India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మండల కేంద్రమైన చందర్లపాడు గ్రామంలో సినీ నటుడు నారా రోహిత్ రేపు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ముందుగా మోడ్రన్ సూపర్ మార్కెట్ నుంచి ప్రచారం ప్రారంభమవుతుందని మెయిన్ సెంటర్ స్ట్రీట్ కార్నర్లో మీటింగ్ ఉంటుందని పార్టీ వర్గాలు ప్రకటనలో తెలిపాయి. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొననున్నారు.
సీఎంగన్ ఈ నెల 6వ తేదీన మచిలీపట్నం రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 6వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు కోనేరుసెంటర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలు, వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరాయి.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో భార్యాభర్తలు MLAలుగా గెలిచి చరిత్ర సృష్టించారు. ముక్తాల గ్రమానికి చెందిన వాసిరెడ్డి రామగోపాల కృష్ణ మహేశ్వరప్రసాద్ అప్పటి ఎన్నికలో స్వంతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్పై MLAగా గెలుపొందారు. 1974లో అయన మరణానంతరం భార్య రాజ్యలక్ష్మమ్మ కాంగ్రెస్లో చేరి MLAగా గెలిచి 4ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు. భార్యాభర్తలు MLAగా గెలిచిన ఘనత అప్పట్లో జగ్గయ్యపేటకే దక్కింది.
క్రికెట్ బెట్టింగ్లో పెద్ద మొత్తంలో డబ్బులు పొగొట్టుకున్నందుకు తల్లిదండ్రులు క్రికెట్ బెట్టింగ్లు ఆడవద్దని మందలించినందుకు మనస్థాపం చెంది రాణిగారితోటకు చెందిన మేకల చంద్రశేఖర్(30) శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. చంద్రశేఖర్ వ్యసనాలకు బానిసై పలువురు వద్ద అప్పులు చేశాడు. తల్లిదండ్రులు మందలించారు మనస్థాపంతో శనివారం సాయంత్రం ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కృష్ణలంక పోలీసులు తెలిపారు.
కృష్ణా జిల్లాలో తొలి రోజు 3361 మంది పీఓ, ఏపీఓ, మైక్రో అబ్జర్వర్లు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. జిల్లాలో మొత్తం 3,728 మందికి గానూ సాయంత్రం 5 గంటలకు వరకు అందిన సమాచారం మేరకు 3,361 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో పాల్గొన్నారు. గన్నవరంలో 299, గుడివాడలో 490, పెడనలో 212, మచిలీపట్నంలో 783, అవనిగడ్డలో 843, పామర్రులో 246, పెనమలూరులో 488 మంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేశారు.
మచిలీపట్నం కూటమి MP, MLA అభ్యర్థులు వల్లభనేని బాలశౌరి, కొల్లు రవీంద్రపై వైసీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా వారిద్దరూ ఈ నెల 2న మచిలీపట్నం పోలీస్ స్టేషన్, జిల్లా ఎస్పీ ఆఫీస్ వద్ద వందలాది మంది కార్యకర్తలతో ధర్నా చేసిన దానిపై ఎన్నికల సంఘం రాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శిని కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి ఇరువురిపై చర్యలు తీసుకోవాలన్నారు.
విజయవాడలో లోన్ యాప్కి మరో యువకుడు బలయ్యాడు. కటికలేటి చందు అనే యువకుడు లోను యాప్ సిబ్బంది వేధింపులు భరించలేక శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మాచవరం పోలీసులు మీడియాకు వెల్లడించారు.
విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటుపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్కూటీపై వెళుతున్న విజయవాడకు చెందిన ప్రసాద్(70)ను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ప్రసాద్ తీవ్రంగా గాయపడగా గమనించిని స్థానికులు వెంటనే అతనిని విజయవాడ ప్రైవేట్ హాస్పటల్కు తరలిచారు.. చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నేడు గుడివాడ నియోజకవర్గంలోని నెహ్రూ చౌక్లో ఉదయం 11 గంటలకు రోడ్ షో కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నట్లు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో టికెట్ లేని ప్రయాణికుల వద్ద నుంచి ఏడాది ఏప్రిల్లో నిర్వహించిన తనిఖీల్లో రికార్డు స్థాయిలో రూ.7.96కోట్ల ఆదాయం డివజన్కు లభించింది. వివిధ రైళ్లు, స్టేషన్లలో నిర్వహించిన తనిఖీల్లో 44,249 మందిపై కేసులు నమోదు చేసి రూ.4.25కోట్లు, అక్రమ రవాణాపై 51,271 కేసులు నమోదు చేసి రూ.2.79కోట్లు, ఇతర కేసుల ద్వారా రూ.92 లక్షలు వసూలు చేసినట్లు రైల్వే అధికారి నరేంద్ర అనందరావు తెలిపారు.
Sorry, no posts matched your criteria.