India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కైకలూరు, గుడివాడ, రాయనపాడు మీదుగా ప్రయాణించే కోకనాడ ఎక్స్ప్రెస్లకు అదనంగా 2 జనరల్ కోచ్లు జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.12775/12776 రైళ్లు ప్రస్తుతం 2 జనరల్ కోచ్లతో నడుస్తుండగా 2 బోగీలు జతచేసి మొత్తంగా 4 జనరల్ కోచ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 12775 ట్రైన్ను నవంబర్ 12 నుంచి, 12776 ట్రైన్ను నవంబర్ 13 నుంచి 2 అదనపు జనరల్ కోచ్లతో నడుపుతామన్నారు.
ఎన్టీఆర్: జగన్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు భూముల రీసర్వే ముసుగులో లక్షలాది ఎకరాలు కొట్టేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్వీట్ చేశారు. వైసీపీ నేతల భూదందాలపై టీడీపీ కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. బాధితులకు న్యాయం చేసేలా ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
జగన్ రెడ్డి పదవి లేకుండా పట్టుమని పది రోజులు కూడా ఉండలేకపోతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న శనివారం ట్విటర్ వేదికగా విమర్శించారు. ‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు కూడా పూర్తి కాకుండానే పింఛన్ల హామీని నెరవేర్చామన్నారు. జగన్ అయిదేళ్లలో చేస్తానని చెప్పింది కూటమి ప్రభుత్వంలో అయిదు రోజుల్లో చేసి చూపించామన్నారు.
ATMలో డ్రా చేసిన నగదు కంటే ఎక్కువ వచ్చి కలకలం సృష్టించింది. తిరువూరు రాజుపేటలోని SBI ATMలో అధికారులు నగదు పొందు పరిచారు. శనివారం ఉదయం ఓ ఖాతాదారుడు రూ.8 వేలు డ్రా చేయగా ATM నుంచి రూ.9,500 వచ్చాయి. మరొకరికి రూ.5 వేలకు గాను రూ.7 వేలు రావడంతో విషయం అందరికీ తెలిసింది. దీంతో ఆ ATM వద్దకు జనాలు బారులు తీరారు. సాంకేతిక లోపంతో ఇది జరిగిందని, ATM మూసేశారు. మరోవైపు డ్రా చేసిన వారి వివరాలు సేకరిస్తున్నారు.
విజయవాడ మీదుగా ప్రయాణించే కాకినాడ పోర్ట్- ముంబై LTT ఎక్స్ప్రెస్లకు 2 జనరల్ కోచ్లు జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.17221/17222 సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లకు 2 అదనపు జనరల్ కోచ్లు జత చేస్తున్నామన్నారు. నం.17221 రైలును నవంబర్ 16 నుంచి, నం.17222 రైలును నవంబర్ 17 నుంచి 2 అదనపు జనరల్ కోచ్తో నడుపుతామన్నారు.
ది కృష్ణా మిల్క్ యూనియన్లో ముగ్గురు డైరెక్టర్ల ఎన్నికకు శుక్రవారం నామినేషన్లు స్వీకరించగా ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. విజయవాడ కృష్ణా మిల్క్ యూనియన్ కార్యాలయంలో ఈ ప్రక్రియ ప్రారంభించామని, గతంలో ఎన్నడు లేని విధంగా 3 డైరెక్టర్ల పదవికి నామినేషన్లు రాలేదని ఎన్నికల అధికారి ప్రకటించారు. దీంతో ఎన్నిక ప్రక్రియ ముగిసిందని ఆ అధికారి ప్రకటించడంతో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందోనని ఆసక్తి నెలకొంది.
జిల్లాలో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల అభివృద్ధి చేయడాని అవసరమైన స్థలాలను గుర్తించాలని కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మచిలీపట్నం కలెక్టరేట్ హాల్లో కలెక్టర్, జేసీ గీతాంజలి శర్మతో కలిసి రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించి భూముల లభ్యతను సమీక్షించారు. ఈ ప్రాజెక్టు సీఎం నేరుగా చూస్తున్న అత్యంత ప్రాధాన్యత కార్యక్రమమని కలెక్టర్ తెలిపారు.
* కృష్ణా నదికి వరద ఎఫెక్ట్.. భవానీ ద్వీపం మూసివేత
* విజయవాడలో విషాదం.. మామ అల్లుడు మృతి
* విజయవాడపై ఎందుకు నీకంత పగ చంద్రబాబు?:YCP
* కృష్ణా: కడలికి ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ
* కృష్ణా: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి
* విజయవాడలో మహేశ్ బాబు ఫ్యాన్స్ సందడి
* కంకిపాడు: కరకట్టపై రోడ్డు ప్రమాదం
విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న టీవీఎస్ మోపెడ్ను వేగంగా వచ్చిన ఓ పల్సర్ బైక్ ఢీకొట్టింది. పల్సర్ బైక్పై వెనుక కూర్చున్న యువతికి ఫ్లై ఓవర్ గోడ తగలడంతో తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండంగా మార్గమధ్యంలో హారికదేవి(20) మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. యువతి స్వగృహం గుడ్లవల్లేరు మండలం కూరాడ గ్రామంగా గుర్తించారు.
నామినేటెడ్ పదవుల భర్తీకై సీఎం చంద్రబాబు సన్నాహాలు ప్రారంభించిన నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆశావహులు పదవుల కోసం క్యూ కడుతున్నారు. పలు కార్పొరేషన్ పదవులను భర్తీ చేయనున్నట్లు ఇటీవల ఊహాగానాలు వచ్చినందున ఆ పదవులు దక్కించుకునేందుకు అనేకమంది ప్రయత్నిస్తున్నారు. జిల్లాలోని 16 ఎమ్మెల్యేలు, 2ఎంపీ స్థానాలు టీడీపీ కూటమి దక్కించుకున్నందున నామినేటెడ్, ఇతర పదవుల ఆశావహుల సంఖ్య భారీగా ఉంది.
Sorry, no posts matched your criteria.