Krishna

News October 24, 2024

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టండి: మంత్రి

image

నిత్యం రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు బస్సు యజమానులు చర్యలు చేపట్టాలని రవాణా, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. విజయవాడలో నిర్వహించిన ప్రైవేటు ట్రావెల్స్ అసోసియేషన్ సమావేశంలో పలు అంశాలు, సమస్యలు, నూతన విధివిధానాలపై చర్చించారు. అనంతరం మంత్రి రోడ్డు ప్రమాదాల నివారణకు బస్సు యజమానులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

News October 24, 2024

వాసిరెడ్డి పద్మ రాజకీయ పయనమెటు.?

image

AP మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ YCPకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. బుధవారం రాజీనామా చేసిన సమయంలో ఆమె ఆ పార్టీ అధినేత జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అటు ఏ పార్టీలో చేరతారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆమె రాజకీయ పయనంపై జిల్లాలో చర్చ జరుగుతోంది. మరోవైపు, ఆమె జనసేనలో చేరతారనే ప్రచారం ఉంది. వాసిరెడ్డి పద్మ ఏ పార్టీలో చేరతారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News October 24, 2024

కృష్ణా: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

image

మత్స్యశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిన 3 డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఫిషరీస్, జువాలజీ అనుబంధ కోర్సులలో పీజీ చేసినవారు ఈ పోస్టులకు అర్హులు కాగా అభ్యర్థులు ఈ నెల 24లోపు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ నమూనా, విద్యార్హతల వివరాలకై https://fisheries.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చన్నారు. ఎంపికైన వారికి ప్రతి నెలా రూ.45 వేలు రెమ్యునరేషన్ కింద ఇస్తారు.

News October 24, 2024

సొంత చెల్లికి చెందాల్సిన ఆస్తులను జగన్ లాక్కున్నాడు: ఉమా

image

తన సొంత చెల్లి షర్మిలకు చట్టపక్రారం చెందాల్సిన ఆస్తులను జగన్ లాక్కున్నాడని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. ఆస్తులు లాక్కునేందుకు సెప్టెంబర్ 10న మాజీ సీఎం జగన్ హైదరాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)లో పిటిషన్లు దాఖలు చేశాడన్నారు. తల్లిపైనే కేసులు పెట్టి, చెల్లిని మోసం చేసే నైజం జగన్‌దని ఉమా ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.

News October 24, 2024

ముదినేపల్లి: సచివాలయ నిర్మాణానికి అరేకరం పొలం విరాళం

image

రాష్ట్ర సచివాలయ నిర్మాణానికి ముదినేపల్లికి చెందిన అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి అరేకరం పొలంను విరాళంగా అందించారు. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఆమె తండ్రి వైద్యులు మనోజ్‌తో కలిసి, దానికి సంబంధించిన నగదును అందించారు. అరేకరంకు సంబంధించిన రూ.12.5 లక్షలు, హైకోర్టు నిర్మాణానికి రూ.1 లక్ష విరాళంగా అందించారు. గతంలో అమరావతి అభివృద్ధికి ఆమె ఒక ఎకరం (రూ.25 లక్షలు) అందించారు.

News October 23, 2024

కృష్ణా: రేపటితో ముగియనున్న గడువు

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో పీజీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్(Y20 నుంచి Y23 బ్యాచ్‌లు) థియరీ పరీక్షలను డిసెంబర్ 5 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రేపు గురువారంలోపు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.

News October 23, 2024

కృష్ణా: “దానా” ప్రభావంతో రైళ్లు రద్దు

image

“దానా” తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ, గుడివాడలో ప్రయాణికులకు సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. ప్రయాణికులు 0866- 2576924, గుడివాడ 7815909462 హెల్ప్ డెస్క్ నంబర్లలో సంప్రదించవచ్చని సూచించింది.

News October 23, 2024

నవంబర్ 18 నుంచి అయోధ్యలో విశ్వశాంతి మహాయాగం

image

అయోధ్యలో శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహా యాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ యాగాన్ని నవంబర్ 18 నుంచి జనవరి 1 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పాల్గొనే వారు తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు సెల్: 7780252277 సంప్రదించాలన్నారు.

News October 23, 2024

కృష్ణా: ఈ నెల 26తో ముగియనున్న గడువు 

image

ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ITI కళాశాలల్లో అడ్మిషన్ పొందేందుకు 8వ తరగతి పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని విజయవాడ ITI కాలేజీ ప్రిన్సిపల్ ఎం.కనకారావు తెలిపారు. https://www.iti.ap.gov.in/ వెబ్‌సైట్‌లో అడ్మిషన్లకు ఈ నెల 26లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఈ నెల 28న ప్రభుత్వ, 30న ప్రైవేట్ ITI కళాశాలల్లో అడ్మిషన్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

News October 23, 2024

కృష్ణా: ఫీజు చెల్లింపుకు రేపే చివరి తేదీ

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో MBA&MCA చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ, 3వ సెమిస్టర్ థియరీ పరీక్షలను డిసెంబర్ 5 నుంచి నిర్వహిస్తామని KRU వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రేపు గురువారంలోపు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, పూర్తి వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని వర్సిటీ తెలిపింది.