Krishna

News November 10, 2024

పామర్రు: ఈ ఆలయంలో భక్తులే పూజారులు

image

పామర్రు మండలం ఉండ్రపూడిలోని సువర్చలా సమేతంగా వెలసిన వీరాంజనేయస్వామి ఆలయం ప్రసిద్ధమైంది. 40 దశాబ్దాల కిందట వెలసిన ఈ స్వామి కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తులు చెబుతున్నారు. విద్యలో రాణించడానికి చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు ఈ స్వామిని దర్శించుకుంటారు. ప్రతి రోజూ ఇక్కడ విశేష అర్చనలు, మంగళ, శనివారాలు ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తులే పూజారులై ఈ స్వామికి అర్చనలు, అభిషేకాలు చేయటం విశేషం.

News November 10, 2024

ఏలూరు, తాడేపల్లిగూడెం వెళ్లే ప్రయాణికులకు గమనిక

image

ట్రాఫిక్ నిర్వహణ కారణాల రీత్యా నం.13351 ధన్‌బాద్-అలప్పుజ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్‌ నవంబర్ 11,12 తేదీలలో ఏలూరు, తాడేపల్లిగూడెం మీదుగా కాక విజయవాడ-గుడివాడ-భీమవరం టౌన్ గుండా నిడదవోలు చేరుకుంటుందన్నారు. నవంబర్ 11,12 తేదీలలో ఈ ట్రైన్‌కు ఏలూరు, తాడేపల్లిగూడెంలో స్టాప్ లేదన్నారు. 

News November 10, 2024

కూచిపూడి థీమ్‌తో టెర్మినల్ డిజైన్లు ఉండాలి: చంద్రబాబు

image

కూచిపూడి నాట్యానికి మరింత ప్రాచుర్యం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గన్నవరంలో విమానాశ్రయ టెర్మినల్ డిజైన్లు కూచిపూడి థీమ్‌తో నిర్మించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. శనివారం ఎయిర్ పోర్టు విస్తరణ పనులపై ఆయన తన నివాసంలో సమీక్షించారు. ఈ సమీక్షలో టెర్మినల్ బిల్డింగ్ డిజైన్ల నిర్మాణంలో మన సంస్కృతీ సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఉండాలని సీఎం సూచించారు. 

News November 10, 2024

గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష

image

గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణ పనులపై సీఎం చంద్రబాబు శనివారం సమీక్ష నిర్వహించారు. ఇందులో కేంద్ర మంత్రి రామ్మోహన్, మంత్రి జనార్ధనరెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రజెంటేషన్ ద్వారా ప్రస్తుతం పనులు జరుగుతున్న తీరును, పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు. ఎయిర్‌పోర్టులో జరుగుతున్న న్యూ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనులు 2025 జూన్ నాటికి పూర్తి చేయాలని సీఎం అధికారులకు ఈ సమీక్షలో సూచించారు. 

News November 10, 2024

కృష్ణా: MBA పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్-2024లో నిర్వహించిన MBA 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది. 

News November 10, 2024

రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి: APSDMA ఎండీ 

image

నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) ఎండీ కూర్మనాథ్ తెలిపారు. దీని కారణంగా మంగళ, బుధ, గురువారాల్లో దక్షిణకోస్తాలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూర్మనాథ్ సూచించారు. 

News November 9, 2024

కృష్ణా: బీఈడీ పరీక్షల ఫలితాలు విడుదల 

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఆగస్టు-2024లో నిర్వహించిన బీఈడీ 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది. 

News November 9, 2024

కృష్ణా: బీఈడీ పరీక్షల షెడ్యూల్ విడుదల 

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో బీఈడీ, స్పెషల్ బీఈడీ 2వ సెమిస్టర్(2020,21,22బ్యాచ్‌లు) విద్యార్థులు రాయాల్సిన థియరీ పరీక్షలను నవంబర్ 26 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 11లోపు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, పూర్తి వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది. 

News November 9, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

నూజివీడు- వట్లూరు సెక్షన్‌లో ట్రాఫిక్ నిర్వహణ పనులు జరుగుతున్నందున నం.08567 విశాఖపట్నం- విజయవాడ జనసాధారణ్ రైలును అధికారులు దారి మళ్లించారని తెలిపారు. ఈ నెల 13న ఈ రైలు గన్నవరం- ఏలూరు- తాడేపల్లిగూడెం మీదుగా కాక గుడివాడ- భీమవరం టౌన్ మీదుగా నిడదవోలు చేరుకుంటుందన్నారు. రైలు ప్రయాణికులు గమనించాలని కోరుతూ అధికారులు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

News November 9, 2024

ఆగిరిపల్లి: పెళ్లికాని వారికి ఈ ఆలయం వరం

image

కృష్ణాజిల్లా ఆగిరిపల్లిలో స్వయంభూగా వెలసిన వ్యాఘ్ర నరసింహుడు కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తులు చెబుతున్నారు. కృతయుగంలో మహారాజు శుభవ్రత మహావిష్ణువుకోసం తపస్సు చేస్తే స్వామి ఇక్కడ వెలిశాడని ప్రతీతి. వివాహం కానివారు ఇక్కడ శాంతి కళ్యాణం చేయిస్తే పెళ్లి కుదురుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ ఆంజనేయుడు క్షేత్రపాలకుడిగా యోగముద్రలో దర్శనమిస్తాడు. శివరాత్రి, కార్తీక మాసంలో ఇక్కడ దీపోత్సవం నిర్వహించడం విశేషం.