India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన షేక్ నాగూర్ వలిని మంగళవారం అరెస్ట్ చేశామని అవనిగడ్డ ఎస్సై రమేశ్ బాబు తెలిపారు. అవనిగడ్డలోని ఓ బ్యాంకులో రుణం చెల్లించేందుకు సోమవారం రూ.50 వేలు తీసుకొచ్చిన వృద్ధురాలు కృష్ణకుమారిని నమ్మించి నగదుతో పరారయ్యాడు. కాగా, నాగూర్ వలి గజదొంగ అని అతనిపై 70 కేసులు ఉన్నాయన్నారు. బ్యాంకులకు వచ్చే వృద్ధులను టార్గెట్ చేసుకొని వారిని నమ్మించి మోసం చేస్తుంటాడని తెలిపారు.
విజయవాడ పశ్చిమ టికెట్ ఆశించి భంగపడి, జనసేనకు రాజీనామా చేసిన పోతిన మహేశ్ మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాట ఇచ్చి మడమ తిప్పని నాయకుడితో కలుస్తానన్నారు. జనసేన అధ్యక్షుడికి సొంత పార్టీపై ప్రేమ లేదని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలను బట్టి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కూటమిలో భాగంగా వెస్ట్ టికెట్ సుజనా చౌదరికి దక్కిన విషయం తెలిసిందే.
ప్రయాణికుల రద్దీ మేరకు మచిలీపట్నం(MTM), తిరుపతి(TPTY) మధ్య స్పెషల్ రైళ్లను నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. నెం.07121 TPTY- MTM మధ్య నడిచే రైలును ఈ నెల 14 నుంచి మే 26 వరకు ప్రతి ఆదివారం, నెం.07122 MTM- TPTY మధ్య నడిచే రైలును ఈ నెల 15 నుంచి మే 27 వరకు ప్రతి సోమవారం నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి జిల్లాలో విజయవాడ, పెడన, గుడివాడ స్టేషన్లలో ఆగుతాయని చెప్పారు.
కృష్ణా వర్సిటీ పరిధిలో డిసెంబర్ 2023లో నిర్వహించిన పీజీ 3వ సెమిస్టర్ పరీక్షలకు(2022- 23) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీవాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఏప్రిల్ 22వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.9,00 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు. వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్సైట్ చూడవచ్చన్నారు.
విజయవాడ భవానిపురం ఖబరస్థాన్ వద్ద రోడ్డు పక్కన సైడ్ కాలవలో మంగళవారం ఉదయం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు భవానిపురం పోలీసులు తెలిపారు. మృతుడు వయసు 40 సంవత్సరాల వరకు ఉంటుందని చెప్పారు. ఈ ఫొటోలోని వ్యక్తి ఆచూకీ తెలిస్తే భవానిపురం పోలీసులకు తెలియజేయాలని సీఐ కృష్ణ కోరారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ చెప్పారు.
ప్రయాణీకుల రద్దీ మేరకు బుధవారం విజయవాడ మీదుగా భువనేశ్వర్- మైసూరు మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ (నెం. 06216)భువనేశ్వర్లో రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరి గురువారం ఉదయం 03.25 నిమిషాలకు విజయవాడ, రాత్రి 7.15కి మైసూరు చేరుకుంటుందన్నారు. ఈ ట్రైన్ ఏపీలో విజయవాడతో పాటు శ్రీకాకుళం, రాజమండ్రి, ఒంగోలు, నెల్లూరు తదితర స్టేషన్లలో ఆగుతుందని చెప్పారు.
సి – విజిల్ యాప్ ద్వారా ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదుల గురించి కలెక్టర్ DK బాలాజీ తాజాగా ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. సి – విజిల్ యాప్లో వచ్చే ఫిర్యాదులను 100 నిముషాల్లో పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఈ మేరకు మచిలీపట్నంలోని డీఈఓ ఆఫీసు ఆవరణలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పరిశీలన కేంద్రంలో విధులలో ఉన్న సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు.
కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తాగునీటి సమస్య ఉన్న పెడన, కత్తివెన్ను, బంటుమిల్లి, మచిలీపట్నం రూరల్, నాగాయలంక, కోడూరు మండలాల్లో తాగునీటి చెరువులు నింపుటకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కాలువల ద్వారా విడుదల చేసిన నీటిని జిల్లాలో అన్ని చెరువులు నింపేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ట్రాఫిక్ మెయిన్టెనెన్స్ కారణంగా చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ వచ్చే జనశతాబ్ది ఎక్స్ప్రెస్ను(నెం.12077) దారి మళ్లించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు మంగళవారాలు మినహా ఈ నెల 10 నుంచి 30 వరకు ఈ ట్రైన్ న్యూ గుంటూరు స్టేషన్ మీదుగా కాక తెనాలి, దుగ్గిరాల, కృష్ణా కెనాల్ స్టేషన్ల మీదుగా విజయవాడ చేరుకుంటుందన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరుతూ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలో కింది కోర్సులకు సంబంధించిన పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఆయా పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలకు వర్సిటీ అధికారిక వెబ్సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని యూనివర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
☞ పోస్ట్ గ్రాడ్యుయేషన్(పీజీ)- 3వ సెమిస్టర్
☞ ఎం- ఫార్మసీ- 2వ సెమిస్టర్
Sorry, no posts matched your criteria.