Krishna

News May 14, 2024

కృష్ణా : ఓటు వేసేందుకు వచ్చి.. వివిధ కారణాలతో నలుగురి మృతి

image

కృష్ణా జిల్లాలో సోమవారం విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ఓటేయడానికి వచ్చిన పలువురు వివిధ కారణాలతో మృతి చెందారు. పెనమలూరుకు చెందిన ఈశ్వరరావు(72) ఓటేసిన తర్వాత అస్వస్థతకు గురై మరణించగా.. పెనమలూరు మం. పెదపులిపాకకు చెందిన వెంకటేశ్వరరావు(75), కైకలూరు వాసి ప్రభాకరరావు(65) ఓటేసేందుకు వరుసలో ఉండగా గుండెపోటుతో మృతి చెందారు. వీరితో పాటు మేడూరుకు చెందిన నాగభూషణం(54) ఓటుకు వెళ్తూ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.

News May 14, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యధిక పోలింగ్ ఇక్కడే..

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో సోమవారం ఓటర్ల చైతన్యం కనిపించింది. గంటల తరబడి క్యూలైన్లలో నిల్చొని ఓట్లు వేశారు. తాజా సమాచారం మేరకు.. పెడనలో అత్యధికంగా 87.72% పోలింగ్ నమోదైంది. విజయవాడ వెస్ట్‌లో అత్యల్పంగా 68.55% మంది ఓటేశారు. కొన్ని చోట్ల పోలింగ్ ఆలస్యమైన నేపథ్యంలో ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

News May 14, 2024

ఎన్టీఆర్: స్ట్రాంగ్ రూమ్‌కు చేరుకున్న ఈవీఎంలు

image

ఎన్టీఆర్ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ పూర్తవ్వడంతో ఎన్నికల కమిషన్ అధికారులు ఈవీఎంల భద్రతపై దృష్టి పెట్టారు. ఇబ్రహీంపట్నంలోని స్ట్రాంగ్ రూమ్‌కు చేరుకున్నాయి. పోలింగ్ ముగియగానే ఈవీఎంలకు సీల్ వేసి స్ట్రాంగ్ రూమ్ లకు తరలించారు. ఈవీఎంలను రిటర్నింగ్ అధికారుల సమక్షంలో పటిష్ఠమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు చేర్చారు. స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర కేంద్ర, రాష్ట్ర బలగాలు మూడంచెల పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశాయి.

News May 14, 2024

విజయవాడ: ICU నుంచి వచ్చి ఓటేశారు

image

కృష్ణా జిల్లాలో సోమవారం ఓటర్ల చైతన్యం కనిపించింది. ఓ వ్యక్తి ఏకంగా ఐసీయూ నుంచి వచ్చి ఓటేశారు. విజయవాడకు చెందిన గోవాడ వెంకటశ్వరరావు (68) ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ఓ ఆస్పత్రిలోని ఐసీయూలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో నిన్న పోలింగ్ డే కాగా, విజయవాడ సెంట్రల్‌లోని 131వ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

News May 14, 2024

కృష్ణా: ఓటేసిన 3 తరాల మహిళలు

image

విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని లయోలా కళాశాల పోలింగ్ బూత్ వద్ద సోమవారం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాలకు చెందిన వ్యక్తులు ఓటేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. రాజ్యాంగం పౌరులకు అందజేసిన ఓటు హక్కును వినియోగించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు.

News May 13, 2024

విజయవాడ: ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్ దంపతులు

image

సెంట్రల్ నియోజకవర్గంలోని రైల్వే ఫంక్షన్ హాల్ పోలింగ్ కేంద్రంలో ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డిల్లీరావు, ప్రశాంతి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో పౌరులు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని కలెక్టర్ పేర్కొన్నారు.

News May 13, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య విజ్ఞప్తి

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా సికింద్రాబాద్‌కు సోమవారం సాయంత్రం ప్రత్యేక ట్రైన్ నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే ట్రైన్ నం.07098 సోమవారం అర్ధరాత్రి ఒంటి గంటకు విజయవాడ చేరుకొని రేపు ఉదయం 8.15కి సికింద్రాబాద్ చేరుకుంటుందన్నారు. ఏపీలో ఈ ట్రైన్ విజయవాడతో పాటు కృష్ణా కెనాల్, సత్తెనపల్లి, గుంటూరుతో పాటు ఇతర ప్రధాన స్టేషన్లలో ఆగుతుందన్నారు.  

News May 13, 2024

కంకిపాడులో ఓటు వేసిన సినీ నటి శ్రీరెడ్డి

image

కృష్ణా జిల్లా కంకిపాడులోని స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కేంద్రంలో, సోమవారం సినీ నటి శ్రీరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేసి వెళ్లారు. పంచాయతీ బూత్‌లో ఓటింగ్ కార్యక్రమం సజావుగా కొనసాగుతోంది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో మళ్లీ మంచి ప్రభుత్వం ఏర్పడుతోందని తెలిపారు.

News May 13, 2024

మైలవరం మండలంలో వైసీపీ నేతపై దాడి

image

మండలంలోని పోలింగ్ కేంద్రం వద్ద <<13238232>>ఉధృత వాతావరణం<<>> చోటు చేసుకుంది. వైసీపీ నాయకుడు కొత్తపల్లి వెంకటేశ్వరరావుపై టీడీపీ నాయకుడు దాడి చేశాడు. టీడీపీ నేత శ్యామ్ కుర్చీతో దాడి చేయటంతో వెంకటేశ్వరరావు తలకు తీవ్ర గాయాలు అయినట్లు వైసీపీ నేతలు తెలిపారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు.

News May 13, 2024

మచిలీపట్నం 144వ నంబర్ పోలింగ్ బూత్ EVMలో సాంకేతిక లోపం

image

మచిలీపట్నం 39వ డివిజన్ పరిధిలోని 144వ నంబర్ పోలింగ్ బూత్‌లో పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన EVMలో సాంకేతిక లోపం చోటుచేసుకుంది. మాక్ పోల్‌లో EVM స్ట్రక్ అయింది. అధికారులు అప్పటికప్పుడు సాంకేతిక లోపాన్ని పరిష్కరించారు.