India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడలో దొంగతనం కేసులో నిందితుడికి నాలుగు నెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి కరిముల్లా తీర్పునిచ్చారు. గుణదలకు చెందిన గోపి 2023లో కరెంటు వైర్లు దొంగిలిస్తుండగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై నేరం రుజువవడంతో గురువారం న్యాయమూర్తి నాలుగు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు సీపీ క్రాంతి రానా టాటా తెలిపారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో నామినేషన్ల ప్రకియ జోరుగా కొనసాగుతుంది. కేవలం ఎన్టీఆర్ జిల్లాలోనే రెండో రోజుల్లో మొత్తం 18 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి మూడు నామినేషన్లు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 15 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి ఢిల్లీరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
కృష్ణా జిల్లా పోలీస్ శాఖలో హోంగార్డ్ విభాగంలో విధులు నిర్వహిస్తూ.. ఆనారోగ్యంతో మహమ్మద్ బాషా (44) శుక్రవారం మృతి చెందాడు. హోంగార్డ్ పట్ల జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ సంతాపం వ్యక్తపరిచారు. బాషా కుటుంబానికి జిల్లా పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని అధైర్య పడవద్దని తెలిపారు. ఏ సహాయం కావాలన్నా ధైర్యంగా వచ్చి అడగవచ్చని అన్నారు.డీఎస్పీ అబ్దుల్ సుభాన్, ఆర్ఐ రవికుమార్, తదితరులు నివాళులర్పించారు.
ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా చెన్నై సెంట్రల్, భువనేశ్వర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మే 6 నుంచి జూన్ 3 వరకు ప్రతి సోమవారం చెన్నై సెంట్రల్, భువనేశ్వర్(నెం.06073), మే 7 నుండి జూన్ 4 వరకు ప్రతి మంగళవారం భువనేశ్వర్, చెన్నై సెంట్రల్(నెం.06074) రైళ్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, రాజమండ్రి, విజయనగరంతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని చెప్పారు.
ప్రజల మధ్య నిలబడటం అంటే పైరసీలు చేసి రాజ్యసభ సభ్యుడైనంత ఈజీ కాదని, విజయవాడ పశ్చిమ NDA కూటమి అభ్యర్థి సుజనా చౌదరిని ఉద్దేశించి వైసీపీ నేత పోతిన మహేశ్ ట్వీట్ చేశారు. బ్యాంకుల నుంచి కొట్టేసిన రూ. వేల కోట్లలో ఎంతో కొంత సుజనా నుంచి తీసుకోవచ్చని.. NDA కూటమి నాయకులు ఆయన చుట్టూ చేరారని పోతిన వ్యాఖ్యానించారు. మాటలు తప్ప మూటలు లేవని కూటమి నాయకులు చెవులు కొరుక్కుంటున్నారని పోతిన ఎక్స్లో పోస్ట్ చేశారు.
అధికారులు గురువారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలుపార్టీల అభ్యర్థులు ప్రజా సమస్యలపై పోరాడిన వారిపై కేసులు, వారి ఆస్తులు, అప్పుల వివరాలు ఇలా ఉన్నాయి. వర్ల కుమార్ రాజాపై 10 కేసులు, అప్పులు రూ.29 లక్షలు. నల్లగట్ల స్వామిదాసుపై కేసులు లేవు, అప్పులు రూ.17.50 లక్షలు. యార్లగడ్డ వెంకట్రావుకు వివిధ అభియోగాల కింద 9 కేసులు, స్థిర, చరాస్తులు రూ.157.850 కోట్లు ఉన్నాయి.
గన్నవరంలో టీడీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు, సిట్టింగ్ MLA వంశీ వల్లభనేని వైసీపీ నుంచి బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో దిగిన యార్లగడ్డ 838 ఓట్ల తేడాతో ఓడారు. వంశీ వైసీపీలో చేరడంతో యార్లగడ్డ టీడీపీలో చేరి గన్నవరం MLA టికెట్ దక్కించుకుని నేడు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. రానున్న ఎన్నికల సమరంలో గన్నవరంలో వంశీ ఆధిక్యత చాటుకుంటారో, యార్లగడ్డ గెలుపు తీరాలకు చేరుకుంటారో మీ కామెంట్.
విజయవాడలో సాధారణ ఎన్నికలు 2024లో భాగంగా పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన ఫారం-1 ఎన్నికల పబ్లిక్ నోటీస్ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఎస్. డిల్లీరావు గురువారం ఉదయం విడుదల చేశారు. అనంతరం కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ.. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా నామినేషన్లు స్వీకరిస్తున్నామని తెలిపారు.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలో జనవరి 2024లో నిర్వహించిన బీ ఫార్మసీ 7వ సెమిస్టర్ పరీక్షలకు (2022- 23 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు, ఏప్రిల్ 23వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల కంట్రోలర్ తెలిపారు. వివరాలకు https://kru.ac.in/ వెబ్సైట్ చూడవచ్చన్నారు.
విజయవాడ నగర పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 133 మందికి న్యాయస్థానం గురువారం జరిమానా విధించింది. ఈ మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో పట్టుబడిన వీరిని న్యాయస్థానంలో హాజరుపరచగా, 133 మందికి రూ.10వేల చొప్పున మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తులు లెనిన్ బాబు, సురేశ్ బాబులు జరిమానా విధించారని పోలీస్ కమీషనరేట్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
Sorry, no posts matched your criteria.