India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. జూన్ 4న వెల్లడయ్యే ఫలితాల కోసం సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా, అభ్యర్థుల మెజారిటీ, గెలుపోటములపై రూ.లక్షల్లో పందేలు కాస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా గన్నవరం, గుడివాడలో రూ.లక్షకు రూ.2 లక్షలు ఇచ్చేలా పందేలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మధ్యవర్తులూ బాగా వెనకేసుకుంటున్నారని, 10 శాతం కమీషన్ తీసుకొని బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
ఎన్టీఆర్ జిల్లా సమాచార శాఖకు మంజూరు చేసిన నికాన్ డీ 850 మోడల్ కెమెరాను గురువారం జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, ఆయన కార్యాలయంలో సమాచార శాఖ అధికారులకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. కేవలం ఒక ఫోటోతో ఎన్నో భావాలను బాహ్య ప్రపంచానికి తెలియజేసే అద్భుత శక్తి ఒక్క ఫోటోగ్రఫీకే ఉంటుందన్నారు. మానవ జీవితానికి ఫోటోగ్రఫీకి అవినాభావ సంబంధం ఉందన్నారు. ఒక్క ఛాయాచిత్రంలో సమాచారం మొత్తం ఇమిడి ఉంటుందని తెలిపారు.
విజయవాడ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో నేటికీ కిటకిటలాడుతూ ఉంది. ఓటు వేసేందుకు వివిధ పట్టణాల నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చిన ఏపీ వాసులు తిరిగి పట్టణాలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పలు రైళ్లు రద్దీగా ఉన్నాయి. రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పడంలేదు. ఒకవైపు ఎండ మరోవైపు వానలు పడటంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
నందిగామ డివిఆర్ కాలనీలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నందిగామ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. యువకుడి పేరు యర్రంశెట్టి చందు అని అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఇతను ఆత్మహత్య చేసుకున్న తీరు అనుమానాస్పదంగా ఉందని తెలుస్తోంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఓ ప్రయాణికుడు ఆటో ఎక్కి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి గుడి వద్ద దిగి తనతో పాటు తెచ్చుకున్న బ్యాగ్ను ఆటోలో మరిచిపోయాడు. కాసేపటికి తేరుకున్న ప్రయాణికుడు విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వారిని సంప్రదించగా.. విజయవాడ కమాండ్ అండ్ కంట్రోల్ నందు సీసీ కెమెరాల ద్వారా ఆటో నంబర్ గుర్తించి, ఆటో డ్రైవర్ను పిలిపించి, వెంటనే బ్యాగుని బాధితుడికి అప్పగించారు.
మచిలీపట్నంలోని కృష్ణా వర్సిటీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ఠ బందోబస్తు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో జూన్ 4 వరకు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని SP అద్నాన్ నయీం అస్మి తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతరం మూడంచెల భద్రత ఉంటుందని చెప్పారు. వర్సిటీకి కిలోమీటరు పరిధిలో ఎక్కువమంది గుమిగూడినా, ప్రజాజీవనానికి ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఉంగుటూరు మండలం ఆత్కూరులో దారుణం జరిగింది. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసిందని సంధ్యారాణిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు బాధిత వర్గం తెలిపింది. ఓట్ల విషయంలో ఘర్షణ జరుగుతుండగానే.. ఈ మహిళను అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఏడుకొండలు ట్రాక్టర్తో ఢీకొట్టినట్లు తెలుస్తోంది. బాధితురాలి కాళ్లకు గాయాలు కాగా, గన్నవరం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమెను వల్లభనేని వంశీ పరామర్శించారు.
పోలింగ్ ముగిసి, ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వేళ టీడీపీ, వైసీపీ నేతలు తమదే గెలుపు అంటూ ప్రకటిస్తున్నారు. చంద్రబాబు నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని బుద్దా వెంకన్న నిన్న విజయవాడలో ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, మెజార్టీ స్థానాలు తాము గెలుస్తున్నామని, వైసీపీ శ్రేణులు సంబరాలకు సిద్ధం కావాలని జోగి రమేశ్ పెనమలూరులో అన్నారు. ఇరు పార్టీల నేతల వ్యాఖ్యలపై మీ COMMENT.
కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో నగరంలోని డా. ప్రేమ్ కుమార్ దగ్గరకు తీసుకువెళ్లారు. ఆయన పర్యవేక్షణలో అక్కడి నుంచి విజయవాడ రమేశ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కొనకళ్ల ఆరోగ్యం నిలకడగా ఉందని, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందవద్దని టీడీపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.
గుడివాడ మండలం శేరీవేల్పూరుకు చెందిన హారికకు విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన రామ్సాయికి 8 నెలల కిందట వివాహమైంది. ఎన్నికల సందర్భంగా హారిక సొంతూరు వచ్చి ఓటు వేసింది. తిరిగి విజయవాడ పంపించేందుకు నర్సాపూర్ రైలు ఎక్కిద్దామని కూతురిని తండ్రి టీవీఎస్ మోపెడ్పై తీసుకెళ్తుండగా బొమ్మూలూరు రామాలయం వద్ద ట్రాక్టర్.. మోపెడ్ను ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లింది. తండ్రి కళ్లదుటే హారిక మృతిచెందింది.
Sorry, no posts matched your criteria.