Krishna

News September 10, 2024

రేపు విజయవాడ వరద ప్రాంతాల్లో పర్యటించనున్న మెగా హీరో

image

ఈ నెల 11న సినీ హీరో సాయి ధరమ్ తేజ్ విజయవాడలో పర్యటించనున్నారు. వరద బాధితులకు నిత్యావసర సరకులు, దుప్పట్లు, బట్టలు పంపిణీ చేయనున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. ఉదయం 11గంటలకు సింగ్‌నగర్‌లోని అమ్మసేవ ఆశ్రమాన్ని ఆయన సందర్శిస్తానని, అభిమానులు రావాలని కోరారు. ఇటీవల ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఆయన చెరో రూ. 10 లక్షల చొప్పున విరాళం అందించిన విషయం తెలిసిందే.

News September 10, 2024

విజయవాడ: వరద ప్రభావిత ప్రాంతాల్లో దొంగలు

image

విజయవాడ వరద ప్రభావిత కాలనీలలో దొంగలు తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా బీరువాల్లోని నగదు, బంగారం, గ్యాస్ సిలిండర్లు కాజేస్తున్నారు. లూనా సెంటర్లో 10తులాల బంగారం. రూ.లక్షన్నర నగదు, వాంబే కాలనీలో 3తులాల బంగారంతో పాటు సింగ్ నగర్, తదితర ప్రాంతాల్లో చోరీలు జరిగినట్లు బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇళ్లలోని సొత్తు కాజేశారని కంటతడి పెడుతున్నారు.

News September 9, 2024

విజయవాడ: వరద బాధితులకు రూ.కోటి విరాళం

image

లలితా జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ అధినేత ఎమ్.కిరణ్ కుమార్ వరద బాధితుల కోసం రూ.1 కోటి విరాళాన్ని సోమవారం అందజేశారు. సీఎం చంద్రబాబును విజయవాడ కలెక్టరేట్‌లో కలిసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన్ను సీఎం చంద్రబాబు అభినందించి, వరద బాధితులకు సహాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని అన్నారు.

News September 9, 2024

విజయవాడ: వరద విపత్తు వేళ దొంగల చేతివాటం

image

వరద బాధిత ప్రాంతాల్లో దొంగలు తమ చేతివాటం చూపిస్తున్నారు. ఇటీవల నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మొబైల్స్ షాపు, మద్యం దుకాణంలో చోరీ జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. నీళ్లలో మునిగిన బైక్‌లలో పెట్రోల్, టైర్లు చోరీ అయినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్లలో మునిగిన బైక్‌లను ఆగంతుకులు తుక్కు కింద అమ్మేస్తున్నారని ముంపు ప్రాంతాల వారు చెబుతున్నారు.

News September 8, 2024

కృష్ణా జిల్లాలో పలు రైళ్ల రద్దు

image

నిర్వహణ కారణాల రీత్యా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రయాణించే కింది రైళ్లను ఈ నెల 9, 10 తేదీల్లో రద్దు చేశామని విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ కార్యాలయం తెలిపింది. రాజమండ్రి- విజయవాడ (07460), విజయవాడ- మచిలీపట్నం (07895) , మచిలీపట్నం- విజయవాడ (07896), విజయవాడ- మచిలీపట్నం (07769), మచిలీపట్నం- గుడివాడ (07872), గుడివాడ- మచిలీపట్నం (07871), మచిలీపట్నం- విజయవాడ (07899).

News September 8, 2024

NTR జిల్లాలో వారికి మాత్రమే సెలవు: కలెక్టర్

image

ఎన్టీఆర్ జిల్లాలో సోమవారం నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు యథావిధిగా పనిచేస్తాయని కలెక్టర్ డా.జి.సృజన తెలిపారు. వరద ముంపునకు గురైన లేదా పునరావాస కేంద్రాలుగా ఉన్న పాఠశాలలకు మాత్రమే సెలవు వర్తిస్తోందని స్పష్టం చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

News September 8, 2024

దాతలకు కృతజ్ఞతలు తెలిపిన నారా లోకేష్

image

వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన వస్తోంది. ఏపీ దుస్థితికి చలించి పోయిన వారంతా విరాళాలు ప్రకటిస్తూ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు, NRIలు పలువురు, ఏపీ ఉద్యోగుల సంఘం తమ విరాళాలను ప్రకటించింది. ఇంకా పలువురు ప్రముఖులు విరాళాలను ప్రకటిస్తూనే ఉన్నారు. విరాళాలు అందజేసిన దాతలకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.

News September 8, 2024

వైసీపీ ఏ ప్రాజెక్టులను మెయింటెనన్స్ చేయలేదు: సీఎం

image

అత్యంత క్లిష్టమైన బుడమేరు గండ్లను పూడ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. 4 రోజులుగా మంత్రులు నిమ్మల రామానాయుడు, నారా లోకేష్ కలిసి ఈ పనులు పూర్తి చేశారని పేర్కొన్నారు. దీంతో ఇన్‌ఫ్లో పూర్తిగా ఆగిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఏ ప్రాజెక్టులను మెయింటెనన్స్ సరిగా చేయలేదని ఆరోపించారు.

News September 8, 2024

నిమజ్జనాల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

image

వినాయక చవితి సందర్భంగా మంగినపూడి బీచ్, కాలేఖాన్ పేట మంచినీళ్ళ కాలువ వద్ద నిమజ్జనాల ఏర్పాట్లను ఎస్పీ ఆర్.గంగాధర రావు స్వయంగా పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతిమలను నిమజ్జనం చేసే ప్రదేశాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. భక్తులు నీటిలో ఎక్కువ దూరం వెళ్లకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు.

News September 7, 2024

విజయవాడ: APSSDC కీలక నిర్ణయం

image

వరద బాధితుల ఇళ్లలో ప్లంబర్, ఎలక్ట్రీషియన్ల సేవలు అందించేందుకు APSSDC(ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్)యాప్ తీసుకొచ్చింది. APSSDC ద్వారా శిక్షణ పొందిన ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసేందుకు 462 మంది ముందుకొచ్చారని, త్వరలో వీరిని ముంపు ప్రాంతాలకు పంపించి బాధితుల ఇళ్లలో ప్లంబింగ్ తదితర పనులు చేయిస్తామని అధికారులు తెలిపారు.

error: Content is protected !!