Krishna

News April 28, 2024

ఎన్టీఆర్ జిల్లాలో ఓటర్ల వివరాలు ఇలా..!

image

ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఏడాది ఓటర్ల సంఖ్య 17,04,007 కు చేరుకుంది. నియోజకవర్గాల వారీగా మొత్తం ఓటర్ల సంఖ్య ఇలా..!
తిరువూరు: 2,07,190
విజయవాడ పశ్చిమ: 2,55,963
విజయవాడ సెంట్రల్: 2,77,724
విజయవాడ తూర్పు: 2,70,624
మైలవరం: 2,81,732
నందిగామ: 2,05,480
జగ్గయ్యపేట:2,05, 364

News April 28, 2024

కృష్ణా: వైసీపీలో చేరిన MLA అభ్యర్థి

image

జగ్గయ్యపేట అసెంబ్లీ జై భీమ్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న కరిసే మధు వైసీపీలో చేరారు. తొర్రగుంటపాలెంలో శనివారం రాత్రి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో MLA అభ్యర్థి సామినేని ఉదయభాను సమక్షంలో పార్టీలో చేరగా కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే ఏకైక నాయకుడు ఉదయభాను మాత్రమే అని అన్నారు.

News April 28, 2024

కృష్ణా జిల్లాలో మరింత పెరిగిన ఓటర్లు

image

కృష్ణా జిల్లాలో ఓటర్ల సంఖ్య మరింత పెరిగింది. జనవరి 22న విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాకు అదనంగా సప్లమెంటరీ ఓటర్ల జాబితాను అధికారులు ప్రకటించారు. ఈ జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 15,39,460 మంది ఓటర్లు ఉన్నారు. గత జనవరిలో 15,18,255 మంది ఓటర్లతో విడుదల చేసిన జాబితాతో పోలిస్తే జిల్లాలో 21,205 మంది ఓటర్లు పెరిగారు. వీరంతా మే 13న జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

News April 27, 2024

తాడిగడపలో భార్యను హత్య చేసిన భర్త

image

తాడిగడపలో శనివారం దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్యను భర్త హత్య చేశాడు. భర్త శ్రీనివాసరావు ఇంటికి వచ్చే సమయంలో భార్య షకీలా ఫోన్ మాట్లాడుతూ ఉంది. ఈ క్రమంలో హత్య చేసినట్లు సమాచారం. శ్రీనివాసరావును షకీలా రెండో వివాహం చేసుకుంది. ఫేస్‌బుక్ ద్వారా ఇరువురికి పరిచయం ఏర్పడిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై పెనమలూరు సీఐ రామారావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

News April 27, 2024

మచిలీపట్నం: మట్టి ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతి

image

మట్టి ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతి చెందిన ఘటన మచిలీపట్నం మండలం పోతేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. చిన్నపోతేపల్లి గ్రామానికి చెందిన యువకుడు పుప్పాల గణేశ్ మట్టి ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శనివారం ఉదయం పోతేపల్లి నుంచి మట్టి లోడ్ చేసుకుని వెళుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ తిరగబడింది. తీవ్రంగా గాయపడిన అతడిని హుటాహుటిన జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News April 27, 2024

ఎన్టీఆర్: ఈ సీజన్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం ఇదే

image

ఎన్టీఆర్ జిల్లాలో ఈ సీజన్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంత వివరాలను ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలియజేశారు. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలో ఈనెల 7వ తేదీన 44.1°C ఉష్ణోగ్రత నమోదు అయింది. ఇదే 26.04.2024 వరకు అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం అని తెలియజేశారు.

News April 27, 2024

ఎన్టీఆర్: 85 నామినేషన్లు తిరస్కరణ

image

ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల స్క్రూటినీలో భాగంగా విజయవాడ పార్లమెంట్‌, తిరువూరు, జగ్గయ్యపేట, మైలవరం, నందిగామ, విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్‌ నియోజకవర్గాలకు సంబంధించి 125 నామినేషన్లు ఆమోదం పొందగా.. 85 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మొత్తం 332 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఒకే అభ్యర్థి నాలుగు సెట్ల వరకు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో 122 సెట్ల నామినేషన్లు అదనంగా వచ్చాయి.

News April 27, 2024

పార్టీ ఏ పని చెప్తే.. అది చేస్తా: పేర్ని నాని

image

రాజకీయంగా అకౌంటబులిటీ లేని జీవితం గడపాలనే రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు పేర్ని నాని తెలిపారు. ‘జగన్ అంటే పిచ్చి ఉంది. వైసీపీ అంటే ప్రేమ ఉంది. పార్టీకి ఏ అవసరం వచ్చినా నన్ను పిలిస్తే అది చేస్తానని సీఎం జగన్‌కు చెప్పాను. నాకు నచ్చజెప్పడానికి జగన్ చాలా సార్లు ప్రయత్నించారు. పోర్టు శంకుస్థాపనకు మచిలీపట్నం వచ్చిన రోజు ఇక నేను మాట వినను అని జగన్ డిసైడ్ అయ్యారు’ అని పేర్ని నాని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

News April 27, 2024

కొల్లు రవీంద్రపై 25 కేసులు.. తంగిరాల సౌమ్యపై 23 కేసులు

image

కొల్లు రవీంద్రపై 25, తంగిరాల సౌమ్యపై 23 కేసులు ఉన్నట్లు ఇటీవల వాళ్లు దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు. కొల్లు రవీంద్రపై సీఐడీ కేసు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తదితర కేసులున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారనే కారణంతో తంగిరాల సౌమ్యపై 8 కేసులు.. శాంతి భద్రతల విఘాతం కలిగినందుకు పలు కేసులు నమోదయ్యాయి. ఇవన్ని వైసీపీ హయాంలోనే పెట్టారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News April 27, 2024

మైలవరంలో బీసీవై పార్టీకి ఎదురుదెబ్బ

image

మైలవరంలో బీసీవై పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ తరఫున నామినేషన్ వేసిన కొండపల్లి మున్సిపల్ కౌన్సిలర్ ముప్పసాని భూలక్ష్మి నామినేషన్‌‌ను తిరస్కరించారు. దీంతో ఆ పార్టీ మైలవరం బరిలో లేనట్లే. 175 నియోజవర్గాల్లో సత్తా చాటుతామని ఆ పార్టీ అధినేత ఆశలు అడియాసయ్యాయి. బరిలో నిలుద్దామనుకున్న అభ్యర్థికి కూడా షాక్ తగిలినట్లు అయింది. ఈమె ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.