India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో సంభవించిన వరద విపత్తు ప్రజలకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. వరద నీటితో పాటు కొట్టుకొస్తున్న పాములు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముంపు ప్రాంతాల్లో 70 మంది పాముకాటుకు గురయ్యారని వైద్య శాఖ అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపులకు పాము కాట్ల బాధితులు వస్తున్నారన్నాయి.
విజయవాడ నుంచి పుణ్యక్షేత్రాలకు వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర పేరుతో ఈ నెల 14న IRCTC ప్రత్యేక రైలు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 11 రాత్రులు, 12 పగళ్లతో కొనసాగే యాత్ర ఈనెల 14న విజయవాడ నుంచి బయలుదేరి 25న తిరుగు ప్రయాణం అవుతుందన్నారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో తన ముందస్తు బెయిల్ పిటీషన్ను రద్దు చేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ మంత్రి జోగి రమేశ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వైసీపీ అధికారంలో ఉండగా జోగి రమేశ్ చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లారని పలువురు టీడీపీ నేతలు ఆరోపించారు. ప్రభుత్వ మార్పిడి తర్వాత రమేశ్ పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో పాలడుగు దుర్గాప్రసాద్ను మంగళగిరి పోలీసులు నేడు అరెస్ట్ చేశారు. దుర్గాప్రసాద్ ఈ కేసులో ఏ4గా నిందితుడిగా ఉన్నాడు. దుర్గాప్రసాద్ కోసం కొంతకాలంగా గాలిస్తున్న పోలీసులు.. ఇవాళ గుంటుపల్లిలో ఆయన ఇంట్లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. కాగా దుర్గాప్రసాద్ సతీమణి ఎంపీపీ పాలడుగు జోష్న వైసీపీ నుంచి టీడీపీలో చేరారు.
అవనిగడ్డ మండలం పులిగడ్డలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులకు జ్వరాలు ప్రబలిన నేపథ్యంలో డీఎంహెచ్వో గీతాబాయి పాఠశాలను సందర్శించారు. ప్రిన్సిపల్ కుమార్ను, వైద్యులు డా. ప్రభాకర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంగళవారం రాత్రి వరకు జరిగిన పరీక్షల్లో మొత్తం 31 మంది జ్వర పీడితులు తేలారని, వారిలో ముగ్గురు తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఉండగా, మరో ఆరుగురు చికిత్స కోసం ఇళ్లకు వెళ్లిపోయినట్లు ఆమె తెలిపారు.
ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ (NMMS)కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారిణి తాహేరా సుల్తాన ఓ ప్రకటనలో తెలిపారు. 8వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. దరఖాస్తులను ఈ నెల 17వ తేదీ లోపు అందజేయాలన్నారు. ఇతర వివరాలకు మచిలీపట్నంలోని డీఈఓ కార్యాలయం ద్వారా తెలుసుకోవచ్చన్నారు.
కృష్ణా జిల్లా మత్స్య సహకార సంఘం నూతన పాలకవర్గం ఎన్నికకు సంబంధించి కలెక్టర్ డీకే బాలాజీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 24న ఎన్నికలు నిర్వహించనున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 17వ తేదీన నామినేషన్ల స్వీకరణ, 18న పరిశీలన, 19న ఉపసంహరణకు గడువు ఇచ్చారు. 24వ తేదీ ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుందన్నారు.
‘ఉరుకు పటేల’ చిత్ర యూనిట్ విజయవాడలో సందడి చేసింది. ఈ నెల 7న చిత్రం విడుదలై థియేటర్లలో విజయవంతంగా నడుస్తోందని ఆ సినిమా హీరోహీరోయిన్లు తేజస్ కంచర్ల, కుష్బూ చౌదరి తెలిపారు. మూవీ విజయోత్సవం సందర్భంగా విజయవాడ వచ్చిన యూనిట్ నగరంలో ఏర్పాటు చేసిన భారీ గణనాథుడిని మంగళవారం రాత్రి దర్శించుకొని పూజలు చేశారు. తమ చిత్రం వినాయకచవితి రోజున విడుదల అయ్యిందని, ఆ గణపయ్య ఆశీస్సులతో మంచి సక్సెస్ సాధించిందన్నారు.
విజయవాడలో వరదల కారణంగా విద్యుత్ శాఖకు కూడా బాగానే నష్టం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్, సెల్లర్లో ఉన్న విద్యుత్ మీటర్లు వరద నీటికి పాడయ్యాయి. పాడైన మీటర్ల స్థానంలో తాత్కాలికంగా కొత్త మీటర్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే 35 వేల మీటర్లను సిద్ధంగా ఉంచినట్లు సమాచారం. నేటి నుంచి మీటర్లు పాడైన స్థానంలో కొత్త మీటర్లను ఉచితంగా ఏర్పాటు చేయనున్నారు.
వినాయక నిమజ్జన ఊరేగింపులో DJలకు అనుమతి లేదని మచిలీపట్నం డీఎస్పీ అబ్దుల్ సుభాన్ తెలిపారు. స్థానిక సిరి కళ్యాణ మండపంలో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశమైన ఆయన.. నిమజ్జనం రోజు తీసుకోవల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మద్యం తాగి నిమజ్జన ఊరేగింపుల్లో పాల్గొన్నా, ఎక్కడైనా అల్లర్లకు పాల్పడినా కమిటీ వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అందరూ సహకరించి, పండగను ప్రశాంతంగా పూర్తి చేసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.