India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడ ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఇటీవల ధ్వంసం అయిన విషయం తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఇరిగేషన్ శాఖ అధికారులు గేట్ల ధ్వంసంపై విచారణ చేయాలని విజయవాడ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరిగేషన్ శాఖ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. కాగా ఆ గేట్లు శుక్రవారం మరమ్మతులు చేశారు.
విజయవాడలో ఇంటింటికి జరుగుతున్న ఉచిత రేషన్ కిట్ల పంపిణీని శుక్రవారం సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఈ కిట్ ద్వారా బియ్యం, ఉల్లిపాయలతో సహా 6 రకాల సరుకులు అందజేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అక్కడి మహిళలతో మాట్లాడి ప్రభుత్వం అందిస్తోన్న వరద సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
విజయవాడ వరదలపై ఫేక్ కథనాలను వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రకృతి ప్రకోపానికి విజయవాడలో లక్షల మంది ప్రజలు నష్టపోయారని చెప్పారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో దురుద్దేశంతో ఫేక్ కథనాలు సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
వరదల కారణంగా దెబ్బతిన్న గ్రామీణ రహదారుల పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు Dy. సీఎం పవన్ తెలిపారు. ఈ మేరకు ఆయన కార్యాలయం తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. గ్రామీణ రహదారులు, పారిశుద్ధ్య కార్యకలాపాల పర్యవేక్షణకై పనిచేసే ఈ బృందాలకు అధికారులుగా కృష్ణా, కాకినాడ, పశ్చిమగోదావరి జిల్లాల ఇన్ఛార్జిగా వీఆర్ కృష్ణతేజను, గుంటూరు, ఏలూరు జిల్లాలకు ఇన్ఛార్జిగా షణ్ముఖ్ను పవన్ నియమించారు.
ప్రకాశం బ్యారేజీ చరిత్రలో ఎన్నడూ లేనంత ఇన్ఫ్లో నమోదయిన విషయం తెలిసిందే. అయితే 120 ఏళ్లలో కృష్ణమ్మ వరద ఉద్ధృతి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 1903 అక్టోబర్ 7న 10.68లక్షల క్యూసెక్కులు, 1914 ఆగస్టు11న 9.49, 1917 నవంబర్ 2న 9.55, 1949 సెప్టెంబర్ 24న 9.25, 1964 అక్టోబర్ 2న 9.88, 1998 అక్టోబర్ 17న 9.32, 2009 అక్టోబర్ 5, 6న 10.94, 2024 సెప్టెంబరులో 11.38లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వరద వచ్చింది.
అధిక వర్షాలు, వరదల కారణంగా జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ బాలాజీ తెలిపారు. గ్రామ స్థాయిలో VRO, వ్యవసాయ సహాయకులు, మండల స్థాయిలో తహశీల్దార్, AO, డివిజన్ స్థాయిలో RDO, వ్యవసాయ సహాయకులతో బృందాలు వేశామన్నారు. 33% మేర నష్టపోయిన పంటను వీరు పరిగణనలోకి తీసుకుంటారని, ఈనెల 10లోపు నష్టం అంచనాలు పూర్తి చేసి 16లోపు బాధితుల జాబితాను ప్రదర్శిస్తారన్నారు.
కృష్ణా యూనివర్శిటీ పరిధిలోని కళాశాలల్లో బీఈడీ, స్పెషల్ బీఈడీ 4వ సెమిస్టర్(2020, 21, 22 బ్యాచ్లు) విద్యార్థులు రాయాల్సిన థియరీ పరీక్షలను అక్టోబర్ 15 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సెప్టెంబర్ 17లోపు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, పూర్తి వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవాలని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
రానున్న రెండు మూడు రోజుల్లో విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టనున్న పనులను CM చంద్రబాబు వివరించారు. రేపటి నుంచి రేషన్ కిట్ల పంపిణీ, విద్యుత్, మంచినీటి సరఫరా చేస్తామని విజయవాడలో అన్నారు. అపార్ట్మెంట్లు, ఇళ్లలో ఉన్న నీటిని మోటార్లు పెట్టి తోడిస్తామని చెప్పారు. నగరంలో ఇంకా 1టీఎంసీ నీరు ఉన్నట్లు.. త్వరలోనే తోడుతామన్నారు. అనంతరం పారిశుద్ధ్య పనులు నిర్వహించి బ్లీచించ్ చేస్తామని చెప్పారు.
ఆర్మీ టాస్క్ఫోర్స్(ఇంజినీర్) బృందం విజయవాడలో వరద బాధితులకు సేవలు అందించేందుకు ప్రత్యేక విమానంలో నగరానికి బయలుదేరింది. ఈ మేరకు సంబంధిత వర్గాలు గురువారం ఒక ప్రకటన విడుదల చేశాయి. విపత్తు నిర్వహణలో సుశిక్షితులైన ఈ ఆర్మీ టాస్క్ఫోర్స్ బృందం వరద బాధితుల సేవలు తదితర అంశాలలో పాలుపంచుకుంటాయని తాజాగా సమాచారం వెలువడింది.
బుడమేరు వరదతో అల్లకల్లోలంగా మారిన విజయవాడ నగరం క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. వరద ప్రవాహం తగ్గడంతో గురువారం సాయంత్రం అజిత్ సింగ్ నగర్ పైవంతెనపైకి వాహనాల రాకపోకలను ప్రభుత్వం యంత్రాంగం అనుమతించింది. నగరంలోని పలు వరద ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరా సైతం పునరుద్ధరణ జరగడంతో అక్కడి ప్రజలు సహాయ కేంద్రాల నుంచి తమ నివాసాలకు వెళుతున్నారు.
Sorry, no posts matched your criteria.