India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడ జనసేన కేంద్ర కార్యాలయంలో వాలంటీర్స్ గౌరవ వేతనం గురించి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు వాలంటీర్ల రాష్ట్ర అధ్యక్షుడు షేక్ హుమాయూన్ భాష ఆదివారం సాయంత్రం వినతి పత్రం ఇచ్చారు. అనంతరం భాష మాట్లాడుతూ.. వాలంటీర్లకి చెల్లించవలసిన బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. జాబ్ చాట్ ను విడుదల చేసి, వెంటనే విధుల్లోకి తీసుకోవాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు.
విజయవాడలో ఎంపాక్స్ అంటూ వస్తున్న వార్తలపై ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ సుహాసిని స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. ఇప్పటివరకు జిల్లాలో ఎవరికి ఎంపాక్స్ లక్షణాలు గుర్తించలేదని ఆమె స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని విజయవాడ ప్రభుత్వ పీడియాట్రిక్స్ హెచ్వోడీ అనిల్ కుమార్ సైతం పేర్కొన్నారు.
TDP సోషల్ మీడియా వారు తనను వేధిస్తున్నారని YCP స్పోక్స్ పర్సన్ సుచిత్ర విజయవాడ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశారు. ఆమె మాట్లాడుతూ.. YCP సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నానని.. TDP సోషల్ మీడియాలో తన ఫొటోలు మార్ఫింగ్ చేసి అసభ్యంగా పోస్టులు పెడుతున్నారన్నారు. TDP సోషల్ మీడియా వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశానని తెలిపారు. అంతేకాకుండా తనను రేప్ చేస్తానని బెదిరింపులకి పాల్పడుతున్నారని ఆరోపించారు.
గంపలగూడెం మండలం అనుములంక గ్రామానికి చెందిన కృష్ణ (62) కిడ్నీ వ్యాధితో బాధపడుతూ.. మృతిచెందాడు. ఆయనకు భార్య ముగ్గురు ఆడపిల్లలు, కాగా మృతుడు గత కొంత కాలంగా డయాలసిస్ చేయించుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల వ్యాధి తీవ్రతరం కావడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాగా చికిత్స పొందుతూ.. శనివారం రాత్రి మృతిచెందాడన్నారు.
రాజధాని అమరావతి నిర్మాణ పనులు డిసెంబరు 1న ప్రారంభమయ్యే అవకాశం ఉందని మంత్రి నారాయణ వెల్లడించారు. కంకిపాడులో శనివారం ఆయన క్రెడాయ్ సౌత్కాన్-2024 సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణానికి రూ.60వేల కోట్లు ఖర్చు కావచ్చని అంచనా అని.. ప్రపంచ స్థాయిలో నంబర్ వన్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దుతామని.. నాలుగేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లాలోని అర్హులైన 30 మంది గిరిజన విద్యార్థులకు డీఎస్సీ ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు కృష్ణా కలెక్టర్ డి.కె బాలాజీ శనివారం పేర్కొన్నారు. B.ed/ టెట్/D.Ed ఉత్తీర్ణులైన ఎస్టీ నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కృష్ణా జిల్లాలోని 25 మండలాల్లో శనివారం 66.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. అత్యధికంగా కోడూరులో 12.4 మీ.మీ, నాగాయలంకలో 10.6, కృత్తివెన్నులో 10.2 మిల్లీమీటర్ల వర్షపాతం.. అత్యల్పంగా గుడ్లవల్లేరులో 0.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. పమిడిముక్కల, తోట్లవల్లూరు మండలాల్లో ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు. జిల్లాలో సగటున 2.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
కృష్ణా జిల్లా మోపిదేవిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో శనివారం మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి వ్యవసాయ పనుల నిమిత్తం మోపిదేవి లంక పొలం వద్దకు వెళ్లాడు. కొద్దిసేపటికే అతడు పొలం గట్టుపై కుప్పకూలడం చూసిన స్థానికులు అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శ్రీనివాసరెడ్డి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఈనెల 26వ తేదీ సోమవారం జరిగే మీకోసం పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ డీ.కే.బాలాజీ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. సోమవారం కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా ప్రభుత్వ సెలవు కారణంగా కార్యక్రమం రద్దు చేసినట్లు తెలిపారు. జిల్లా ప్రజానీకం ఈ విషయం గమనించవలసిందిగా కలెక్టర్ కోరారు.
దంత వైద్య కళాశాలల్లో రెండో విడత కౌన్సెలింగ్ అనంతరం మిగిలిన ఎండీఎస్ కన్వీనర్, యాజమాన్య సీట్ల ప్రవేశానికి ఆప్షన్లు ఎంచుకోవాలని Dr. NTR ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. అర్హులకు ఈ నెల 24 రాత్రి 9 గంటల వరకు అవకాశం ఉందన్నారు. కన్వీనర్ కోటా కింద 51, యాజమాన్య కోటాలో 72 సీట్లను సీట్ మ్యాట్రిక్స్లో పొందుపర్చారని, అభ్యర్థుల జాబితాను యూనివర్సిటీ వెబ్ సైట్లో ఉంచామన్నారు.
Sorry, no posts matched your criteria.