Krishna

News April 3, 2024

కృష్ణా: పీహెచ్‌డీ/ఎం.ఫిల్ విద్యార్థులకు ముఖ్య గమనిక

image

కృష్ణా వర్సిటీ పరిధిలో పీహెచ్‌డీ/ఎం.ఫిల్ పార్ట్-1 విద్యార్థులు రాయాల్సిన థియరీ పరీక్షల (రెగ్యులర్ & సప్లిమెంటరీ) టైం టేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 25, 26, 27 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకు విద్యార్థులు KRU అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.

News April 2, 2024

ఎన్టీఆర్: పన్ను చెల్లింపుదారులకు పోలీసుల హెచ్చరికలు

image

ఆదాయ పన్ను చెల్లించేవారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు సందేశాలు, లింకులు పంపుతున్నారని ఎన్టీఆర్ జిల్లా సీపీ TK రాణా కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆదాయ పన్ను రిఫండ్ కోసమంటూ వారు పంపే లింక్స్ క్లిక్ చేయొద్దని, అపరిచిత వ్యక్తులకు బ్యాంకు ఖాతాల వివరాలు చెప్పవద్దని TK రాణా సూచించారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల బారిన పడవద్దని ఆయన జిల్లా ప్రజానీకాన్ని హెచ్చరించారు.

News April 2, 2024

కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు బదిలీ

image

కృష్ణా జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి, కలెక్టర్ రాజాబాబును కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ప్రతిపక్ష పార్టీల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు రాష్ట్రంలో ఆరుగురు ఐపీఎస్, ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేయగా వారిలో కలెక్టర్ రాజాబాబు ఉన్నారు. 2023 ఏప్రిల్ 15న కలెక్టర్‌గా రాజాబాబు బాధ్యతలు స్వీకరించారు. ఈయన అధికార పార్టీ నేతలకు అనుకూలంగా పని చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

News April 2, 2024

కృష్ణా : ఆ స్థానాలకు ఖరారు కాని కాంగ్రెస్ అభ్యర్థులు

image

ఉమ్మడి కృష్ణాజిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 16 MLA స్థానాలకు గాను 11 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. విజయవాడ పశ్చిమ, సెంట్రల్, తూర్పు, గన్నవరం, జగ్గయ్యపేట నియోజకవర్గాలతో పాటు మచిలీపట్నం, విజయవాడ పార్లమెంట్ స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. త్వరలోనే ఈ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

News April 2, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాలో కాంగ్రెస్ MLA అభ్యర్థులు వీరే..

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో 11 మంది MLA అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది.
* తిరువూరు (SC) – లాం తాంతియా కుమారి
* నూజివీడు – కృష్ణా మరిడు
* గుడివాడ – వడ్డాడి గోవిందరావు
* కైకలూరు – బొడ్డు నోబుల్
* పెడన శొంఠి నాగరాజు
* మచిలీపట్నం – అబ్దుల్ మతీన్
* అవనిగడ్డ – అందే శ్రీరామ్మూర్తి
* పామర్రు (SC) – డీవై దాస్
* పెనమలూరు – ఎలిసల సుబ్రహ్మణ్యం
* మైలవరం – బొర్రా కిరణ్
* నందిగామ (SC) – మందా వజ్రయ్య

News April 2, 2024

కృష్ణా జిల్లాలో ఈనెల 7న చంద్రబాబు పర్యటన

image

టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఈనెల 7వ తేదీన కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నిక ప్రచారంలో భాగంగా ప్రజాగళం సభను నిర్వహించబోతున్నారు. అయితే సత్తెనపల్లి నుంచి పామర్రులోకి ప్రవేశించి.. ఉయ్యూరు సెంటర్‌లో ప్రజాగళం భారీ బహిరంగ సభను చంద్రబాబు నిర్వహించనున్నారు. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు సభను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేపడుతున్నారు.

News April 2, 2024

పెడన వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

పెడన-మచిలీపట్నం బైపాస్ రోడ్డులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. తోటమూల సెంటర్ నుంచి బైపాస్ రోడ్డులో AP39 TU 3126 నెంబర్ గల TVSపై మచిలీపట్నం వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News April 2, 2024

విజయవాడ: ప్రేమ పేరుతో యువతిపై అత్యాచారం

image

యువతిని ప్రేమ పేరుతో వంచించి ఆపై బెదిరించి అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై నున్న రూరల్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. సుందరయ్య నగర్‌కు చెందిన యువతికి మునీంద్రా రెడ్డితో పరిచయం ఉంది. ప్రేమ పేరుతో అత్యాచారానికి పాల్పడ్డాడు. వారిద్దరూ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అరెస్ట్ చేశారు.

News April 2, 2024

కృష్ణా: లా కోర్సు విద్యార్థులకు ముఖ్య గమనిక

image

కృష్ణా వర్సిటీ పరిధిలోని ‘మాస్టర్ ఆఫ్ లాస్’ కోర్సు(LLM) విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ (2022 రెగ్యులేషన్) థియరీ పరీక్షల టైంటేబుల్‌ విడుదలైంది. ఏప్రిల్ 15, 16, 18, 19 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు KRU అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.

News April 2, 2024

అమెరికాలో పెనుగంచిప్రోలు మహిళ మృతి

image

అమెరికాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెనుగంచిప్రోలు మండలం కొణకంచికి చెందిన గీతాంజలి(32) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కారులో ప్రయాణిస్తుండగా జరిగిన ప్రమాదంలో గీతాంజలి కుమార్తె హానిక అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన గీతాంజలిని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. ఈ ప్రమాదంలో తల్లీ, కుమార్తెల మృతితో కొణకంచిలో విషాదం అలముకుంది.