Krishna

News April 22, 2024

కృష్ణా జిల్లాలో నేడు నామినేషన్లు వేసేది వీరే

image

కృష్ణా జిల్లాలో నేడు వైసీపీ, టీడీపీ బలపరిచిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. వీరిలో మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి వైసీపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ రావు నేటి ఉదయం కలెక్టరేట్‌లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. అదే విధంగా పెడన నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.

News April 22, 2024

NTR జిల్లాలో నేడు నామినేషన్లు వేసేది వీరే

image

ఎన్టీఆర్ జిల్లాలో నేడు బీజేపీ, జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. వీరిలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ రావు, మైలవరం నియోజకవర్గం నుంచి వసంత వెంకట కృష్ణ ప్రసాద్, నందిగామ నియోజకవర్గం నుంచి తంగిరాల సౌమ్య, తిరువూరు నియోజకవర్గం నుంచి కొలకపూడి శ్రీనివాసరావు నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు.

News April 22, 2024

కంకిపాడు: యువతి కోసం ఘర్షణ.. గాయాలు

image

కంకిపాడు జాతీయ రహదారి సమీపంలో ఆదివారం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎస్సై సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ యువతి విషయమై ముగ్గురు యువకులు ఘర్షణ పడినట్లు తెలిపారు. వణుకూరు, ఉయ్యూరు గ్రామాలకు చెందిన యువకులు బీరు బాటిళ్లతో జాతీయ రహదారి సమీపంలో దాడులు చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులు గాయాల పాలవగా వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నామని చెప్పారు.

News April 22, 2024

NTR: చెక్‌పోస్టుల వ‌ద్ద నిరంత‌ర నిఘా

image

మ‌ద్యం, డ‌బ్బు, విలువైన వ‌స్తువులు త‌దిత‌రాల అక్ర‌మ ర‌వాణాకు అడ్డుక‌ట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వ‌ద్ద క‌ట్టుదిట్టంగా నిరంత‌ర నిఘా కొన‌సాగుతోంద‌ని క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. చెక్‌పోస్టుల కార్య‌క‌లాపాల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో భాగంగా ఆయన ఆదివారం ప్ర‌కాశం బ్యారేజ్ వ‌ద్ద పోలీస్ చెక్‌పోస్టును ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. అనంతరం వాహ‌నాల త‌నిఖీ ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించారు.

News April 21, 2024

కృష్ణా: మేకలు తోలుకొని వెళుతున్న మహిళపై అత్యాచారయత్నం

image

ముసునూరు మండలంలోని చింతలవల్లి గ్రామంలో మహిళ మేకలను మేతకు తోలుకు వెళుతుండగా, ఆదివారం అదే గ్రామానికి చెందిన శ్యామ్ కుమార్ అనే వ్యక్తి అత్యాచారయత్నం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసే దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ వాసు తెలిపారు. క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి విచారణ అనంతరం తగిన చర్యలు చేపడతామని ఎస్ఐ వాసు స్పష్టం చేస్తున్నారు.

News April 21, 2024

విజయవాడ: ఇందిరా గాంధీ స్టేడియంలో ఉచిత యోగా

image

స్థానిక ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఏప్రిల్ 22వ తేదీ నుంచి ఉచిత యోగ వేసవి క్రీడా శిక్షణ శిబిరం ప్రారంభిస్తున్నట్లు అమరావతి యోగా, ఏరోబిక్ సంఘ అధ్యక్షుడు నాగేశ్వరరావు ఆదివారం తెలిపారు. సోమవారం ఉదయం 6 గంటలకు కలెక్టర్ ఢిల్లీ రావు ఈ శిబిరాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. నగరంలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

News April 21, 2024

జిల్లాలో 634 సీ-విజిల్ ఫిర్యాదుల ప‌రిష్కారం: ఢిల్లీరావు

image

జిల్లాలో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి అమ‌ల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు సీ-విజిల్ ద్వారా 634 ఫిర్యాదులు ప‌రిశీలించి ప‌రిష్క‌రించిన‌ట్లు కలెక్ట‌ర్ ఢిల్లీరావు తెలిపారు. ఓట‌ర్ హెల్ప్‌లైన్‌, నేష‌న‌ల్ గ్రీవెన్స్ స‌ర్వీసెస్ పోర్ట‌ల్ త‌దిత‌ర మార్గాల ద్వారా మొత్తం 1, 635 ఫిర్యాదులు రాగా 1, 609 ఫిర్యాదుల ప‌రిష్కార ప్ర‌క్రియ పూర్త‌యింద‌న్నారు. మిగిలినవి పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు.

News April 21, 2024

మైలవరం వైసీపీ అభ్యర్థి సామాన్యుడే 

image

మైలవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్ తిరుపతిరావు ఆస్తి వివరాలు చూస్తే సామాన్యుడే అని అన్నట్లుగా అనిపిస్తుంది. కెనరా బ్యాంకులో ఉన్న అకౌంట్లో రూ.1000, మైలవరం మండల పుల్లూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్లో రూ.9,823 ఉన్నట్లు చూపించారు. తన పేరుతో రూ.73,531 విలువైన 2016 మోడల్ బైకు, రూ.55,200 విలువైన 8 గ్రాముల బంగారు ఉంగరం, చేతిలో క్యాష్ రూపంగా రూ.50 వేలు ఉన్నట్లు పొందుపరిచారు. 

News April 21, 2024

ఈ నెల 23 ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ

image

ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఈ నెల 23వ తేదీ ఉదయం నిర్వహించడానికి దేవస్థాన వైదిక కమిటీ నిర్ణయించింది. చైత్ర పౌర్ణమిని పురస్కరించుకుని 23వ తేదీ మంగళవారం ఉదయం 5.55 గంటలకు ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభం కానుంది. సుమారు 8 కిలోమీటర్ల మేర సాగే ప్రదక్షిణలో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీపై ఊరేగిస్తారు.

News April 21, 2024

విజయవాడలో నవ వరుడు ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులతో నవ వరుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జక్కంపూడి కాలనీలో చోటు చేసుకుంది. అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా శనివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జక్కంపూడి కాలనీ బ్లాక్ నంబర్ 24లో మేరీ గ్రేసీ, వెంకట్ నివాసం ఉంటున్నారు. నెల రోజుల కిందటే గ్రేసీ, వెంకట్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.