Krishna

News May 16, 2024

కృష్ణా: లోక్‌సభ స్థానాలకు ఎంత మంది ఓటేశారంటే.!

image

విజయవాడ లోక్ సభ పరిధిలో మొత్తం 17,04,077 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 13,52,495 మంది ఓటేశారు. 79.37 శాతంగా పోలింగ్ నమోదైంది. మరోవైపు మచిలీపట్నం లోక్‌సభ పరిధిలో 15,39,460 మంది ఓటర్లు ఉంటే.. వారిలో 12,93,935 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 84.05శాతంగా పోలింగ్ నమోదైంది. గెలుపుపై అభ్యర్థులు ధీమాగానే ఉన్నా, జూన్ 4 కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

News May 16, 2024

విజయవాడ: పవర్ లిఫ్టింగ్ పోటీలలో దేశానికి కీర్తి తీసుకొచ్చిన భరత్‌

image

చైనాలో జరిగిన ఎషియన్‌ యూనివర్శిటీ పవర్‌లిఫ్టింగ్‌ పోటీల్లో బంగారు పతకాన్ని సాధించిన కేబీఎన్‌ కళాశాల విద్యార్థి భరత్‌కుమార్‌ ప్రతిభ దేశానికే గర్వకారణమని ఆ కళాశాల కార్యదర్శి తూనికుంట్ల శ్రీనివాసు చెప్పారు. ఈ సందర్భంగా కళాశాల కమిటీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భరత్‌ పవర్ లిఫ్టింగ్ పోటీలలో బంగారు పథకాన్ని సాధించి భారత దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు.

News May 15, 2024

పామర్రు: రహదారిపై అగ్ని ప్రమాదం.. దగ్ధమైన కారు

image

పామర్రు నియోజకవర్గం కురుమద్దాలి వద్ద ప్రధాన రహదారిపై కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మేరకు స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన ప్రాంతానికి వచ్చి మంటలను ఆర్పేశారు.. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News May 15, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాలో గెలుపు ఎవరిది.?

image

2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు 14 స్థానాల్లో గెలిచి పూర్తి ఆధిక్యం సాధించింది. టీడీపీ కేవలం 2 స్థానాలు (గన్నవరం , విజయవాడ ఈస్ట్) కే పరిమితమైంది. అటు 2 పార్లమెంట్ స్థానాల్లో చెరొకటి గెలుపొందాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయకేతనం ఎగురవేసే పార్టీ ఏదో కామెంట్ చేయండి.

News May 15, 2024

కృష్ణా: క్రికెట్ మ్యాచ్‌ల తరహా పొలిటికల్ బెట్టింగ్ 

image

తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినప్పటికీ, గెలుపు మాదంటే మాదంటూ ఆయా రాజకీయ పార్టీలకు చెందిన బెట్టింగ్ రాయుళ్లు పందాలు కాస్తున్నారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగులను తలదన్నేలా కోట్ల రూపాయలలో బెట్టింగులు కొనసాగుతున్నాయి. కోడిపందాల మాదిరిగా పందాలు కాస్తున్నారు. ఒక నియోజకవర్గంతో సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాలలో పందాలు సాగుతున్నాయని పలువురు చర్చిచుంకుంటున్నారు.

News May 15, 2024

NTR: జిల్లాలో ఎస్సీ నియోజకవర్గాల్లో అత్యధిక పోలింగ్

image

ఎన్టీఆర్ జిల్లాలో అత్యధిక పోలింగ్ శాతం జగ్గయ్యపేట నియోజకవర్గం (89.88%) లో నమోదు కాగా ఆ తరువాత రెండు స్థానాలను ఎస్సీ నియోజకవర్గాలైన తిరువూరు (87.68%), నందిగామ (87.56%) కైవసం చేసుకున్నాయి. 2019 ఎన్నికల్లో ఈ రెండు ఎస్సీ నియోజకవర్గాల్లో వైసీపీ విజయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. మరి ఈసారి తిరువూరు, నందిగామ నియోజకవర్గాల్లో జెండా ఎగురవేసేదెవరో కామెంట్ చేయండి.

News May 15, 2024

విజయవాడ వెస్ట్‌లో 66.46% పోలింగ్

image

విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో 66.46% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఇది ఎన్టీఆర్ జిల్లాలోనే అత్యల్పం. నియోజకవర్గంలో మొత్తం 2,55,963 మంది ఓటర్లకు గానూ 1,70,104 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 85,255 మంది ఉండగా, మహిళా ఓటర్లు 84,833, ఇతరులు 16 మంది ఉన్నారు. నగరంలో ఇంత తక్కువ ఓటింగ్ నమోదవడం చర్చనీయంశమైంది.

News May 15, 2024

మైలవరం: ఇక్కడ 99.22 శాతం పోలింగ్

image

మైలవరం నియోజకవర్గంలో 85.36 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, నియోజకవర్గ పరిధిలోని రెడ్డిగూడెం మండలంలో ఓటర్ల చైతన్యం కనిపించింది. అడవి కొత్తూరు గ్రామంలోని 8వ పోలింగ్ కేంద్రంలో 99.22 శాతం మంది ఓటేశారు. మొత్తం 129 మంది ఓటర్లకు గానూ 128 మంది ఓటేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ పోలింగ్ బూత్‌లోనే అత్యధిక శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం.

News May 15, 2024

విజయవాడ లోక్ సభ స్థానంలో 79.36% మేర పోలింగ్

image

* తిరువూరులో 2,07,190 మందికి 1,81,669 (87.68%)* విజయవాడ వెస్ట్ లో 2,55963 మందికి 1,70,104 (66.46%) (అత్యల్పం)* విజయవాడ సెంట్రల్ లో 2,77,724 మందికి 2,02,635 (72.96%)* విజయవాడ ఈస్ట్ లో 2,70,624 మందికి 1,93,026 (71.33%)* మైలవరంలో 2,81,732 మందికి 2,40,487 (85.36%)* నందిగామలో 2,05,480 మందికి 1,79,915 (87.56)* జగ్గయ్యపేటలో 2,05,364 మందికి 1,84,575 (89.88%) (అత్యధికం)

News May 15, 2024

ఎన్టీఆర్ జిల్లాలో అత్యధిక పోలింగ్ ఇక్కడే.!

image

ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 79.36శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా జగ్గయ్యపేటలో 89.88%, విజయవాడ పశ్చిమలో 66.46శాతం మంది ఓటేశారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే..
* విజయవాడ సెంట్రల్- 72.96%
* విజయవాడ తూర్పు- 71.33%
* తిరువూరు- 87.68%
* నందిగామ- 87.56%
* మైలవరం- 85.36%