India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజుల గడువును పాఠశాల విద్యాశాఖ పొడిగించింది. గతంలో ప్రకటించిన గడువు ప్రకారం అపరాధ రుసుము లేకుండా అక్టోబరు 28కి ఫీజులు చెల్లించాల్సి ఉంది. అయితే ఆ గడువును ఈ నెల 18 వరకు పెంచుతూ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ఆదేశాలు జారీచేశారు. రూ.50 అపరాధ రుసుముతో ఈ నెల 25 వరకు రూ.200 అపరాధ రుసుముతో చెల్లించవచ్చు అన్నారు.

కోడూరు మండలంలో కీచక టీచర్ మూడో తరగతి చదువుతున్న బాలికపై అసభ్యంగా ప్రవర్తించడంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక తల్లిదండ్రులు కోరుచున్నారు. బాలికపై జరిగిన ఈ దారుణం పాప తమకు చెప్పడానికే భయపడిందని, అంతలా భయపెట్టాడని వాపోయారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో టీచర్పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గత ఐదు నెలల్లో కోడూరు మండలంలో ఇలాంటి ఘటనలు నాలుగు చోటు చేసుకోవడం, ముగ్గురు ఉపాధ్యాయులు సస్పెండ్ కావడం గమనార్హం.

ప్రేమ పెళ్లి చేసుకున్న తమకు తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలని సరిధే భూమికశ్రీ కోరారు. సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాజమహేంద్రవరం రాజేంద్రనగర్కు చెందిన తాను అదే ప్రాంతానికి చెందిన పెనుమచ్చల హరిప్రసాద్తో గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నామని తెలిపారు. విషయం తెలుసుకున్న తమ తల్లిదండ్రులు చంపేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు.

మచిలీపట్నంలో కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సుభాష్ వాసంశెట్టితో సోమవారం కలెక్టర్ DK బాలాజీ, ఎస్పీ ఆర్.గంగాధర్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మచిలీపట్నం ఆర్అండ్బీ అతిథిగృహంలో ఈ భేటీ జరిగింది. ఈ మేరకు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న పలు పథకాలు, కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టుల గురించి కలెక్టర్ DK బాలాజీ, మంత్రి సుభాష్కు వివరించారు.

పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహిస్తున్న ఎస్జీఎఫ్ బాస్కెట్బాల్ అండర్ 14 రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి కృష్ణాజిల్లా బాలికల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో తూర్పుగోదావరి జట్టుపై తలపడి ఓటమిపాలైంది. అయితే కృష్ణాజిల్లా జట్టు నుంచి కుసుమ, ఆర్ వాహినిలు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు కోచ్ వాకా నాగరాజు తెలిపారు.

విజయవాడ వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా ఖాతాలపై ఆదివారం పోలీసులు 45 కేసులు నమోదు చేశారు. చింతాప్రదీప్ రెడ్డి దర్శన్ పిఠాపురం పావలా ఏకే ఫ్యాన్ అనే సోషల్ మీడియా ఎకౌంట్లపై జనసేన, టీడీపీ నేతలు ఫిర్యాదు చేసిన మేరకు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మాచవరం గుణదల పోలీస్ స్టేషన్లో వీరి అకౌంట్లపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

కృష్ణా యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలో బీటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ(Y20-Y23 బ్యాచ్లు), 5వ(Y20-Y22 బ్యాచ్లు), 7వ(Y20-Y21 బ్యాచ్లు) సెమిస్టర్ రెగ్యులర్&సప్లిమెంటరీ థియరీ పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ ఇటీవల విడుదలైంది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు రేపు సోమవారంలోపు ఎలాంటి అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని KRU పరీక్షల విభాగం తెలిపింది. వివరాలకై https://kru.ac.in/ వెబ్సైట్ చూడవచ్చు.

విజయవాడ మీదుగా ప్రయాణించే విశాఖపట్నం(VSKP)- చెన్నై ఎగ్మోర్(MS) స్పెషల్ రైళ్లకు 2 అదనపు కోచ్లు జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.08557/08558 రైళ్లకు 1 ఏసీ 3 టైర్, ఒక స్లీపర్ కోచ్ను అదనంగా జత చేస్తున్నామన్నారు. నం.08557 VSKP- MS రైలును నవంబర్ 9,16, 23,30వ తేదీలలో, నం.08558 MS-VSKP రైలును నవంబర్ 3,10,17,24, డిసెంబర్ 1వ తేదీన ఈ అదనపు కోచ్లతో నడుపుతామన్నారు.

DSC పరీక్షకు దరఖాస్తు చేసుకున్న SC, ST అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణకై దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్లైన్లో మొదట నవంబర్ 3న స్ర్కీనింగ్ టెస్ట్ నిర్వహించాల్సి ఉంది. దానిని 10వ తేదీకి వాయిదా వేయడం జరిగిందని కృష్ణా జిల్లా సోషల్ వెల్ఫేర్ DD షాహిద్ బాబు చెప్పారు. స్క్రీనింగ్ టెస్ట్ వివరాలకు అభ్యర్థులు జ్ఞానభూమి వెబ్సైట్ చూడాలని షాహిద్ బాబు సూచించారు.

టీడీపీ పాలనతో ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చాయని, ఇకపై మంచి రోడ్లూ వస్తాయని మంత్రి కొలుసు పార్థసారథి శనివారం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.860 కోట్లతో గుంతలు పడిన రోడ్లను బాగుచేసే పనులు మొదలుపెట్టామని కొలుసు పేర్కొన్నారు. ప్రజల భద్రత, సౌకర్యమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని కొలుసు ఈ మేరకు ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.