Krishna

News August 22, 2024

కృష్ణా: సెప్టెంబర్ 14న జాతీయ లోక్ ఆదాలత్

image

న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి లోక్ ఆదాలత్‌లు దోహద పడతాయని కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారెక అన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 14వ తేదీన జిల్లాలో జాతీయ లోక్ ఆదాలత్ నిర్వహించనున్నట్టు తెలిపారు. రాజీ పడదగిన క్రిమినల్, సివిల్, రోడ్ యాక్సిడెంట్, చెక్ బౌన్స్ కేసులను లోక్ ఆదాలత్‌లో పరిష్కరిస్తారన్నారు.

News August 22, 2024

కంకిపాడుకు సీఎం చంద్రబాబు రాక

image

ఈ నెల 24న CM చంద్రబాబు కంకిపాడుకు రానున్నారు. స్థానిక అయానా కన్వేన్షన్‌‌లో 2 రోజుల పాటు జరిగే క్రెడాయ్ సమావేశానికి హాజరుకానున్నారు. ఈనెల 25న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఈ సమావేశంలో హాజరుకానున్నారు. అలాగే ఈ నెల 28న ఇక్కడ జరిగే టీడీపీ సీనియర్ నేత గొట్టిపాటి రామకృష్ణ తనయురాలు వివాహ వేడుకకు మరో మారు చంద్రబాబు రానున్నారు.

News August 22, 2024

గ్రామ స‌భ‌ల‌ను విజ‌య‌వంతం చేయాలి: సృజన

image

రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ నెల 23న అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హించే గ్రామస‌భ‌లను విజ‌య‌వంతం చేసేందుకు గ్రామ‌, మండ‌ల‌, ప్ర‌త్యేక అధికారులు సమ‌న్వ‌యంతో కృషిచేయాల‌ని క‌లెక్ట‌ర్ సృజ‌న అధికారుల‌ను ఆదేశించారు. గ్రామ‌స‌భ‌ల నిర్వ‌హ‌ణ‌పై క‌లెక్ట‌ర్ గురువారం ఉదయం క్యాంపు కార్యాలయం నుంచి పంచాయ‌తీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి, డ్వామా, రెవెన్యూ త‌దిత‌ర శాఖల అధికారులతో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.

News August 22, 2024

ప్రాజెక్ట్ భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి: సృజన

image

జిల్లా ప‌రిధిలోని వివిధ ప్రాజెక్టుల‌కు సంబంధించి భూ సేక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేసేందుకు అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ సృజ‌న ఆదేశించారు. గురువారం విజయవాడ క‌లెక్టరేట్‌లో జాతీయ ర‌హ‌దారులు, రైల్వేల‌కు సంబంధించి వివిధ ప్రాజెక్టుల భూ సేక‌ర‌ణ ప్ర‌క్రియ‌పై ఆమె స‌మావేశం నిర్వ‌హించారు. భూ సేక‌ర‌ణ విస్తీర్ణం, అవార్డు పాస్ వివ‌రాలు, ప్ర‌క్రియ ఏ ద‌శ‌లో ఉందనే వివ‌రాల ఆరా తీశారు.

News August 22, 2024

అచ్యుతాపురం ప్రమాదం దిగ్భ్రాంతిని కలిగించింది: మంత్రి కొల్లు

image

అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదం దిగ్భ్రాంతి కలిగించిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇప్పటికే కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేశామన్నారు. కంపెనీ నుంచి బాధితులకు పరిహారం ఇప్పిస్తామని, ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందిస్తామన్నారు. ప్రతి బాధితుడికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

News August 22, 2024

విజయవాడ: పార్ట్ టైం జాబ్ పేరిట భారీ మోసం

image

ఓ యువతి వద్ద రూ.5.53 లక్షలు దోచుకున్న నేరగాళ్లపై విజయవాడ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. రెడ్డిగూడేనికి చెందిన యువతికి గత నెల 9న పార్ట్ టైం జాబ్ ఉందంటూ మెసేజ్ వచ్చింది. అమృత్ అనే వ్యక్తి ఫోన్ చేసి లింక్ పంపించాడు. రిజిస్ట్రేషన్ చేసుకోగానే రూ.500 వచ్చాయి. ఆమె డబ్బులు చెల్లించిన ప్రతిసారీ అదనంగా వచ్చాయి. పలుమార్లు రూ.5.53 లక్షలు పంపింది. ఈ సారి డబ్బులు రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది.

News August 22, 2024

పెడన : ప్రభుత్వ కాలేజీలో ఉద్యోగాలు

image

పెడనలోని బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులు కావాలని కళాశాల ప్రిన్సిపల్ కేసీఎన్ వీఎస్ రామారావు కోరారు. జనరల్ కామర్స్-1, వొకేషనల్ కామర్స్-1 పోస్టుకు అవకాశం ఉందన్నారు. అభ్యర్థులు ఎంకాంలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని, ఈ నెల 23 సాయంత్రం 4గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 24న మచిలీపట్నం లేడీయాంప్తిల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డెమో, ఇంటర్వ్యూ ఉంటుందన్నారు.

News August 22, 2024

పెడన: అంత్యక్రియలను అడ్డుకున్న పోలీసులు

image

ఆత్మహత్య చేసుకున్న మహిళకు అంత్యక్రియలు చేస్తుండగా చివరినిమిషంలో పోలీసులు అడ్డుకున్న ఘటన పెడనలో జరిగింది. ఇన్‌ఛార్జ్ SI గణేశ్ కుమార్ కథనం..తిరుపతమ్మ(29), సురేశ్ దంపతులు. భార్య మంగళవారం రాత్రి ఉరివేసుకుంది. బుధవారం కుటుంబీకులు అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమయ్యారు.ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

News August 22, 2024

VJA: బాలికతో ఉపాధ్యాయుని అసభ్య ప్రవర్తన

image

విజయవాడలో ఓ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేశామని టూటౌన్ సీఐ కొండలరావు తెలిపారు. విజయవాడ కొత్తపేటకు చెందిన బాలిక స్థానిక పాఠశాలలో చదువుతోంది. అదే స్కూల్లో పనిచేస్తున్న హేమంత్ అనే ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడని బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.

News August 22, 2024

రాజధాని, అన్న క్యాంటీన్లకు రూ.2 కోట్ల విరాళం

image

అన్న క్యాంటీన్, అమరావతి రాజధాని నిర్మాణానికి పలువురు విరాళాలు అందించారు. సీఎం చంద్రబాబును బుధవారం సచివాలయంలో కలిసి విరాళాల చెక్కులు అందించారు. విజయవాడకు చెందిన పారిశ్రామిక వేత్త, డీఆర్ఎన్ ఠాగూర్ గ్రూప్ ఛైర్మన్ రవీంద్రనాథ్ ఠాగూర్ అమరావతి రాజధాని, అన్న క్యాంటీన్‌లకు కోటి చొప్పున రూ.2 కోట్లు, కడప జిల్లా, పాయసం పల్లెకు చెందిన ఎన్వీ నారాయణ రెడ్డి రాజధానికి రూ.10,00,116లు విరాళంగా ఇచ్చారు.