India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బాలికను వేధిస్తున్న ఓ యువకుడిపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం.. అజిత్ సింగ్ నగర్ ప్రాంతానికి చెందిన బాలిక(16)ను లూనా సెంటర్ ప్రాంతానికి చెందిన కళ్యాణ్ అనే యువకుడు వేధింపులకు గురిచేసినట్లు సమాచారం. శనివారం కూడా కళ్యాణ్ బాలికను వేధింపులకు గురి చేయడంతో బాలిక తల్లిదండ్రులు అజిత్ సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
మహావీర్ జయంతి సందర్భంగా ఆదివారం నగరంలో మాంసం విక్రయాలపై నిషేధం విధించినట్లు.. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. కబేళాకు సెలవని పేర్కొన్నారు. నగరంలోని అన్ని మాంసం దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించి మాంసం విక్రయించే దుకాణ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుకాణ యజమానులు, ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుతం 13వ సారి ఎన్నికలు జరగబోతున్నాయి. గత రెండు ఎన్నికల్లో భారీ విజయాలను చవిచూసి, హ్యాట్రిక్ సాధించేందుకు టీడీపీ తరఫున గద్దె రామ్మోహన్ బరిలో నిలవగా.. వైసీపీ తరఫున మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాశ్ మొదటిసారిగా తూర్పు బరిలో ప్రత్యర్థిగా తలపడుతున్నారు. సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని అవినాశ్ అంటున్నారు. మరి మీ కామెంట్.
బంటుమిల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వీఆర్ఓ వెంకట వరప్రసాద్(62) మృతి చెందారు. చోరంపూడి వీఆర్ఓగా విధులు నిర్వర్తిస్తున్న ప్రసాద్ శనివారం ఉదయం మచిలీపట్నం నుంచి తన ద్విచక్ర వాహనంపై చోరంపూడి వస్తుండగా కొర్లపాడు వద్ద జాతీయ రహదారిపై వెనుక నుంచి వస్తున్న మారుతి కారు ఢీకొట్టింది. స్థానికులు వెంటనే అతడిని మచిలీపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ.. మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో భాగంగా మూడవ రోజైన శనివారం జిల్లాలో మొత్తం 13 నామినేషన్లు దాఖలయ్యాయి. మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి ఒక నామినేషన్ దాఖలవ్వగా .. గన్నవరం అసెంబ్లీ స్థానానికి 04, మచిలీపట్నంకు 03, పెడనకు 02, పెనమలూరుకు 1, పామర్రుకు 1, గుడివాడకు1 నామినేషన్ దాఖలైనట్టు అధికారులు తెలిపారు. అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.
మండలంలోని నెహ్రూ నగర్లో అభం శుభం తెలియని 8ఏళ్ల బాలికపై ఓ ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మచిలీపట్నం ఈడేపల్లికి చెందిన ఉపాధ్యాయుడు రామానంద సాగర్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆ కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జనసేన పార్టీ ఎకౌంట్లో ఎంత డబ్బు ఉందో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పాలని వైసీపీ నేత పోతిన మహేశ్ అన్నారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంగళగిరిలో పార్టీ ఆఫీస్ కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన చేస్తున్న హరిహర వీరమల్లు సినిమాను నాలుగేళ్ల నుంచి విడుదల చేయకుండా తన బ్లాక్ మనీని వైట్ చేసుకునేందుకు పవన్ వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ఆన్లైన్లో ట్రేడింగ్ చేసి రూ.35 లక్షలు మోసపోయానంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం నమోదు చేశారు. పోరంకికి చెందిన శ్రీకాంత్ ఆన్లైన్ ట్రేడింగ్లో సుమారు రూ.35 లక్షలు పెట్టుబడి పెట్టారు. తనకు డబ్బు అవసరమై విత్ డ్రా చేద్దామని అడగ్గా.. రెండు రోజుల పడుతుందని వారు తెలిపి అతని ఖాతాను బ్లాక్లో పెట్టారన్నాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈనెల 22వ తేదీ జరగాల్సిన ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల నామినేషన్ అనివార్య కారణాల వల్ల 25వ తేదీకి మారిందని గుడివాడ వైసీపీ కార్యాలయం తెలిపింది. యథావిధిగా ఈ నెల 25వ తేదీ గురువారం ఉదయం 9 గంటలకు రాజేంద్రనగర్లోని ఇంటి వద్ద నుంచి ర్యాలీగా ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి వైసీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్ని విజయవంతం చేయాలని పార్టీ నేత లు కోరారు.
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల క్రీడా మైదానంలో ఏప్రిల్ 21న ఆదివారం హంటింగ్ టైగర్స్ ఫుట్బాల్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అండర్ 14 బాలుర ఫుట్బాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శివప్రసాద్ నాయక్ శుక్రవారం తెలిపారు. ఈ పోటీలకు జిల్లాలో ఆసక్తిగలవారు ఎవరైనా జట్టుగా వచ్చి పోటీ చేయవచ్చని అన్నారు. ఈ పోటీలు ఉదయం 6 గంటలకు మొదలవుతాయని అదే రోజు సాయంత్రం విజేతలకు బహుమతులు కూడా అందజేస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.