ద్రోణి ప్రభావంతో కృష్ణా జిల్లాలో 18.9మి.మీల సరాసరి వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. గడిచిన 24గంటల్లో ఈ వర్షపాతం నమోదైందని అన్నారు. అత్యధికంగా అవనిగడ్డలో 49.8 మి.మీలు నమోదవ్వగా అత్యల్పంగా గన్నవరంలో 4.4మి.మీలు నమోదైందని తెలిపారు. జిల్లాలోని 25 మండలాల్లోనూ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు.

News May 17, 2024

అప్రమత్తంగా ఉండండి: డీకే బాలాజి

image

కృష్ణా జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ, పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా రెవెన్యూ అధికారికి చంద్రశేఖర రావుతో కలిసి రెవెన్యూ, పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News May 17, 2024

ఓట్ల లెక్కింపుపై దృష్టి సారించాలి: డీకే బాలాజీ

image

సాధారణ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో, ఓట్ల లెక్కింపుపై దృష్టి సారించాలని, అందుకు తగిన ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా ఎన్నికల అధికారి బాలాజీ అధికారులకు సూచించారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై శుక్రవారం మచిలీపట్నం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ఆయన చర్చించారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎలా ఓట్లు లెక్కించాలో పలు సూచనలు చేశారు.

News May 17, 2024

మచిలీపట్నం: కృష్ణా వర్శిటీ డిగ్రీ ఫలితాలు విడుదల

image

కృష్ణా యూనివర్శిటీ అనుబంధ కళాశాలల డిగ్రీ 6వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల ఉపకులపతి ఆచార్య జ్ఞానమణి శుక్రవారం విడుదల చేశారు. మొత్తం 8,827 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 8,687 మంది (98.41%) ఉత్తీర్ణులు అయ్యారు. అలాగే 1,250 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయగా 51.13 శాతం ఉత్తీర్ణత సాధించారని చెప్పారు.

News May 17, 2024

గుడివాడలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

పట్టణంలోని రైల్వే ట్రాక్ వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు రైల్వే సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. గుడివాడ రైల్వే స్టేషన్ వద్ద రైలు తగిలి వ్యక్తి మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి వయసు సుమారు 50 వరకు ఉంటుందని చెప్పారు. మృతుని ఆచూకీ తెలిసిన యెడల రైల్వే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు.

News May 17, 2024

శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడండి: డీకే బాలాజీ

image

జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ, పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం రెవెన్యూ, పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవల కొన్ని జిల్లాల్లో గొడవలు, అవాంఛనీయ సంఘటనలు జరిగిన దృష్ట్యా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎక్కడా కూడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలన్నారు.

News May 17, 2024

కృష్ణా: యాత్రీకుల కోసం ప్రత్యేక శిబిరం

image

హజ్ యాత్రీకుల కోసం గన్నవరం విమానాశ్రయం వద్ద ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన హజ్ యాత్ర శిబిరం నిర్వహణపై సంబంధిత అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు గన్నవరం ఎయిర్ పోర్ట్ వద్ద దుర్గాపురం GST రోడ్డులో మార్గాన ఉన్న ఈద్గా జమా మసీదు వద్ద హజ్ యాత్ర ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

News May 17, 2024

కోడూరు: కృష్ణా నదిలో గుర్తు తెలియని మృత దేహం లభ్యం

image

మండలలోని ఉల్లిపాలెం గ్రామ సమీపాన కృష్ణా నదిలో గుర్తు తెలియని మృత దేహం లభ్యమైందని కోడూరు ఎస్ఐ శిరీష తెలిపారు. శుక్రవారం రాత్రి ఉల్లిపాలెం పడవల రేవు సమీపంలో మృతదేహం కని పంపించిందని స్థానికులు అందిన సమాచారం మేరకు మృతదేహాన్ని పరిశీలించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుని వయస్సు 40-45 సంవత్సరాలు ఉంటుందని, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఖననం చేశామని చెప్పారు.

News May 17, 2024

జోగి రమేశ్ ప్రయత్నం విఫలమైంది: బోడె ప్రసాద్

image

మైలవరం నుంచి తొత్తులను తెచ్చుకొని పెనమలూరులో గెలవాలనుకున్న జోగి రమేశ్ ప్రయత్నం విఫలమైందని బోడె ప్రసాద్ అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమపై దాడులు చేశారని మండిపడ్డారు. పోలింగ్ రోజు తనకు రావాల్సిన 1,000 ఓట్లు నష్టపోవడానికి ఆయన కారణమన్నారు. తాము ఒక్క మాట చెప్పి ఉంటే ఆ రోజు జోగి రమేశ్ పోరంకి హైస్కూల్ పరిధి దాటేవారు కాదని చెప్పారు. జూన్ 4న ఆట ప్రారంభమవుతుందని బోడె ప్రసాద్ విజయవాడలో అన్నారు.