Krishna

News September 16, 2024

విజయవాడలో రూ.26 లక్షలు పలికిన లడ్డూ

image

విజయవాడ నున్న గ్రామంలో శ్రీ సాయి బాలాజీ ఎన్ క్లేవ్ అపార్ట్మెంట్‌లో వినాయకుడిని నెలకొల్పారు. ఈ వేడుకల్లో సింగంరెడ్డి ప్రదీప్‌రెడ్డి, నక్కా రామ్ బాలాజీ వేడుకల చివరి రోజు స్వామివారి లడ్డూను రూ.26 లక్షలకు సొంతం చేసుకున్నారు. రాబోయే రోజుల్లో అపార్ట్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలకు మరోసారి వినాయక చవితి వేడుకలను మరింత వైభోపేతంగా నిర్వహిస్తామన్నారు.

News September 15, 2024

విజయవాడ మీదగా తిరుపతికి ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా శ్రీకాకుళం రోడ్డు(CHE), తిరుపతి(TPTY) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు అక్టోబర్ 6 నుంచి నవంబర్ 10 వరకు ప్రతి ఆదివారం TPTY- CHE(నెం.07442), అక్టోబర్ 7 నుంచి నవంబర్ 11 వరకు ప్రతి సోమవారం CHE- TPTY(నెం.07443) ఈ ట్రైన్లు నడుపుతామన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడతో పాటు ఏపీలోని పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News September 15, 2024

విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం

image

విజయవాడ రామవరప్పాడులో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తల్లి కొడుకు దుర్మరణం చెందారు. ద్విచక్ర వాహనంపై నుంచి లారీ కిందపడి దుర్మరణం చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన వారు విజయవాడ గుణదలకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పటమట సీఐ పవన్ కిషోర్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.

News September 15, 2024

కృష్ణా: వరద బాధితులకు రూ.7.70 కోట్ల విరాళం

image

వరద బాధితులకు ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ తరఫున రూ.7.70 కోట్ల విరాళం అందజేశామని పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు YVB రాజేంద్ర తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు విరాళం చెక్‌ను డిప్యూటీ సీఎం పవన్‌కు అందజేశామని YVB తెలిపారు. వరద బాధితులకై రాష్ట్రంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు ఒక నెల గౌరవ వేతనం ఇచ్చారని ఆ మొత్తం రూ.7.70 కోట్లు అవ్వగా, ఆ నగదు ప్రభుత్వానికి ఇచ్చామన్నారు.

News September 15, 2024

విజయవాడ: అధికారులపై సస్పెన్షన్‌ వేటు

image

ముంబై సినీ నటి కాదంబరి కేసులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్ఆర్‌ ఆంజనేయులు, అప్పటి విజయవాడ సీపీ కాంతి రాణా, పోలీస్ అధికారి విశాల్‌గున్నిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ వర్గాల నుంచి ఉత్వర్వులు తాజాగా వెలువడ్డాయి. కాగా ఈ కేసులో ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణను డీజీపీ ద్వారకా తిరుమలరావు ఇటీవల సస్పెండ్ చేశారు.

News September 15, 2024

తిరువూరులో చెట్టు పైనుంచి పడి వ్యక్తి మృతి

image

తిరువూరులోని పోస్ట్ ఆఫీస్ సమీపంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. కూలీ పని నిమిత్తం చెట్టు ఎక్కి కొమ్మలను నరికే ప్రయత్నం చేయగా ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కింద పడ్డాడు. ఈక్రమంలో గేటుకి ఉన్న స్తూపం దిగబడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మునకుళ్ల గ్రామానికి చెందిన శ్రీకాకుళపు నాగేశ్వరరావు (45)గా గుర్తించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 15, 2024

విస్సన్నపేట: బాలికపై హత్యాచారం

image

విస్సన్నపేటలో శనివారం పైశాచికత్వం బయటపడింది. మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన శివయ్య (40) అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారం చేసినట్లు బాలిక తండ్రి స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. అతనిపై పోలీస్ స్టేషన్లో (సెక్షన్4)పోక్సో యాక్ట్ 64(1) BNS, కేసు నమోదు చేశామని తిరువూరు సీఐ కె. గిరిబాబు, విస్సన్నపేట ఎస్సై రామకృష్ణ తెలిపారు.

News September 15, 2024

లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో ప్రథమ స్థానంలో ‘కృష్ణా’

image

జాతీయ లోక్ అదాలత్‌లో అత్యధిక కేసుల పరిష్కారంతో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తం 6363 వివిధ రకాల పెండింగ్ కేసులను పరిష్కరించారు. ఇందులో 5413 క్రిమినల్ కేసులు ఉండగా 181 సివిల్, 484 చెక్ బౌన్స్ కేసులు, 85 మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు ఉన్నాయని జిల్లా జడ్జి అరుణ సారెక తెలిపారు.

News September 15, 2024

విజయవాడలో రాత్రివేళ పర్యటించిన మంత్రి

image

విజయవాడ అజిత్ సింగ్ నగర్ పాయకాపురం నున్న పరిసర ప్రాంతాల్లో శనివారం రాత్రి వేళ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్వయంగా పర్యటించారు. స్థానిక ప్రజలని కలిసి స్వయంగా మాట్లాడి ఆందోళన చెందవద్దని తెలిపారు. బుడమేరుకు వరద అంటూ ప్రచారం చేసిన ఆకతాయిలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బుడమేరుకు ఎటువంటి వరద రాదని ప్రజలు అధైర్యం పడవద్దని అన్నారు.

News September 15, 2024

గుంతలమయమైన రోడ్లకు పూర్వవైభవం: ఉమా

image

వైసీపీ పాలనలో గుంతలమయమైన రోడ్లకు పూర్వవైభవం తెచ్చేందుకు NDA కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మాజీ మంత్రి దేవినేని ఉమా ట్వీట్ చేశారు. 2 నెలల్లోగా యుద్ధ ప్రాతిపదికన గుంతలు పూడ్చాలంటూ సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు. విపత్తు నిధి, PPP విధానాల్లో మరమ్మతులకు గురైన వేలాది కిలోమీటర్ల రోడ్లను కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.

error: Content is protected !!