Krishna

News September 18, 2024

రేపు విజయవాడలో షర్మిల నిరాహార దీక్ష

image

విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి రేపు ఉదయం 10 గంటలకు నిరాహార దీక్షలో పాల్గొననున్నారు. రాహుల్ గాంధీపై బీజేపీ, శివసేన పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలకు ఆమె నిరసనగా దీక్ష చేపట్టనున్నారు. బీజేపీ, శివసేన నేతలు క్షమాపణ చెప్పాలని షర్మిల డిమాండ్ చేయనున్నారు.

News September 17, 2024

గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల అభ్యర్థులపై TDP కసరత్తు

image

కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై అధికార TDP కసరత్తు చేస్తోంది. దేవినేని ఉమా, ఆలపాటి రాజా, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, కోవెలమూడి రవీంద్ర(నాని), కిలారు నాగ శ్రావణ్, ఎంఎస్ బేగ్ పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. పార్టీ కోసం కష్టపడిన, యువతకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. యూత్ కోటాలో నాగశ్రావణ్ పేరు బలంగా వినిపిస్తోంది.

News September 17, 2024

ఎన్టీఆర్: వినాయక లడ్డు దక్కించుకున్న ముస్లిం దంపతులు

image

కంచికచర్ల మండలం గొట్టుముక్కలలోని వేణుగోపాల స్వామి ఎదురుగా ఏర్పాటు చేసిన వినాయకుని లడ్డును సోమవారం రాత్రి వేలం వేశారు. అయితే వేలంపాటలో గ్రామానికి చెందిన షేక్ మొగలా సాహెబ్, మమ్మద్ దంపతులు వేలంలో పాల్గొని లడ్డూను రూ.27,116లకు దక్కించుకున్నారు. దీంతో విఘ్నేశ్వరుడు మతాలకు అతీతుడైన దేవుడని వీరు నిరూపించగా.. పలువురు వీరిని అభినందించారు.

News September 17, 2024

ఎన్టీఆర్: వినాయక లడ్డు దక్కించుకున్న ముస్లిం దంపతులు

image

కంచికచర్ల మండలం గొట్టుముక్కలలోని వేణుగోపాల స్వామి ఎదురుగా ఏర్పాటు చేసిన వినాయకుని లడ్డును సోమవారం రాత్రి వేలం వేశారు. అయితే వేలంపాటలో గ్రామానికి చెందిన షేక్ మొగలా సాహెబ్, మమ్మద్ దంపతులు వేలంలో పాల్గొని లడ్డూను రూ.27,116లకు దక్కించుకున్నారు. దీంతో విఘ్నేశ్వరుడు మతాలకు అతీతుడైన దేవుడని వీరు నిరూపించగా.. పలువురు వీరిని అభినందించారు.

News September 17, 2024

విజయవాడలో దసరా ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు: సీపీ

image

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి రాజశేఖర్ బాబు తెలిపారు. దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు, ఇతర పోలీస్ అధికారులతో కలిసి ఆలయ ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు. క్యూ లైన్లు, స్నానపు ఘాట్లు, పార్కింగ్ ప్రదేశాలు, ప్రసాదం కౌంటర్లు ఏర్పాటుచేసి ప్రాంతాలను పరిశీలించారు.

News September 16, 2024

విజయవాడలో 18న ఫుట్‌బాల్ జట్ల ఎంపికలు

image

ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సెప్టెంబర్ 18న ఎస్జీఎఫ్ అండర్ 19 ఉమ్మడి కృష్ణా జిల్లా ఫుట్ బాల్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అండర్ 19 ఎస్జీఎఫ్ కార్యదర్శి రవికాంత సోమవారం తెలిపారు. ఈ పోటీలకు 01-01-2006 తరువాత పుట్టినవారు అర్హులన్నారు. జిల్లాలో ఆసక్తి గలవారు జనన ధ్రువీకరణ, స్టడీ, ఆధార్ పత్రాలతో హాజరుకావాలన్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్, ఓపెన్‌గా చదివే వారు అనర్హులని చెప్పారు.

News September 16, 2024

ఇబ్రహీంపట్నం SIపై ముంబై నటి జెత్వానీ ఫైర్

image

ముంబైకు చెందిన సినీ నటి జెత్వానీ ఇబ్రహీంపట్నం PSలో ఫిర్యాదు చేసిన విషయం విధితమే. ఈ క్రమంలో ఆమె స్టేషన్‌లో ఉన్న ఓ SIపై ఆగ్రహం వ్యక్తం చేయటం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబై నుంచి తనను బంధువుల వద్ద నుంచి అప్పట్లో ఇబ్రహీంపట్నానికి తీసుకువచ్చింది ఈయనే అంటూ ఆమె SIపై గట్టిగా అరిచింది. దీంతో అక్కడ ఉన్న వారంతా ఆమె వైపు చూస్తూ ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. దీంతో ఆయనపై ఉన్నతాధికారులు నిఘాపెట్టారు.

News September 16, 2024

వైసీపీ 73 ప్రభుత్వ పాఠశాలలను మూసేసింది: ఉమా

image

NTR: గత వైసీపీ ప్రభుత్వంలో విలీనం పేరుతో 73 ప్రభుత్వ పాఠశాలలను మూసేసిందని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్వీట్ చేశారు. కోట్ల రూపాయల “నాడు- నేడు” నిధులు దారి మళ్లించిన మాజీ సీఎం జగన్, తాడేపల్లి ఖజానా నింపుకున్నారని ఆరోపించారు. ఐదేళ్ల విధ్వంసం నుంచి ఉజ్వల భవిష్యత్తు వైపు రాష్ట్రంలోని విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే లక్ష్యంతో NDA కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఉమ ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.

News September 16, 2024

వైసీపీ 73 ప్రభుత్వ పాఠశాలలను మూసేసింది: ఉమా

image

NTR: గత వైసీపీ ప్రభుత్వంలో విలీనం పేరుతో 73 ప్రభుత్వ పాఠశాలలను మూసేసిందని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్వీట్ చేశారు. కోట్ల రూపాయల “నాడు- నేడు” నిధులు దారి మళ్లించిన మాజీ సీఎం జగన్, తాడేపల్లి ఖజానా నింపుకున్నారని ఆరోపించారు. ఐదేళ్ల విధ్వంసం నుంచి ఉజ్వల భవిష్యత్తు వైపు రాష్ట్రంలోని విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే లక్ష్యంతో NDA కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఉమ ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.

News September 16, 2024

కృష్ణా: ‘లా’ విద్యార్థులకు అలర్ట్

image

కృష్ణా వర్శిటీ పరిధిలోని కళాశాలల్లో B.A.LLB కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్(రెగ్యులేషన్ 2018 & 2023) థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. సెప్టెంబర్ 21, 24, 26, 28వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. పూర్తి వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.

error: Content is protected !!