India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రకాశం బ్యారేజీకి శనివారం భారీగా వరద కొనసాగుతోంది. సాగర్ నుంచి దిగువకు వచ్చిన నీటిని వచ్చినట్టుగా విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి నీటి విడుదల పెరగడంతో పులిచింతల, ప్రకాశం బ్యారేజీకి కూడా వరద పోటు పెరిగింది. దీంతో 40 గేట్లను 2 అడుగుల మేర, 30 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 84,297 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బందులు లేవని అధికారులు తెలిపారు.
వరద బాధితులకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ వైసీపీ నేతలు శనివారం గవర్నర్ అబ్దుల్ నజీర్కు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు విజయవాడ రాజ్భవన్లో వైసీపీ నేతలు దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, షేక్ ఆసిఫ్, రాయన భాగ్యలక్ష్మి తదితరులు గవర్నర్ను కలిశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బాధితులకు న్యాయం జరిగి, నష్టపరిహారం అందే వరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు.
రాజధాని అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు మీదుగా వెళ్లే విజయవాడ బైపాస్ రోడ్ పనులను సీఎం చంద్రబాబు శనివారం పరిశీలించారు. బైపాస్ రోడ్ పనుల పురోగతి గురించి సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మంత్రి నారాయణ, CRDA అధికారులు పాల్గొన్నారు. కాగా ఈ బైపాస్ రోడ్ పూర్తయితే అమరావతి, విజయవాడ- గుంటూరు పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఎద్దడి తగ్గుతుంది.
ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ నుంచి విశాఖపట్నంకు ప్రతి రోజూ ఇంద్ర AC బస్సు నడుపుతున్నామని RTC ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 9.30 గంటలకు విజయవాడలో బయలుదేరే ఈ బస్సు సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందని, తిరుగుప్రయాణంలో మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి రాత్రి 9 గంటలకు విజయవాడ చేరుకుంటుందని, ప్రయాణికులు ఈ సర్వీసును ఆదరించాలని RTC వర్గాలు విజ్ఞప్తి చేశాయి.
విజయవాడ నుంచి తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి వెళ్లేవారికి IRCTC స్పెషల్ ప్యాకేజ్ ప్రవేశపెట్టింది. ఈ నెల 31న ఈ ప్యాకేజ్లో భాగంగా ట్రైన్ విజయవాడ నుంచి తిరుమల బయలుదేరుతుందని IRCTC తెలిపింది. తిరుమల వెళ్లేవారు కంఫర్ట్, స్టాండర్డ్ తరగతులలో ఈ ట్రైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చని, పూర్తి వివరాలకు https://www.irctctourism.com/ అధికారిక వెబ్సైట్ చూడాలని సూచించింది.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో హోటల్ & హాస్పిటల్ మేనేజ్మెంట్, HIV/ ఎయిడ్స్ కౌన్సెలింగ్లో సర్టిఫికెట్ కోర్సులు చేసేవారు రాయాల్సిన పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. హోటల్ & హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సు పరీక్షలు ఈ నెల 27, 28 తేదీలలో, HIV/ ఎయిడ్స్ కౌన్సెలింగ్ కోర్సు పరీక్షలు ఈ నెల 27,28,29 తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తామని ANU(డిస్టెన్స్)పరీక్షల విభాగం తెలిపింది.
DSC పరీక్షకు దరఖాస్తు చేసుకున్న SC,ST అభ్యర్థులకు ప్రభుత్వం ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ అధికారి బి. మోహనరావు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. శిక్షణలో చేరే విద్యార్థులు ఈ నెల 21లోపు జ్ఞానభూమి వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, ఈ నెల 27న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించ మెరిట్ లిస్ట్ ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇస్తామని ఆయన చెప్పారు.
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా దూర విద్య ద్వారా SSC, ఇంటర్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈ నెల 25తో ముగియనుంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సార్వత్రిక విద్యాపీఠం కో-ఆర్డినేటర్ బాబురావు తెలిపారు. అడ్మిషన్స్కు సంబంధించి పూర్తి వివరాలకు https://aposs.aptonline.in/APOSSAMARAVATI/UI/StudentForms/CandidateHomePage.aspx వెబ్సైట్ చూడాలన్నారు.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ఇటీవల నిర్వహించిన డిగ్రీ కోర్సుల వన్ టైం ఆపర్చ్యునిటీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో PG కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్(Y19 నుంచి Y23 బ్యాచ్లు) థియరీ పరీక్షలను డిసెంబర్ 30 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 24లోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవాలని వర్సిటీ తెలిపింది.
Sorry, no posts matched your criteria.