India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇబ్రహీంపట్నంలో 2016 జూలై 10న జరిగిన హత్య కేసులో ముద్దాయి ప్రకాశ్ సింగ్ (50)కు 13వ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి శేషయ్య బుధవారం జీవిత ఖైదు విధించారు. సదరు ప్రకాశ్ సింగ్, తన స్నేహితుడు నరేశ్ను మద్యం కోసం డబ్బులడగగా, నిరాకరించడంతో రాయితో కొట్టి చంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందని కోర్టు తమ తీర్పులో వెల్లడించింది. సదరు ముద్దాయికి జీవిత ఖైదుతో పాటు రూ.1000 జరిమానా విధించినట్లు చెప్పారు.
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో వృద్ధ దంపతులు మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. గురువారం ఘంటసాల మండలం లంకపల్లి వద్ధ ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చల్లపల్లి మండలం మాజేరు శివారు పచ్చార్లంకకు చెందిన దాసరి నాగేశ్వరరావు- సరోజినీ దంపతులు ద్విచక్ర వాహనంపై తెల్లవారు జామున లంకపల్లి వస్తుండగా లారీని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు.
ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ గురువారం కింద పేర్కొన్న మండలాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఆయా ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు(డిగ్రీల సెంటీగ్రేడ్లలో) నమోదవుతాయని స్పష్టం చేస్తూ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.
☞ వత్సవాయి 42
☞ జీ.కొండూరు 41.1
☞ ఏ.కొండూరు 40.9
☞ ఇబ్రహీంపట్నం 41.4
☞ కంచికచర్ల 42
☞ నందిగామ 42.2
☞ తిరువూరు 41
☞ విజయవాడ అర్బన్ 41
☞ విజయవాడ రూరల్ 41
☞ వీరుళ్ళపాడు 41.7
వేసవి దృష్ట్యా ఎన్టీఆర్ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల సమయాలను మారుస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు తెలిపారు. విజయవాడలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 4వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తాయన్నారు. తాగునీరు ఓఆర్ఎస్ ప్యాకెట్లు కేంద్రాలలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. డిహైడ్రేషన్ కాకుండా జాగ్రత్త వహించాలని చెప్పారు.
విజయవాడ నగరంలోని కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో రాజకీయ పార్టీలకు చెందిన నాయకులతో జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. వివిధ రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే సభలు, సమావేశాలు, ర్యాలీలు, వినియోగించే వాహనాలు, లౌడ్ స్పీకర్లకు సంబంధించి ముందుగానే అనుమతులు పొందాలన్నారు. అనుమతి పొందని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
2019 ఎన్నికల్లో జనసేనతో పొత్తులో భాగంగా విజయవాడ సెంట్రల్లో పోటీ చేసిన సీపీఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు 29,333 ఓట్లు(16.48%) సాధించారు. 2019లో టీడీపీ అభ్యర్థి బొండా ఉమ 25 ఓట్ల తేడాతో విష్ణు చేతిలో ఓడిపోయారు. పొత్తులో భాగంగా NDA నుంచి మళ్లీ ఉమను బరిలో దింపారు. కాంగ్రెస్తో జతకట్టిన సీపీఎం బాబురావుకు మరలా టికెట్ ఇచ్చే ఛాన్సుంది. దీంతో ఈసారి కూడా బాబురావుకు వచ్చే ఓట్లు కీలకం కానున్నాయి.
ప్రయాణికుల సౌలభ్యం మేరకు విజయవాడ మీదుగా నడిచే హిసార్ (HSR), తిరుపతి (TPTY) మధ్య నడిచే స్పెషల్ రైళ్లను పొడిగించామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నెం.09715 HSR- TPTY మధ్య నడిచే రైలును ఈ నెల 6 నుంచి మే 25 వరకు ప్రతి శనివారం, నెం.09716 TPTY- HSR మధ్య నడిచే రైలును ఈ నెల 9 నుంచి మే 28 వరకు ప్రతి మంగళవారం నడుపుతామంది. కాగా ఈ రైళ్లు విజయవాడ, ఉజ్జయినితో పాటు మార్గమధ్యంలోని పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి.
యువతిపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై మంగళవారం సాయంత్రం పోలీసులు కేసు నమోదు చేశారు. పెడన పట్టణంలోని ఏడవ వార్డుకు చెందిన ఎండీ హర్షిత్ యువతిపై (20) పై లైంగిక దాడి చేశాడని బాధితురాలి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. ఎస్సై సూర్య శ్రీనివాస్ కేసు నమోదు చేశారు. బందర్ డీఎస్పీ అబ్దుల్ సుభాని విచారణ చేపట్టారు.
తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా లాం. తాంతియా కుమారిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రాష్ట్ర మాజీమంత్రి కోనేరు రంగారావు కుమార్తెగా తాంతియా కుమారి ప్రజలకు సుపరిచితులు. సోషియాలజీలో పీజీ చేసిన ఈమె 2014లో రాష్ట్ర సమాచార కమిషనర్గా, 2023లో ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. తన తండ్రి ఆశయ సాధన కోసం తిరువూరు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
కృష్ణా వర్సిటీ పరిధిలో పీహెచ్డీ/ఎం.ఫిల్ పార్ట్-1 విద్యార్థులు రాయాల్సిన థియరీ పరీక్షల (రెగ్యులర్ & సప్లిమెంటరీ) టైం టేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 25, 26, 27 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకు విద్యార్థులు KRU అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
Sorry, no posts matched your criteria.