Krishna

News May 2, 2024

కృష్ణా జిల్లాలో హోమ్ ఓటింగ్‌కు 1972 మంది

image

నేటి నుంచి ప్రారంభం కానున్న హోమ్ ఓటింగ్ కోసం కృష్ణాజిల్లాలో 1972 మంది వయోవృద్ధులు, దివ్యాంగులు దరఖాస్తు చేసుకున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో అత్యధికంగా 409 మంది దరఖాస్తు చేసుకోగా అత్యల్పంగా పెడనలో 120 మంది దరఖాస్తు చేసుకున్నారు. గుడివాడలో 166, పెనమలూరులో 373, పామర్రులో 228, మచిలీపట్నంలో 194, గన్నవరంలో 272 మంది దరఖాస్తు చేసుకోగా ఈ నెల 10వ తేదీ వరకు హోమ్ ఓటింగ్ నిర్వహించనున్నారు.

News May 2, 2024

కృష్ణా జిల్లాలో ప్రారంభమైన హోమ్ ఓటింగ్ ప్రక్రియ

image

జిల్లాలో హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మచిలీపట్నం పార్లమెంట్‌తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోమ్ ఓటింగ్ బృందాలు వృద్ధులు, దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి ఓటు నమోదు చేయించుకుంటున్నారు. పెడనలో జరుగుతున్న హోమ్ ఓటింగ్ ప్రక్రియను కలెక్టర్ డీకే బాలాజీ స్వయంగా పరిశీలించారు. జిల్లాలో మొత్తం 1762 మంది హోమ్ ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకోగా ఈ నెల 10వ తేదీ వరకు హోమ్ ఓటింగ్ ప్రక్రియ జరగనుంది.

News May 2, 2024

ఏ.కొండూరులో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

మండలంలోని కృష్ణారావు పాలెంలో గురవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎదురెదురుగా వస్తున్న కారు, లారీ గురువారం ఢీకొన్నాయి. కారులో ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తుండగా ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని విజయవాడ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా
స్థలానికి చేరుకొన్న పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.

News May 2, 2024

ఎన్టీఆర్: నేడు ఈ మండలాల్లో ఆరెంజ్ అలర్ట్

image

జిల్లాలోని ఈ కింది మండలాల్లో గురువారం వడగాల్పులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) హెచ్చరించింది. ఆయా మండలాల్లోని ప్రజానీకం తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, బాలింతలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ అలర్ట్ జారీ చేసింది.
* చందర్లపాడు
* జి కొండూరు
* గంపలగూడెం
* ఇబ్రహీంపట్నం
* కంచికచర్ల
* నందిగామ
* మైలవరం
* వీరులపాడు
* విజయవాడ రూరల్
* విజయవాడ అర్బన్
* విస్సన్నపేట

News May 2, 2024

ఈ నెల 4న గుడివాడలో పవన్ కళ్యాణ్ స్ట్రీట్ మీటింగ్

image

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 4వ తేదీన గుడివాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మచిలీపట్నం ఎంపీగా పోటీ చేస్తున్న వల్లభనేని బాలశౌరి, గుడివాడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వెనిగండ్ల రాముల విజయాన్ని కాంక్షిస్తూ గుడివాడలో స్ట్రీట్ మీటింగ్ పేరుతో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించనున్నారు. NTR స్టేడియం నుంచి నెహ్రూ చౌక్ వరకు రోడ్‌షో నిర్వహించి బహిరంగ సభలో ప్రసంగించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

News May 2, 2024

విజయవాడ: ఐదుగిరి చావుకి కారణమిదేనా..?

image

విజయవాడలో వైద్యుని కుంటుంబం ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనలో విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఇంట్లో ఉన్న రూ.16 లక్షలు, 300గ్రా. బంగారాన్ని శ్రీనివాస్ కారులో పెట్టాడు. కారు తాళాన్ని ఎదురింటి గేటు బాక్సులో పెట్టి అన్నయ్య వస్తే తాళం ఇవ్వాలని చెప్పాడు. ఉదయం పనిమనిషి వచ్చి చూడగా శ్రీనివాస్ పోర్టికోలో ఉరేసుకొని ఉన్నాడు. అనంతరం బాక్స్‌లో కారుతాళం చూడగా కాగితానికి తాళం అన్నకు ఇవ్వాలని ఫోన్ నంబర్ రాసి ఉంది.

News May 2, 2024

కృష్ణా జిల్లా పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లు ఇవే

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 4, 5, 6 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించనున్నారు.
* జిల్లా స్థాయిలో మచిలీపట్నంలోని పాండురంగ హైస్కూల్
* నియోజకవర్గ స్థాయిలో గన్నవరం బాయ్స్ జడ్పీ హైస్కూల్
* గుడివాడ ఇంజినీరింగ్ కాలేజ్
* పెడన వాసవీ ఇంజినీరింగ్ కాలేజ్
* మచిలీపట్నం నోబుల్ కాలేజ్
* అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్,
* పామర్రు జడ్పీ హైస్కూల్
* పెనమలూరు జడ్పీ హైస్కూల్

News May 2, 2024

సాయిబాబా సేవ‌లు అభినంద‌నీయం: ఢిల్లీరావు

image

స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ‌లో ప్ర‌చార స‌హాయ‌కులు, ఆడియో విజువ‌ల్ సూప‌ర్‌వైజ‌ర్‌గా 33 ఏళ్ల పాటు సేవ‌లందించిన ఆగం సాయిబాబా సేవ‌లు అభినంద‌నీయ‌మ‌ని క‌లెక్ట‌ర్ ఢిల్లీరావు అన్నారు. ఎన్‌టీఆర్ జిల్లా స‌మాచార‌, పౌర సంబంధాల అధికారి కార్యాల‌యంలో ఆడియో విజువ‌ల్ సూప‌ర్‌వైజ‌ర్ (ఏవీఎస్‌)గా ప‌నిచేసి బుధవారం ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన సాయిబాబాను విజయవాడలో క‌లెక్ట‌ర్ ఆయన ఘ‌నంగా స‌త్క‌రించారు.

News May 1, 2024

కృష్ణా జిల్లాలో వేగంగా ఓటరు స్లిప్‌ల పంపిణీ

image

జిల్లాలో ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు పంపిణీ ప్రక్రియను వేగవంతంగా జరుగుతోందని కలెక్టర్ బాలాజీ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 15,39,460 మంది ఓటర్లకు గాను ఏప్రిల్ 30వ తేదీ వరకు 3,83,520 మందికి స్లిప్పులు పంపిణీ చేశామన్నారు. గన్నవరంలో 60,834, గుడివాడలో 36,312, పెడనలో 54,096, మచిలీపట్నంలో 64,823, అవనిగడ్డలో 56,287, పామర్రు 54,382, పెనమలూరులో 56,786మంది ఓటర్లకు ఓటర్ స్లిప్పులు పంపిణీ చేశామన్నారు.

News May 1, 2024

విజయవాడలో జ్యోతి సురేఖకు ఘన సన్మానం

image

విజయవాడకు చెందిన ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ ఏప్రిల్ 23 నుంచి 28వ తేదీ వరకు చైనాలోని షాంఘైలో జరిగిన ప్రపంచ ఆర్చరీ పోటీలలో వ్యక్తిగత, జట్టు, మిక్స్డ్ విభాగాలలో 3 బంగారు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా బుధవారం శాప్ కార్యాలయంలో రాష్ట్ర క్రీడల ప్రధాన కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న పుష్పగుచ్చమిచ్చి శాలువా కప్పి సత్కరించారు. ఆయన సురేఖ విజయం దేశానికే గర్వకారణం అని అన్నారు.