India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బాపులపాడు మండలంలోని హనుమాన్ జంక్షన్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 8వ తేదీన పర్యటిస్తున్నట్లు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త చలమలశెట్టి రమేశ్ తెలిపారు. గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు మద్దతుగా పవన్ రానున్నట్లు తెలిపారు. హనుమాన్ జంక్షన్లోని హెచ్ మార్ట్ వద్ద ఆయన ప్రసంగిస్తారని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
విస్సన్నపేట టౌన్లో విద్యుత్ షాక్తో ఓ వ్యక్తి సోమవారం మృతిచెందాడు. తిరువీధి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి తోట కాపలగా ఉండగా మామిడి తోటకు సాయంత్రం నీళ్లు పెడదామని మోటార్ వేయగా కరెంట్ షాక్కు గురయ్యాడని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కృష్ణా జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ సమాచారం, సందేహాల నివృత్తి కోసం ఈ కింది హెల్ప్ లైన్ ఫోన్ నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు.
హెల్ప్ లైన్ నంబర్లు :
గన్నవరం – 9885970848
గుడివాడ – 9676993147
పెడన – 9553125124
మచిలీపట్నం – 9010021352
అవనిగడ్డ – 7981826714
పామర్రు – 9989347699
పెనమలూరు – 9966485895
కైకలూరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని శ్రీనివాస్ తరఫున ప్రముఖ సినీ రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనను గజమాలతో ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని, టీడీపీ, జనసేన నాయకులు స్వాగతం పలికారు. ఆటపాక నుంచి ఏలూరు రోడ్డు వరకు రోడ్ షో ద్వారా వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించుకుంటే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు.
చాట్రాయికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఎమ్మెల్యేలుగా గెలుపొంది చట్ట సభల్లో అడుగుపెట్టారు. తొలుత మిర్యాల పూర్ణనంద్ తిరువూరు(ఎస్సీ) నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా 1983లో గెలుపోందారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా చాట్రాయి మండలం నూజివీడు జనరల్ స్థానంలోకి వచ్చింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో చాట్రాయికే చెందిన చిన్నం రామకోటయ్య నూజివీడు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు.
కృష్ణా జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ సమాచారం, సందేహాల నివృత్తి కోసం ఈ కింది హెల్ప్ లైన్ ఫోన్ నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు.
జిల్లా స్థాయి హెల్ప్ లైన్ నెంబర్లు :
పోలీస్ – 9030442275
మెడికల్ – 9705351134
ఆర్టీసీ – 9440449840
ఎమర్జెన్సీ సర్వీసెస్ – 8106653305
ఇతర అన్ని శాఖలు – 9494934282
సినీ నటుడు నారా రోహిత్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. సోమవారం ఉదయం ఆయన నందిగామ, సాయంత్రం పామర్రులో పర్యటించనున్నట్లు ఆపార్టీ వర్గాలు తెలిపాయి. కూటమి అభ్యర్థులు తంగిరాల సౌమ్య, వర్ల కుమార్ రాజా విజయాన్ని కాంక్షిస్తూ నారా రోహిత్ ప్రచారం చేయనున్నట్లు ఆ పార్టీ నాయకులు చెప్పారు.
కృష్ణాజిల్లాలో హోమ్ ఓటింగ్ ప్రక్రియ తుది దశకు వచ్చింది. ఈ నెల 2వ తేదీన హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా 1762 మంది వృద్ధులు, దివ్యాంగులకు గానూ ఇప్పటి వరకు 1630 మంది హోమ్ ఓటింగ్లో పాల్గొన్నారు. గన్నవరంలో 271, గుడివాడలో 154, పెడనలో 117, మచిలీపట్నంలో 191, అవనిగడ్డలో 322, పామర్రులో 219, పెనమలూరులో 356 మంది హోమ్ ఓటింగ్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు.
తిరువూరు నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడో, అదే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని స్థానికులు చెబుతుంటారు. నియోజకవర్గం ఆవిర్భంచిన నాటి నుంచి ఒక్కసారి మినహా ఇలాగే జరగడం విశేషం. 1967లో తిరువూరును ఎస్సీలకు రిజర్వ్ చేశారు. 2014లో మాత్రం ఇక్కడ వైసీపీ గెలవగా, ఆ పార్టీ అధికారంలోకి రాలేదు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలవగా, ఆ పార్టీనే అధికారం చేపట్టిన విషయం తెలిసిందే.
గన్నవరం విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. మోదీ సోమవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకొని, రోడ్డు మార్గాన విజయవాడ బయలుదేరి వెళతారన్నారు. నగరంలో రోడ్ షో అనంతరం తిరిగి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారని చెప్పారు.
Sorry, no posts matched your criteria.