Krishna

News May 1, 2024

కృష్ణా జిల్లాలో రేపటి నుంచి హోమ్ ఓటింగ్ 

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రేపటి నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందు కోసం జిల్లాలో 35 బృందాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. 85సం పైబడిన వారు, 40% పైబడి అంగవైకల్యం కలిగి హోమ్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు ఈ బృందాలు వెళ్లి ఓటు వేయించనున్నాయి. ఒక్కో బృందంలో ఒక PO, APO, వీడియో గ్రాఫర్ ఉంటారు. 10వ తేదీ వరకు హోమ్ ఓటింగ్ ప్రక్రియ జరగనుందని తెలిపారు.  

News May 1, 2024

కలెక్టరేట్లో ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ: ఢిల్లీ రావ్

image

విజయవాడ కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో బుధవారం కలెక్టర్ ఢిల్లీరావు సాధారణ ఎన్నికల పర్యవేక్షకులు రాజ్ పాల్, నరేందర్ సింగ్‌తో కలిసి ఈవీఎంల రెండవ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తొలి ర్యాండమైజేషన్‌లో ఈవీఎంలను నియోజకవర్గాలకు కేటాయించగా, 2వ ర్యాండమైజేషన్‌లో ఈవీఎంలను ఆన్లైన్లో ద్వారా పోలింగ్ స్టేషన్లకు అనుసంధానించాలని తెలిపారు.

News May 1, 2024

గుడివాడ: ట్రాఫిక్ కానిస్టేబుల్ పై లారీ క్లీనర్ రాయి దాడి

image

గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్‌కు చెందిన గోళ్ళ రవికుమార్ అనే కానిస్టేబుల్ భీమవరం రైల్వే గేట్ సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. రాంగ్ రూట్‌లో పట్టణంలోకి ప్రవేశిస్తున్న లారీని కానిస్టేబుల్ నిలువరించగా.. లారీలో ఉన్న బిహార్‌కు చెందిన క్లీనర్ బిశ్వాస్ రాయి తీసుకుని కానిస్టేబుల్ తలపై కొట్టడంతో అతను తీవ్ర గాయాల పాలయ్యాడు. క్షతగాత్రుణ్ని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.

News May 1, 2024

విజయవాడలో డాక్టర్ కుటుంబం ఆత్మహత్య వివరాలివే..

image

ఆర్థిక సమస్యలు కుటుంబాన్ని బలి తీసుకున్న ఘటన మంగళవారం విజయవాడ నగరం పటమటలో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే మొత్తం ఐదుగురు చనిపోగా.. ధరావత్ శ్రీనివాస్ 40 (డాక్టర్) భార్య ఉష (38) కుమార్తె శైలజ (9) కుమారుడు శ్రీహన్ (5) తల్లి రమణమ్మ (65) ఉన్నారు. తండ్రి జలమయ్య నాయక్ పోలీసు శాఖలో పనిచేసి పదేళ్లక్రితం మరణించారు.

News May 1, 2024

కృష్ణా : రాజకీయ బల్క్ మెసేజ్‌లపై కలెక్టర్ కీలక ఆదేశాలు

image

ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో పోలింగ్‌కు 72 గంటల ముందు రాజకీయ ప్రచార బల్క్ SMSలు, వాయిస్ మెసేజ్‌లు నిలుపు చేయాలని కలెక్టర్ DK బాలాజీ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్‌లో వివిధ నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. మే 10 సాయంత్రం 5గంటల నుంచి ఎటువంటి బల్క్ మెసేజ్లు పంపరాదన్నారు. అంతకముందు పంపే వాటికి MCMC అనుమతులు తప్పనిసరిగా ఉండాలన్నారు.

News April 30, 2024

బొమ్ములూరు జాతీయ రహదారిపై ఇద్దరి మృతి

image

బాపులపాడు మండలం బొమ్ములూరు కలపర్రు టోల్ గేట్ సమీపంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై డివైడర్‌ను ద్విచక్ర వాహనం ఢీకొని తండ్రీకూతురు అక్కడికక్కడే మృతి చెందారు. భార్య పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వీరు ఉదయం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని తిరిగి ఏలూరు వెళ్తుండుగా రోడ్డు ప్రమాదం జరిగినట్లు సమాచారం.

News April 30, 2024

నందివాడ: ప్రేమ పేరుతో మోసం

image

నందివాడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన పవన్ కుమార్ అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి మోసం చేసిన ఘటనపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. 8 నెలలుగా తనను బెదిరించి అత్యాచారం చేస్తున్నట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

News April 30, 2024

మచిలీపట్నం స్వతంత్ర అభ్యర్థికి ‘గాజు గ్లాసు’ను పోలిన గుర్తు

image

మచిలీపట్నం అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి చింతపల్లి మనోహర్‌కు గాజు గ్లాసును పోలిన గుర్తును కేటాయించారు. నామినేషన్ల ఉపసంహరణల అనంతరం మచిలీపట్నం అసెంబ్లీ బరిలో 14 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారని రిటర్నింగ్ అధికారిణి వాణి తెలిపారు. వీరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులకు వారి వారి పార్టీ సింబల్స్ కేటాయించామన్నారు. ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులకు కూడా సింబల్స్ కేటాయించామని చెప్పారు.

News April 29, 2024

కృష్ణా జిల్లా సంగ్రామంలో 94 మంది అభ్యర్థులు

image

కృష్ణా జిల్లాలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణల అనంతరం 94 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మచిలీపట్నం పార్లమెంట్‌కు 15 మంది పోటీలో నిలవగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 79 మంది పోటీలో నిలిచారు. గన్నవరం అసెంబ్లీకి 12, గుడివాడకు 12, పెడనకు 10, మచిలీపట్నంకు 10, అవనిగడ్డకు 12, పామర్రుకు 08, పెనమలూరుకు 11 మంది పోటీలో నిలిచారు.

News April 29, 2024

మచిలీపట్నం పార్లమెంట్ బరిలో 15 మంది అభ్యర్థులు

image

నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణల అనంతరం మచిలీపట్నం పార్లమెంట్ బరిలో 15 మంది అభ్యర్థులు నిలిచారు. నామినేషన్ల పరిశీలన అనంతరం 25 మంది పోటీలో నిలువగా వారిలో 10 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. YCP అభ్యర్థిగా డా. సింహాద్రి చంద్రశేఖర్, జనసేన అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లు కృష్ణ, తదితరులు పోటీలో ఉన్నారు. వీరిలో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.