India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ నెల 13వ తేదీన జిల్లాలో పోలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో 48 గంటల ముందు 11వ తేదీ నుంచి సెక్షన్ 144 అమలు చేస్తూ కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల మేరకు జిల్లాలో ఎక్కడా కూడా ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుంపులు గుంపులుగా ఉండకూడదన్నారు. అలాగే బహిరంగ సభలు, ర్యాలీలకు ఎటువంటి అనుమతులు లేవన్నారు. పోలింగ్ ముగిసే వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయన్నారు.
జనసేన నేత కర్రి మహేశ్ ఇంటిపై దాడి కేసులో నిందితులుగా పేర్కొన్న ఐదుగురికి సెల్ఫ్ బెయిల్ మంజూరైంది. ఈ కేసులో YCP నేతలు చిలకలపూడి గాంధి, చిలంకుర్తి వినయ్, శీనయ్య, ధనబాబు, లంకే రమేశ్లపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఇరువర్గాల వాదనలు విన్న ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నిందితులకు సెల్ఫ్ బెయిల్ మంజూరు చేశారు. కాగా ఇదే కేసులో వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టుని A1గా చూపారు.
జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కానున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్ల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. మచిలీపట్నంలోని నోబుల్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు అందరూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం సులభతరంగా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు.
ఈ నెల 13న పోలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో పోలింగ్కు 48 గంటల ముందు జిల్లాలోని అన్ని మద్యం షాపులు మూసి వేయాలని, కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ఓట్ల లెక్కింపు రోజు అనగా జూన్ 4వ తేదీకి 48 గంటలు ముందు ఓట్ల లెక్కింపు జరిగే ప్రదేశాల వద్ద డ్రై డే గా పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు పటిష్ఠంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు.
కృష్ణా జిల్లాలో హోమ్ ఓటింగ్ ప్రక్రియ 2వ రోజు శుక్రవారం కొనసాగింది. తొలి రోజు 399 మంది వృద్ధులు, దివ్యాంగులు హోమ్ ఓటింగ్లో పాల్గొనగా 2వ రోజు 606 మంది పాల్గొన్నారు. మొత్తం 1005 మంది హోమ్ ఓటింగ్లో పాల్గొన్నారు. 2వ రోజు మచిలీపట్నంలో 95, పెడనలో 47, అవనిగడ్డలో 93, పెనమలూరులో 112, గన్నవరంలో 93, గుడివాడలో 64, పామర్రులో 32 మంది హోమ్ ఓటింగ్ వేశారు.
జనసేన నేత కర్రి మహేశ్ ఇంటిపై దాడి కేసులో మచిలీపట్నం YCP MLA అభ్యర్థి పేర్ని కిట్టుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కిట్టుతో పాటు మరో ఐదుగురు YCP నేతలపై కూడా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కిట్టుని A1గా చూపగా చిలకలపూడి గాంధి, చిలంకుర్తి వినయ్, శీనయ్య, ధనబాబు, లంకే రమేశ్లను A2, A3, A4, A5గా చూపారు. ఇదే కేసులో కర్రి మహేశ్తో పాటు మరో ముగ్గురిపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
కైకలూరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు శుక్రవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. ఆయన హార్ట్ స్ట్రోక్ రాగానే వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడ నాగార్జున నగర్లోని ఆయుష్ హాస్పిటల్కు తరలించారు. వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు.
నందిగామ పట్టణ పరిధిలోని కెవిఆర్ కళాశాలలోని ఈవీఎం స్ట్రాంగ్ రూములను ఎన్నికల పరిశీలకులు నరేంద్ర సింగ్ బాలి గురువారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి అన్ని పోలింగ్ కేంద్రాల్లో అధిక శాతంలో పోలింగ్ జరిగే విధంగా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. పలు పోలింగ్ కేంద్రాలలోని మౌలిక వసతులను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో RDO తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 4వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవనిగడ్డ పర్యటనకు విచ్చేస్తున్నట్లు నియోజకవర్గ జనసేన అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్ గురువారం తెలిపారు. సాయంత్రం 6 గంటలకు వారాహి యాత్రలో భాగంగా అవనిగడ్డ సభలో ప్రసంగిస్తారన్నారు. నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
గంపలగూడెం గ్రామానికి చెందిన తాళ్లూరి కృష్ణ దాస్ (55)గురువారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. విజయవాడ నుంచి ద్విచక్ర వాహనంపై గంపలగూడెం వస్తుండగా, చీమలపాడు వద్ద ఎదురుగా వస్తున్న గేదెలు కలబడి మీద పడినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం అతనిని విజయవాడ ఆస్పత్రి తరలించగా మృతి చెందాడు. ఎస్సై చల్లా శ్రీనివాస్ ఘటనపై విచారణ చేపట్టారు.
Sorry, no posts matched your criteria.