Krishna

News April 9, 2024

వడదెబ్బ నుంచి రక్షణకు చర్యలు చేపట్టండి: కలెక్టర్

image

ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ప్రజలు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. విజయవాడ నగరంలో ఆయన సోమవారం మాట్లాడుతూ.. రోజురోజుకీ పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా అవసరం లేకుండా రోడ్లపైకి రావద్దన్నారు. బయటకు వచ్చే ముందు తగిన రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. వడదెబ్బ సూచనలు కనిపిస్తే సమీపములోని ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందాలన్నారు.

News April 8, 2024

కృష్ణా: హుబ్లీకి స్పెషల్ ట్రైన్ నడపనున్న రైల్వే

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ నుంచి హుబ్లీకి (ట్రైన్ నెం.07001) ఈ నెల 10న, హుబ్లీ నుంచి విజయవాడకు (ట్రైన్ నెం.07002) ఈ నెల 11న స్పెషల్ ట్రైన్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు ఏపీలో గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్, గిద్దలూరు, నంద్యాల, డోన్, గుంతకల్లు స్టేషన్లలో ఆగుతాయన్నారు. ఈ మేరకు రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

News April 8, 2024

ఎన్టీఆర్: ఈ డ్రైవర్ మృత్యుంజయుడు

image

తోటమూల ఎస్ఆర్ కళ్యాణ మండపం సమీంలో సోమవారం మధ్యాహ్నం ట్రాక్టర్ ఇంజిన్ తిరగబడింది. డ్రైవర్ ట్రాక్టర్ అడుగుభాగాన ఇరుక్కోగా.. సమచారం అందుకున్న పోలీసులు జేసీబీ సాయంతో ట్రాక్టర్‌ను పైకి లేపారు. అయితే ట్రాక్టర్ కింద ఇరుక్కున్న డ్రైవర్‌కు ప్రాణాపాయం తప్పడంతో అందరూ అతన్ని మృత్యుంజయుడన్నారు. ఇతను ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తని. దుక్కుల నిమిత్తం ఎన్టీఆర్ జిల్లాకు వచ్చినట్లు సమాచారం.

News April 8, 2024

కాట్రేనిపాడులో యువకుడిపై దాడి

image

ముసునూరు మండలం కాట్రేనిపాడులో యువకుడిపై దాడి చేశారు. ఆ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక ముసునూరు గ్రామానికి చెందిన రత్నకుమార్(21) మూడు ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గత రాత్రి తన కుమార్తె నువ్వు లేకపోతే చనిపోతానని అంటోందని రత్నకుమార్‌ను పిలిపించారు. బాలిక, ఇంటికి వచ్చిన యువకుడిపై బాలిక కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారని రత్న కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఏఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు.  

News April 8, 2024

జనసేనకు పోతిన మహేశ్ రాజీనామా.. కాసేపట్లో ప్రెస్ మీట్

image

జనసేనకు రాజీనామా చేసిన పోతిన మహేశ్ తన తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నారు. పార్టీలోని పదవి బాధ్యతలు, క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడనున్నారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. పోతిన మహేశ్ ఏ నిర్ణయం తీసుకుంటారో, అది వెస్ట్‌లో కూటమిపై ఎలాంటి ప్రభావం చూపనుందో అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

News April 8, 2024

జనసేనకు పోతిన మహేశ్ రాజీనామా

image

జనసేనకు ఆ పార్టీ నేత పోతిన మహేశ్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత పవన్‌కు లేఖ రాశారు. జనసేన పార్టీలో తనకున్న పదవి బాధ్యతలు, క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు తనకు సహకరించిన జనసేన పార్టీ నాయకులకు, వీరమహిళలకు, జన సైనికులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పోతిన మహేశ్ విజయవాడ వెస్ట్ సీటు ఆశించగా, ఆ టికెట్ సుజనా చౌదరికి దక్కిన విషయం తెలిసిందే.

News April 8, 2024

జగ్గయ్యపేట: మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తల్లి మృతి

image

జగ్గయ్యపేట టీడీపీలో విషాదం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తల్లి  సోమవారం ఉదయం మాతృమూర్తి సక్కుబాయి (90) మృతి చెందారు. విషయం తెలుసుకున్న టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అక్కడకు చేరుకుని ఆమె మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె మృతితో జగ్గయ్యపేట టీడీపీ శ్రేణులలో తీవ్ర విషాదం నెలకొంది.  

News April 8, 2024

విజయవాడ: ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

image

రామరాజ్యనగర్ సమీపంలోని రైల్వే ట్రాక్‌ల మధ్య ఉన్న చెట్టుకు ఒ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడి మృతదేహాన్ని పరిశీలించారు. జన సంచారం లేని ప్రాంతంలో సుమారు రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు చేప్పారు. ఈ ఘటన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 8, 2024

వ‌డ‌దెబ్బ బారిన‌ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు పాటించాలి: డిల్లీరావు

image

వేస‌విలో పెరుగుతున్న ఉష్ణోగ్ర‌త‌ల నేప‌థ్యంలో వ‌డదెబ్బ బారిన పడకుండా ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు ఆదివారం ఓ ప్ర‌క‌ట‌న‌లో సూచించారు. ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు క్ర‌మంగా పెరుగుతున్నందున ప్ర‌జ‌లు త‌ప్ప‌నిస‌రిగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. ఎండ తీవ్ర‌త‌కు గురికాకుండా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. చ‌లివేంద్రాలు స‌జావుగా ప‌నిచేసేలా చూడాల‌ని చెప్పారు.

News April 7, 2024

NTR: ప్రయాణికుల రద్దీ మేరకు అన్‌రిజర్వడ్ స్పెషల్ రైలు

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా చెన్నై ఎగ్మూరు నుంచి సత్రాగచ్చి(పశ్చిమ బెంగాల్)కు అన్‌రిజర్వడ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నెం.06077 ట్రైన్‌ను ఈ నెల 13, 20, 27 తేదీలలో చెన్నై ఎగ్మూరు, సత్రాగచ్చి మధ్య నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్ తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.