India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో వాటర్&వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ టెక్నాలజీ కోర్సులో పీజీ డిప్లొమా(Y19) చదివిన విద్యార్థుల కోసం ‘వన్ టైం ఆపర్చునిటీ’ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 2025 జనవరి 2 నుంచి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని, లేట్ ఫీ లేకుండా ఈనెల 26లోపు విద్యార్థులు ఫీజు చెల్లించాలని KRU పరీక్షల విభాగం సూచించింది. ఫీజు వివరాలకు https://kru.ac.in/ వెబ్సైట్ చూడవచ్చని తెలిపింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు డిసెంబర్ 20వ తేదీన కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన గంగూరులో ధాన్యం కొనుగోలను పరిశీలించనున్నారు. అనంతరం ఈడుపుగల్లు రెవెన్యూ సదస్సులో పాల్గొంటారు. ఆ సదస్సులో ప్రజల నుంచి వినతలు స్వీకరించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నాయకులు ఏర్పాట్లు పరిశీలించారు.

జాతీయ లోక్ అదాలత్ కేసులలో కృష్ణా జిల్లాలో 4,436 కేసులు పరిష్కరించిన పోలీస్ యంత్రాంగాన్ని డీజీపీ ద్వారకా తిరుమలరావు అభినందించారు. బుధవారం ఆయన కృష్ణా జిల్లా SP ఆర్.గంగాధర్ను ఈ సందర్భంగా అభినందించారు. ఈ మేరకు SP, ఇతర పోలీస్ సిబ్బందికి డీజీపీ ప్రశంసాపత్రాన్ని అందజేశారు. జాతీయ లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో ఉందని SP డీజీపీకి తెలిపారు.

విజయవాడలో జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ను బుధవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేసి తాగు నీరు అందిస్తామన్నారు. కుళాయి ద్వారా నాణ్యమైన మంచి నీరు అందించాలన్నదే ఈ పథకం లక్ష్యమని తెలిపారు. ఒక మనిషికి 55 లీటర్ల నీటిని అందించే కార్యాచరణ రూపొందించామన్నారు.

టెక్ తోడుగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈ యాప్ను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో జరిగిన సమన్వయ శాఖల సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ.. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర బాబుతో కలిసి యాప్ను పరిశీలించారు. భక్తులకు మరింత సౌకర్యంగా ఉండేలా చేయాల్సిన మార్పులపై కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు.

ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సుల ద్వారా భూ వివాదాలు సమస్యలను పరిష్కరించడంలో బాధ్యతారాహిత్యాన్ని ఎట్టి పరిస్థితులలోను సహించబోమని అధికారులు సిబ్బంది ఆలోచన ధోరణిలను మార్చుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. జిల్లాలో జరుగుతున్న రెవెన్యూ సదస్సుల ద్వారా చేపట్టిన అర్జీల పరిష్కారంపై బుధవారం కలెక్టర్ లక్ష్మీశ, ఆర్డీవో, తహసీల్దార్లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

జిల్లాలో చేపట్టిన హౌస్ హోల్డ్ సర్వేను వారం రోజుల్లో పూర్తిచేసి పౌరుల మిస్సింగ్ డేటాను గృహ డేటా బేస్లో చేర్చాలని కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో నిర్వహిస్తున్న హౌస్ హోల్డ్ సర్వే ప్రగతిపై బుధవారం సమీక్షా నిర్వహించారు. దారిద్య్ర రేఖకు దిగువున ఉన్నవారు సంక్షేమ పథకాల లబ్ది పొందుతున్నవారు డేటాబేస్లో నమోదు చేయబడ్డారన్నారు.

తనతో సహజీవనం చేస్తున్న జ్యోతి అనే యువతిని తన తండ్రి అక్రమంగా నిర్బంధించారంటూ ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పల్లవి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారించింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు జ్యోతిని కోర్టు ముందు హాజరుపర్చారు. ఘటనపై న్యాయమూర్తులు జ్యోతితో మాట్లాడి ఆరా తీశారు. ఇద్దరూ మేజర్లు కావడంతో చట్ట ప్రకారం నిర్ణయాలు తీసుకునే హక్కు వారికి ఉందని న్యాయమూర్తులు స్పష్టం చేస్తూ విచారణను ముగించారు.

శబరిమలై వెళ్లేవారికై నరసాపురం(NS)- కొల్లామ్(QLN) మధ్య 4 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ PRO ఏ.శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు 2025 JAN 15, 22న NS- QLN(నం.07183), JAN 17, 24న QLN- NS(నం.07184) రైళ్లు నడుతున్నామన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కైకలూరు, గుడివాడ, విజయవాడ స్టేషన్లలో ఆగుతాయని అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

విజయవాడలో వ్యభిచార గృహంపై పోలీసులు మంగళవారం రాత్రి దాడులు నిర్వహించారు. కొత్తపేట సీఐ కొండలరావు తెలిపిన వివరాలు మేరకు చిట్టినగర్ సిండికేట్ బ్యాంక్ కాలనీలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు దాడి చేశామన్నారు. ఈ ఘటనలో నిర్వాహకురాలు సరోజిని అలాగే ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నమని పోలీసులు వెల్లడించారు. నగరంలో ఆసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే సమాచారం అందించాలని సీఐ తెలిపారు.
Sorry, no posts matched your criteria.