Krishna

News December 8, 2024

జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు..APSSDC ద్వారా ఉచిత శిక్షణ

image

కృష్ణా: జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలకై APSSDC(ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. BSC నర్సింగ్, మిడ్‌వైఫరీ(GNM), జనరల్ నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నెల 10లోపు ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికైన వారికి 6 నెలల శిక్షణ ఉంటుందని, పూర్తి వివరాలకు APSSDC కార్యాలయంలో సంప్రదించవచ్చన్నారు.

News December 8, 2024

మైలవరం: ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

image

మైలవరంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. మైలవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలేజీ హాస్టల్‌లో ఉంటున్న ఓ విద్యార్థిని  శుక్రవారం సాయంత్రం రెండవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. విద్యార్థినిని వెంటనే ఆస్పత్రి తరలించగా చికిత్స పొందుతోంది. విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News December 8, 2024

ఎన్టీఆర్ జిల్లా: పురుగుల మందు తాగి యువతి సూసైడ్

image

పురుగుల మందు తాగి యువతి మృతి చెందిన ఘటన జి.కొండూరు మండలం చేగిరెడ్డిపాడులో జరిగింది. గోళ్ల గోపాలరావు, నాగమణి దంపతుల కుమార్తె భాగ్యలక్ష్మి(17) కొన్నాళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతోంది. విపరీతమైన కడుపు నొప్పి రావడంతో తట్టుకోలేక పురుగుల మందు తాగింది. వెంటనే గుర్తించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు శనివారం పోలీసులు తెలిపారు.

News December 8, 2024

కృష్ణా: బీటెక్ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) క్యాంపస్ కళాశాలలో బీటెక్ చదివే విద్యార్థులకు నిర్వహించే 1వ సెమిస్టర్ రెగ్యులర్‌ & సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 31 నుంచి 2025 జనవరి 8 మధ్య నిర్ణీత తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు జరుగుతాయని KRU తెలిపింది. సబ్జెక్టువారీగా పరీక్షల టైంటేబుల్ వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడాలని సూచించింది. 

News December 7, 2024

దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కల్పించాలి: VHP

image

దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కల్పించాలని విశ్వహిందూ పరిషత్(VHP) ప్రతినిధులు సీఎం చంద్రబాబును కోరారు. శనివారం సీఎంను ఆయన నివాసంలో వీరు కలిసి ఈ అంశంపై తయారు చేసిన ముసాయిదా ప్రతిని అందించారు. జనవరి 5న విజయవాడలో జరిగే హైందవ శంఖారావం సభ వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు దుర్గాప్రసాద రాజు, ప్రధాన కార్యదర్శి మిలింద్, ఉపాధ్యక్షుడు గంగరాజు, గుమ్మళ్ల సత్యం, తదితరులు పాల్గొన్నారు. 

News December 7, 2024

కృష్ణా: ప్రధాని మోదీపి కలిసిన ఏలూరు ఎంపీ

image

నూజివీడులో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం పట్ల ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 8 కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన జాబితాలో నూజివీడుకు స్థానం కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర కేబినెట్ నిర్ణయంతో జిల్లా విద్యార్థులకు విద్యావకాశాలు అందుబాటులోకి రానున్నాయని ఎంపీ పేర్కొన్నారు. 

News December 7, 2024

గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌కు అంతరాయం.. గాల్లోనే విమానాలు

image

గన్నవరం విమానాశ్రయంలో శనివారం దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో విమానాలు ల్యాండింగుకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా, హైదరాబాదు నుంచి వచ్చిన విమానం కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టగా.. ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సుమారు గంటకుపైగా గాల్లో ఉండి, తిరిగి హైదరాబాదుకు వెళ్లినట్లు సమాచారం.

News December 7, 2024

కృష్ణా: 2 రైళ్లను రద్దు చేసిన రైల్వే అధికారులు

image

నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా హౌరా(HWH)- తిరుచిరాపల్లి(TPJ) మధ్య ప్రయాణించే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లను కొద్ది రోజుల పాటు రైల్వే అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు నం.12663 HWH-TPJ మధ్య ప్రయాణించే రైలును ఈనెల 12,15,19న, నం.12664 TPJ-HWH రైలును ఈనెల 10,13,17న రద్దు చేశామని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. 

News December 7, 2024

కృష్ణా: 5 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల 

image

ఏపీ సీఆర్డీఏలో కాంట్రాక్ట్ పద్ధతిన 5 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఈనెల 20లోపు https://crda.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ లీడ్, ప్రాజెక్టు మేనేజర్ తదితర పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఉద్యోగ అర్హతలు తదితర వివరాలకు అభ్యర్థులు CRDA అధికారిక వెబ్‌‌సైట్‌లో CAREERS ట్యాబ్ చూడవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 

News December 7, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాకు 2 కేంద్రీయ విద్యాలయాలు 

image

దేశంలో నూతనంగా ఏర్పాటు కానున్న 85 కేంద్రీయ విద్యాలయాల్లో 8 సంస్థలను ఏపీకి కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో నందిగామ, నూజివీడులో కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేస్తామని క్యాబినెట్ తెలిపింది. గతంలో ఈ 2 ప్రాంతాలకు కేంద్రీయ విద్యాలయాలు మంజూరు కాగా శాశ్వత భవన నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు.