Krishna

News November 19, 2024

కృష్ణా: ఆ రైళ్లకు కొత్త నంబర్లు

image

ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే 4 రైళ్లకు 2025 మార్చి 1 నుంచి కొత్త నంబర్లను రైల్వే శాఖ కేటాయించింది. నం.17487 & 17488 విశాఖపట్నం- కడప మధ్య ప్రయాణించే తిరుమల ఎక్స్‌ప్రెస్‌లకు నూతనంగా 18521 & 18522 నంబర్లను కేటాయించింది. అదేవిధంగా 22701 & 22702 విశాఖపట్నం- గుంటూరు ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌లకు 22875 & 22876 నంబర్లను కేటాయించామని రైల్వే శాఖ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.

News November 19, 2024

గుడివాడలో లంచం తీసుకున్న కేసులో సీఐ సస్పెండ్

image

రాజమండ్రి టూ టౌన్ సీఐ దుర్గారావుని ఉన్నతాధికారులు సోమవారం సస్పెండ్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. 2022లో గుడివాడ టూ టౌన్‌లో దుర్గారావు సీఐగా పనిచేస్తున్న సమయంలో భూ వివాదం కేసులో రెండు వర్గాల మధ్య సమస్యను పరిష్కరించారు. ఈ వివాదంలో ఓ వర్గంవారిని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారనే ఆరోపణలపై బాధితుడు ఏసీబీ వారిని ఆశ్రయించాడు. దర్యాప్తులో నేరం రుజువు కావడంతో సీఐ సస్పెండ్‌కు గురయ్యారు.

News November 19, 2024

విశాఖలో కొడాలి నానిపై ఫిర్యాదు

image

మాజీ మంత్రి కొడాలి నానిపై విశాఖ టూ టౌన్ స్టేషన్‌లో TDP నాయకులు సోమవారం ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్‌పై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ TDP జిల్లా పార్లమెంటు ఉపాధ్యక్షుడు విల్లూరి చక్రవర్తి, విల్లూరి తిరుమలదేవి ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. వైసీపీలోని మరో కీలక నేతలు అంబటి రాంబాబు, రోజాపై కూడా ఫిర్యాదు చేశారు.

News November 19, 2024

ఆ సమస్యను వారం రోజులలో పరిష్కరిస్తా: విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా

image

వస్త్రలత దుకాణ సముదాయంలోని వ్యాపారులు, అధికారులతో పశ్చిమ ఎమ్మెల్యే సుజనా సోమవారం తన కార్యాలయంలో సమావేశమయ్యారు. సమావేశంలో వస్త్రలతకు సంబందించిన అద్దె బకాయిల సమస్యను వారం రోజులలో పరిష్కరిస్తానని వ్యాపారులకు ఆయన హామీ ఇచ్చారు. కాంప్లెక్స్ పటిష్టతపై వ్యాపారులతో చర్చించిన సుజనా..దుకాణాల పునర్నిర్మాణం అంశంపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.

News November 18, 2024

కంచికచర్ల: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

image

కంచికచర్ల పట్టణ శివారు ప్రాంతంలో సోమవారం ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ రాజు వివరాల మేరకు.. మృతుడు విజయవాడకు చెందిన కారంపూడి రవీంద్ర. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతికి గల వివరాలు తెలియాల్సి ఉంది.

News November 18, 2024

కృష్ణా: బీ- ఫార్మసీ 5వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో బీ- ఫార్మసీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 5వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. డిసెంబర్ 3, 5, 7, 10, 12 తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్ట్ వారీగా టైమ్ టేబుల్, పరీక్ష కేంద్రాల వివరాలకై https://kru.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది. 

News November 18, 2024

జగ్గయ్యపేట: మద్యం మత్తులో మహిళపై ఉపాధ్యాయుడి దాడి

image

జగ్గయ్యపేట పట్టణ పరిధిలోని ధనం బోర్డు కాలనీలో వివాహిత మణిపై ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు సాంబశివరావు మద్యం మత్తులో బ్లేడుతో శనివారం రాత్రి 11:30 సమయంలో నిద్రపోతున్న మహిళ గొంతు కోశాడు. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్త్రావం కావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

News November 18, 2024

సోషల్ మీడియాలో సైతం మద్యం వ్యాపారాలు: దేవినేని అవినాశ్

image

విజయవాడలో మద్యం డోర్ డెలివరీ చేస్తామంటూ ఇటీవల ఓ పోస్ట్ వైరల్ అయింది. దీనిపై YCP NTR జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. మద్యం డోర్ డెలివరి చేస్తామంటూ ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. కూటమి పాలనలో ఏకంగా సోషల్ మీడియాలో సైతం వాపారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. గత ప్రభుత్వం గడప వద్దేకే సంక్షేమం అందిస్తే.. కూటమి ప్రభుత్వం గడప వద్దకే మద్యం అందించి మత్తులో ఉంచుతోందన్నారు.

News November 18, 2024

విజయవాడ: RTC డ్రైవర్‌పై దాడి.. కేసు నమోదు

image

విజయవాడ కృష్ణలంకలో ఆదివారం సాయంత్రం RTC డ్రైవర్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కృష్ణలంక సీఐ నాగరాజు స్పందిస్తూ.. డ్రైవర్ కోటేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేశామని చెప్పారు. RTC డ్రైవర్ బస్టాండ్ నుంచి తెనాలివైపు వస్తుండగా ఇనోవా కారులో ఉన్న వ్యక్తులు అడ్డగించి దాడి చేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అనంతరం వారిని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశామని సీఐ వెల్లడించారు.

News November 18, 2024

నేడు మచిలీపట్నంలో ‘మీకోసం’ కార్యక్రమం

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన ‘మీకోసం’ కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు కృష్ణా కలెక్టర్ DK బాలాజీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజానీకం ‘మీకోసం’ కార్యక్రమంలో సంబంధిత అధికారులకు అర్జీలు సమర్పించవచ్చని సూచించారు.