Krishna

News August 12, 2024

తమిళనాడులో ఘోర ప్రమాదం.. విజయవాడ విద్యార్థి మృతి

image

తమిళనాడులోని తిరువళ్లూర్‌ జిల్లా తిరుత్తణి సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో APలోని పలు జిల్లాలకు చెందిన ఐదుగురు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతి చెందినవారిలో విజయవాడకు చెందిన బన్ను నితిశ్(22) మృతిచెందాడు. మరో నలుగురు ప్రొద్దుటూరుకు చెందిన నితిశ్(21), తిరుపతికి చెందిన యుగేశ్(23), చేతన్(22), కర్నూలుకు చెందిన రామ్మోహన్(21)లకు గాయాలయ్యాయి.

News August 12, 2024

కృష్ణా: చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కు అదనపు జనరల్ కోచ్‌లు

image

విజయవాడ మీదుగా ప్రయాణించే హైదరాబాద్-చెన్నై చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లకు అదనంగా 2 జనరల్ కోచ్‌‌లు జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.12759/12760 రైళ్లు ప్రస్తుతం 2 జనరల్ కోచ్‌లతో నడుస్తుండగా 2 బోగీలు జతచేసి మొత్తంగా 4 జనరల్ కోచ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 12760 ట్రైన్‌ను నవంబర్ 11 నుంచి, 12759 ట్రైన్‌ను నవంబర్ 12 నుంచి 2 అదనపు జనరల్ కోచ్‌లతో నడుపుతామన్నారు.

News August 11, 2024

కృష్ణా జిల్లా ప్రజలకు పోలీసుల హెచ్చరికలు

image

కొరియర్ పేరిట మోసగాళ్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌పై స్పందించవద్దని కృష్ణా జిల్లా ప్రజలకు పోలీసులు హెచ్చరించారు. మీ పేరుపై పార్సిల్ వచ్చిందని, పార్సిల్ పేరుతో సైబర్ నేరగాళ్లు బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేస్తున్న ఘటనలు జరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని పోలీస్ యంత్రాంగం సూచించింది. ఈ విధమైన ఫోన్ కాల్స్ ప్రభావానికి గురి కావొద్దని, సైబర్ మోసానికి గురైతే వెంటనే హెల్ప్ లైన్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.

News August 11, 2024

మచిలీపట్నం కలెక్టరేట్‌లో రేపు మీ కోసం కార్యక్రమం: డీకే బాలాజీ

image

ఈ నెల 12వ తేదీ సోమవారం కలెక్టరేట్‌లో ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని కలెక్టర్ వెల్లడించారు.

News August 11, 2024

విజయవాడలో మహిళపై అత్యాచారం.. నిందితుల అరెస్ట్

image

మహిళపై అత్యాచారం కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు మాచవరం పోలీసులు తెలిపారు. సీఐ ప్రకాశ్ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారి అనే ఓ మహిళ మ్యాట్రిమోనీ సైట్‌లో వివాహ సంబంధాలు వెతుకుతున్న నేపథ్యంలో బాషా పరిచయమయ్యాడు. ఈ క్రమంలో బాషా అతని స్నేహితుడు కలిసి అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ ఆదివారం వెల్లడించారు.

News August 11, 2024

కృష్ణా: MBA/MCA పరీక్షల టైంటేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో MBA/MCA కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఆగస్టు 17 నుంచి 24 మధ్య ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా పరీక్షల టైం టేబుల్ వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.

News August 11, 2024

కృష్ణా: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే

image

కైకలూరు, గుడివాడ, రాయనపాడు మీదుగా ప్రయాణించే కోకనాడ ఎక్స్‌ప్రెస్‌లకు అదనంగా 2 జనరల్ కోచ్‌‌లు జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.12775/12776 రైళ్లు ప్రస్తుతం 2 జనరల్ కోచ్‌లతో నడుస్తుండగా 2 బోగీలు జతచేసి మొత్తంగా 4 జనరల్ కోచ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 12775 ట్రైన్‌ను నవంబర్ 12 నుంచి, 12776 ట్రైన్‌ను నవంబర్ 13 నుంచి 2 అదనపు జనరల్ కోచ్‌లతో నడుపుతామన్నారు.

News August 11, 2024

రీసర్వే ముసుగులో లక్షల ఎకరాలు కొట్టేశారు: ఉమ

image

ఎన్టీఆర్: జగన్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు భూముల రీసర్వే ముసుగులో లక్షలాది ఎకరాలు కొట్టేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్వీట్ చేశారు. వైసీపీ నేతల భూదందాలపై టీడీపీ కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. బాధితులకు న్యాయం చేసేలా ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

News August 11, 2024

జగన్ రెడ్డి పదవి లేకుండా ఉండలేకపోతున్నారు: బుద్దా వెంకన్న

image

జగన్ రెడ్డి పదవి లేకుండా పట్టుమని పది రోజులు కూడా ఉండలేకపోతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న శనివారం ట్విటర్ వేదికగా విమర్శించారు. ‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు కూడా పూర్తి కాకుండానే పింఛన్ల హామీని నెరవేర్చామన్నారు. జగన్ అయిదేళ్లలో చేస్తానని చెప్పింది కూటమి ప్రభుత్వంలో అయిదు రోజుల్లో చేసి చూపించామన్నారు.

News August 11, 2024

NTR: ATMలో రూ.8 వేలు డ్రా చేస్తే రూ.9,500 వచ్చాయ్

image

ATMలో డ్రా చేసిన నగదు కంటే ఎక్కువ వచ్చి కలకలం సృష్టించింది. తిరువూరు రాజుపేటలోని SBI ATMలో అధికారులు నగదు పొందు పరిచారు. శనివారం ఉదయం ఓ ఖాతాదారుడు రూ.8 వేలు డ్రా చేయగా ATM నుంచి రూ.9,500 వచ్చాయి. మరొకరికి రూ.5 వేలకు గాను రూ.7 వేలు రావడంతో విషయం అందరికీ తెలిసింది. దీంతో ఆ ATM వద్దకు జనాలు బారులు తీరారు. సాంకేతిక లోపంతో ఇది జరిగిందని, ATM మూసేశారు. మరోవైపు డ్రా చేసిన వారి వివరాలు సేకరిస్తున్నారు.