Krishna

News May 13, 2024

కృష్ణా జిల్లా ఎన్నికల సంగ్రామంలో 94 మంది

image

నేడు జరగనున్న ఎన్నికల కురుక్షేత్రంలో కృష్ణా జిల్లా నుంచి 94 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మచిలీపట్నం పార్లమెంట్‌కు 15 మంది పోటీ పడుతుండగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 79 మంది పోటీ పడుతున్నారు. గన్నవరంలో 12, గుడివాడలో 12, పెడనలో 10, మచిలీపట్నంలో 10, అవనిగడ్డలో 12, పామర్రులో 08, పెనమలూరులో 11 మంది పోటీ పడుతున్నారు. ప్రధాన పోటీ వైసీపీ, కూటమి (టీడీపీ+జనసేన) అభ్యర్థుల మధ్యే నెలకొంది.

News May 13, 2024

కృష్ణా జిల్లాలో మొదలైన మాక్ పోలింగ్

image

కృష్ణా జిల్లాలో మాక్ పోలింగ్ మొదలైంది. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో అధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పోలింగ్ సమయానికి 90 నిమిషాల ముందు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. కొన్ని చోట్ల ఏజెంట్లు రాకపోవడంతో మాక్ పోలింగ్‌ ఆలస్యమైంది. ఈ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

News May 13, 2024

విజ‌య‌వాడ: హ‌రిత పోలింగ్ కేంద్రాన్ని సంద‌ర్శించిన క‌లెక్ట‌ర్

image

ఓటు హ‌క్కు ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ పోలింగ్ కేంద్రానికి వెళ్లి త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డిల్లీరావు పిలుపునిచ్చారు. సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గంలో హ‌రిత పోలింగ్ కేంద్రాన్ని క‌లెక్ట‌ర్ సంద‌ర్శించారు. ప్ర‌తి ఒక్క‌రూ ఓటు హ‌క్కు వినియోగించుకునేలా ఓట‌ర్ల‌ను ప్రోత్స‌హించే ల‌క్ష్యంతో ఏడు నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోనూ ప్ర‌త్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News May 12, 2024

విజయవాడ: కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

image

విజయవాడలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కొత్తపేట పోలీసులు తెలిపిన వివరాల మేరకు కొసనం పూజిత ఆమె భర్త వెంకటేశ్వరరావు మధ్య ఇటీవల వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పూజిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు . భర్త వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.

News May 12, 2024

అక్కడ కేంద్ర బలగాలు మోహరించండి: బీజేపీ

image

ధర్మవరం, జమ్మలమడుగు పోలింగ్ బూత్‌లలో అవాంచనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందని, ఆ నియోజకవర్గాలలో వెంటనే కేంద్ర భద్రతా బలగాలను నియమించాలని బీజేపీ కోరింది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఎన్నికల కమిషనర్ ముకేశ్ మీనా, డీజీపీ హరీష్ గుప్తాలను ఈ రోజు కలిసిన బీజేపీ నేతలు కిలారి దిలీప్, సాదినేని యామిని శర్మ వారికి వినతి పత్రం అందజేశారు.

News May 12, 2024

విజయవాడలో 22న రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలు

image

పట్టణంలోని గురునానక్ కాలనీలోని గేట్స్ కళాశాల ఆవరణలో మే 22వ తేదీ నుంచి రాష్ట్రస్థాయి సీనియర్ ఓపెన్ చదరంగం పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా చెస్ సంఘ కార్యదర్శి మందుల రాజు ఆదివారం తెలిపారు. ఈ పోటీలకు సంబంధించిన వాడ పత్రికను ఆయన కళాశాల యాజమాన్యంతో కలిసి విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ పోటీలలో గెలుపొందిన వారికి ప్రశంసా పత్రాలతో పాటు జ్ఞాపికలు, నగదు బహుమతులు కూడా అందిస్తామన్నారు.

News May 12, 2024

కృష్ణా జిల్లాలో పోలింగ్‌కు సర్వం సిద్ధం

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కృష్ణా జిల్లాలో పోలింగ్ నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మొత్తం 1768 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ నిర్వహించనుండగా 15,39,460 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

News May 12, 2024

కృష్ణా జిల్లాలో పోలింగ్ సర్వం సిద్ధం

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కృష్ణా జిల్లాలో పోలింగ్ నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మొత్తం 1768 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ నిర్వహించనుండగా 15,39,460 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

News May 12, 2024

కృష్ణా జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఎన్నో తెలుసా..?

image

కృష్ణా జిల్లాలో మొత్తం 1768 పోలింగ్ స్టేషన్లు ఉండగా ఇందులో 364 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా అధికారులు గుర్తించారు. అత్యధికంగా గన్నవరం నియోజకవర్గంలోనే 106 పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మకంగా గుర్తించారు. గుడివాడలో 52, పెడనలో 37, మచిలీపట్నంలో 30, అవనిగడ్డలో 49, పామర్రులో 42, పెనమలూరులో 46 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి.

News May 12, 2024

కృష్ణా జిల్లాలో పోలింగ్ సర్వం సిద్ధం

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కృష్ణా జిల్లాలో పోలింగ్ నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మొత్తం 1768 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ నిర్వహించనుండగా 15,39,460 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.