India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుడివాడ YCP అభ్యర్థి కొడాలి నాని నామినేషన్పై వివాదం నెలకొంది. నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చారని ROకి TDP నేతలు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఆఫీస్ను కొడాలి నాని క్యాంప్ ఆఫీస్గా వినియోగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు సమాచారమిచ్చిన నాని అభ్యర్థిత్వాన్ని తిరస్కరించాలని కోరారు. మరోవైపు ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని వినియోగించలేదని కొడాలి నాని అఫిడవిట్లో పేర్కొన్నారు.
అంతర్జాతీయ సేవా సంస్థ లయన్స్ క్లబ్కు 2024-2025 సంవత్సరానికి గానూ లీగల్ ఎయిడ్ విభాగానికి ఎన్టీఆర్, కృష్ణాజిల్లా ఛైర్మన్గా మచిలీపట్నంకు చెందిన ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా గవర్నర్ శేషగిరిరావు ఉత్తర్వులు జారీ చేశారు. 18 సంవత్సరాలుగా బాలాజీ లయన్స్ క్లబ్లో అనేక పదవులు నిర్వహించి పలు సేవా అవార్డులు పొందారు.
గుడివాడ TDP అభ్యర్థి వెనిగండ్ల రాము తన కుటుంబ ఆస్తిని రూ.284.36 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్లో చూపారు. చరాస్తులు తన పేర రూ.136.24 కోట్లు, భార్య సుకుధకు రూ.72.43 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. స్థిరాస్తులు తన పేరున రూ.64.74 కోట్లు, భార్య పేరున రూ.10.93 కోట్లు ఉన్నాయి. తనకు రూ.5.62 కోట్లు, తన భార్యకు రూ.10.98 కోట్లు వివిధ బ్యాంకుల్లో లోన్ల రూపంలో అప్పులు ఉన్నట్టు చూపారు.
మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పేరు కలిసేలా Ch బాలశౌరి అనే వ్యక్తి, YCP MP అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావు పేరు కలిసేలా రావూరి చంద్రశేఖర్, అన్నే చంద్రశేఖర్ నామినేషన్ వేశారు. పెడన TDP అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ పేరు కలిసేలా కాగిత శ్రీహరి కృష్ణప్రసాద్, గుడివాడ YCP అభ్యర్థి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు పేరు కలిసేలా వెంకటేశ్వరావు కొడాలి అనే వ్యక్తి పేరిట నామినేషన్లు దాఖలయ్యాయి.
మాజీ మంత్రి పేర్ని నాని మచిలీపట్నం అసెంబ్లీ స్థానానికి 3 సెట్ల నామినేషన్లు వేశారు. అది కూడా వైసీపీ అభ్యర్థిగా. అదేంటి పొలిటికల్ రిటైర్మెంట్ అని, మళ్లీ నామినేషన్ వేయడం ఏమిటా అని అనుకుంటున్నారా.? తన కుమారుడు పేర్ని కిట్టుకు ఆయన డమ్మీగా నామినేషన్ వేశారు. స్క్రూటినీలో తన కుమారుడి నామినేషన్ అంతా కరెక్ట్గా ఉంటే పేర్ని నాని తన నామినేషన్ విత్ డ్రా చేసుకోనున్నారు.
జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం అసెంబ్లీ నియోజకవర్గాలకు సాధారణ పరిశీలకులుగా విచ్చేసిన ఐఏఎస్ అధికారి నరీందర్ సింగ్ బాలితో ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఢిల్లీ రావు గురువారం భేటీ అయ్యారు. విజయవాడలోని మునిసిపల్ గెస్ట్ హౌస్లో మర్యాదపూర్వకంగా వారిని కలిసి పుష్ప గుచ్చమిచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.
విజయవాడ పోలీస్ కమిషనర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి రామకృష్ణ నేడు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ.. విజయవాడలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సీపీకి సూచనలు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబుతో బీజేపీ జాతీయ నేతలు గురువారం సమావేశమయ్యారు. ఉదయం తాడేపల్లిలోని చంద్రబాబు నివాసానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, నేతలు అరుణ్సింగ్, శివప్రకాశ్, మధుకర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి చంద్రబాబు స్వాగతం పలికారు. అనంతరం వివిధ అంశాలపై వారితో చర్చించారు. ఎన్నికల ప్రచారం, కూటమి పార్టీల మధ్య సమన్వయం తదితర విషయాలపై చర్చ జరిపినట్లు సమాచారం.
ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఏప్రిల్ 28న ఆదివారం ఉదయం 7 గంటలకు కృష్ణా జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో అండర్ 23 పురుషుల జిల్లా జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అడహాక్ కమిటీ ఛైర్మన్ త్రినాధ్ రాజ్ గురువారం తెలిపారు. జిల్లాలో ఆసక్తి గల వారు ఎవరైనా ఆధార్ కార్డ్, జనన ధ్రువీకరణ పత్రంతో ఈ ఎంపికలలో పాల్గొనవచ్చన్నారు. క్రీడాకారులు తమ సొంత క్రీడా దుస్తులతో హాజరవ్వాలని చెప్పారు.
పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా టాపర్గా నిలిచిన గుడివాడకు చెందిన ఏకేటీపీ ఎంజీహెచ్ హై స్కూల్ విద్యార్థి అల్లంపల్లి భాను ప్రసన్నను జిల్లా విద్యాశాఖాధికారిణి తాహేరా సుల్తానా అభినందించారు. మచిలీపట్నంలోని డీఈవో కార్యాలయంలో ప్రసన్నను ఆమె సత్కరించారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ప్రసన్న 590 మార్కులు సాధించారు.
Sorry, no posts matched your criteria.