India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రకాశం బ్యారేజ్కు రికార్డు స్థాయిలో వరద రావడంతో అందరూ దాని గురించే చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బ్యారేజ్ విశేషాలు పరిశీలిస్తే..
* 1954లో పనులు మొదలుపెట్టి 1957లో ప్రారంభం
* నిర్మాణానికి రూ.2.78కోట్ల ఖర్చు.
* పొడవు 1,223.5 మీటర్లు, 70 గేట్లు.
* ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 13.08లక్షల ఎకరాలకు సాగునీరు
* 2024, సెప్టెంబర్ 2న వచ్చిన 11,43,201 క్యూసెక్కుల ప్రవాహమే ఇప్పటివరకు అత్యధికం
ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. మంగళవారం రాత్రి 10గంటలకు బ్యారేజీ నుంచి 70గేట్ల ద్వారా 6.61 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 500 క్యూసెక్కుల నీటిని కాలువలకు మళ్లించారు. వరద ఉద్ధృతి గంట గంటకూ తగ్గుముఖం పట్టడంతో లంకగ్రామాల ప్రజల ఊపిరి పీల్చుకున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ, బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గాల్లో నీటమునిగిన లంక గ్రామాలు బయటపడుతున్నాయి.
విజయవాడ శివారు జక్కంపూడికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. జక్కంపూడి వైయస్సార్ కాలనీ ప్రాంతాలు భారీగా నీట మునిగాయి. ఈ ప్రాంత ప్రజలు ఇటీవల ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ నుంచి జక్కంపూడి చంద్రబాబు వెళ్లనున్నారని సీఎం కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. జక్కంపూడి ప్రాంత ప్రజలను సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు.
ఆహారం, పాలు, నీళ్ల కోసం విజయవాడ ప్రజలు అలమటిస్తున్నారు. ప్రభుత్వం, కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. ఆహారం, పాలు, నీటిని ఇస్తుండగా.. వీటిని పోటీపడి మరి కొందరే చేజిక్కించుకుంటున్నారు. తర్వాత వాటిని మరికొందరికి విక్రయిస్తున్నారని సమాచారం. విపత్కర స్థితిలో ఇలాంటి చెత్త పని ఏంటని పలువురు అంటున్నారు. అందరికీ ఆహారం అందేలా మనమందరం ప్రయత్నిద్దాం. ఇంతకీ మీ ఏరియాలోనూ ఇలా జరిగిందా? కామెంట్ చేయండి.
విజయవాడ డివిజన్ మీదుగా సాగే 450 రైళ్లలో 436 రైళ్లు వరద ప్రభావానికి రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఖాజీపేట, విజయవాడ సెక్షన్లో వరద కారణంగా 275 రైళ్లను రద్దు చేశారు. 149 రైళ్లను దారి మళ్లించారు. మరో 12 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ఖాజీపేట, విజయవాడ సెక్షన్లో గండ్లు పడి అటువైపు రైల్వే రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు ఈ మేరకు సహకరించాలని కోరారు.
విజయవాడలో సోమవారం రాత్రి సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశంలో మంత్రులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రుల ఎస్కార్ట్ వాహనాలు విత్ డ్రా చేసుకోవాలని మంత్రి లోకేశ్ ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనను మంత్రులు అంగీకరించారు. వరద నేపథ్యంలో ఆ వాహనాలను సహాయక చర్యలకు వినియోగించాలని నిర్ణయించారు. దీంతో నిత్యావసర వస్తువులు, భోజనం, తాగునీరు అందించే వాహనాలకు ఎస్కార్ట్గా మంత్రుల వాహనాలు వెళ్లనున్నాయి
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ, భవానీపురం, సింగ్ నగర్ ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు విజయవాడ కలక్టరేట్కి వచ్చారు. అనంతరం మరోసారి ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాత్రి లోపు పొరుగు జిల్లాల అధికారులతో మాట్లాడి మరో 3 లక్షల ఆహార ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు తెప్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
కృష్ణాజిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు మంగళవారం కూడా సెలవు ప్రకటించారు. కృష్ణానదికి వరద ఉద్ధృతి తగ్గకపోవటంతో కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారిణి తాహేరా సుల్తానా ఓ ప్రకటనలో తెలిపారు. తల్లిదండ్రులెవరూ పిల్లలను స్కూల్స్కు పంపవద్దని డీఈఓ కోరారు.
★ అర్ధరాత్రి 1AM: విజయవాడ సింగ్ నగర్ వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల పరిశీలన
★ 1.50 AM: కృష్ణలంకలో ముంపు ప్రాంతాలలో పర్యటన
★ 2.00 AM: ఇబ్రహీంపట్నం వద్ద వరద ఉద్ధృతి పరిశీలన
★ తర్వాత తిరిగి విజయవాడ కలెక్టరేట్కు.. అధికారులతో సమీక్ష
★ 2.30 AM: ఫెర్రీ, ఇబ్రహీంపట్నం, జూపూడి ప్రాంతాల్లో పర్యటన.. బాధితులకు ధైర్యం చెప్పిన సీఎం
★ 3:20 AM: ఇబ్రహీంపట్నంలో పరిస్థితిపై ఆరా
సీఎం చంద్రబాబు అర్ధరాత్రి విజయవాడలో పర్యటించారు. మరోసారి సింగ్ నగర్ వెళ్లిన ఆయన చీకటిగా ఉండటంతో సెల్ఫోన్, కెమెరా, బ్యాటరీ లైట్ల వెలుతురులో పర్యటన సాగించారు. ఈ సందర్భంగా వరదనీటిలో మునిగిన బాధితులకు భోజన పొట్లాలు పంపిణీ చేశారు. అనంతరం వారితో మాట్లాడుతూ.. ఎవరూ అధైర్యపడొద్దని, అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాని భరోసా కల్పించారు.
Sorry, no posts matched your criteria.