Krishna

News August 10, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు శుభవార్త

image

విజయవాడ మీదుగా ప్రయాణించే కాకినాడ పోర్ట్- ముంబై LTT ఎక్స్‌ప్రెస్‌లకు 2 జనరల్ కోచ్‌‌‌లు జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.17221/17222 సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లకు 2 అదనపు జనరల్ కోచ్‌లు జత చేస్తున్నామన్నారు. నం.17221 రైలును నవంబర్ 16 నుంచి, నం.17222 రైలును నవంబర్ 17 నుంచి 2 అదనపు జనరల్ కోచ్‌తో నడుపుతామన్నారు.

News August 10, 2024

కృష్ణా: ఆ ఎన్నికకు ఒక్క నామినేషన్ రాలేదు

image

ది కృష్ణా మిల్క్ యూనియన్‌లో ముగ్గురు డైరెక్టర్ల ఎన్నికకు శుక్రవారం నామినేషన్లు స్వీకరించగా ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. విజయవాడ కృష్ణా మిల్క్ యూనియన్ కార్యాలయంలో ఈ ప్రక్రియ ప్రారంభించామని, గతంలో ఎన్నడు లేని విధంగా 3 డైరెక్టర్ల పదవికి నామినేషన్లు రాలేదని ఎన్నికల అధికారి ప్రకటించారు. దీంతో ఎన్నిక ప్రక్రియ ముగిసిందని ఆ అధికారి ప్రకటించడంతో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందోనని ఆసక్తి నెలకొంది.

News August 10, 2024

పార్క్‌ల అభివృద్ధికి స్థలాలు గుర్తించాలి: కలెక్టర్ బాలాజీ

image

జిల్లాలో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల అభివృద్ధి చేయడాని అవసరమైన స్థలాలను గుర్తించాలని కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మచిలీపట్నం కలెక్టరేట్ హాల్లో కలెక్టర్, జేసీ గీతాంజలి శర్మతో కలిసి రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించి భూముల లభ్యతను సమీక్షించారు. ఈ ప్రాజెక్టు సీఎం నేరుగా చూస్తున్న అత్యంత ప్రాధాన్యత కార్యక్రమమని కలెక్టర్ తెలిపారు.

News August 9, 2024

కృష్ణా: TODAY TOP NEWS

image

* కృష్ణా నదికి వరద ఎఫెక్ట్.. భవానీ ద్వీపం మూసివేత
* విజయవాడలో విషాదం.. మామ అల్లుడు మృతి
* విజయవాడపై ఎందుకు నీకంత పగ చంద్రబాబు?:YCP
* కృష్ణా: కడలికి ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ
* కృష్ణా: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి
* విజయవాడలో మహేశ్ బాబు ఫ్యాన్స్ సందడి
* కంకిపాడు: కరకట్టపై రోడ్డు ప్రమాదం

News August 9, 2024

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

image

విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న టీవీఎస్ మోపెడ్‌ను వేగంగా వచ్చిన ఓ పల్సర్ బైక్ ఢీకొట్టింది. పల్సర్ బైక్‌పై వెనుక కూర్చున్న యువతికి ఫ్లై ఓవర్ గోడ తగలడంతో తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండంగా మార్గమధ్యంలో హారికదేవి(20) మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. యువతి స్వగృహం గుడ్లవల్లేరు మండలం కూరాడ గ్రామంగా గుర్తించారు. 

News August 9, 2024

కృష్ణా: పదవుల పందేరంలో ఎవరు విజేతలయ్యేనో

image

నామినేటెడ్ పదవుల భర్తీకై సీఎం చంద్రబాబు సన్నాహాలు ప్రారంభించిన నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆశావహులు పదవుల కోసం క్యూ కడుతున్నారు. పలు కార్పొరేషన్ పదవులను భర్తీ చేయనున్నట్లు ఇటీవల ఊహాగానాలు వచ్చినందున ఆ పదవులు దక్కించుకునేందుకు అనేకమంది ప్రయత్నిస్తున్నారు. జిల్లాలోని 16 ఎమ్మెల్యేలు, 2ఎంపీ స్థానాలు టీడీపీ కూటమి దక్కించుకున్నందున నామినేటెడ్, ఇతర పదవుల ఆశావహుల సంఖ్య భారీగా ఉంది.

News August 9, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

విజయవాడ మీదుగా గుంటూరు-సికింద్రాబాద్(నం.12706&12705) మధ్య ప్రయాణించే ఇంటర్‌ సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లకు నెక్కొండ స్టేషన్‌లో స్టాప్ ఇచ్చామని రైల్వే అధికారులు తెలిపారు. గతంలో ప్రయోగాత్మకంగా ఈ స్టేషన్‌లో ఇచ్చిన స్టాప్‌ను కొనసాగిస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు ఈ అంశాన్ని గమనించాలని కోరుతూ దక్షిణ మధ్య రైల్వే వర్గాలు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశాయి.

News August 9, 2024

కృష్ణా: పీజీ పరీక్షల టైంటేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్శిటీ పరిధిలో పీజీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ (రెగ్యులర్&సప్లిమెంటరీ) పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఆగస్టు 17 నుంచి 24 మధ్య ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా పరీక్షల టైం టేబుల్ వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.

News August 9, 2024

ఆగష్టు 15న అన్న క్యాంటీన్లు ప్రారంభం: కలెక్టర్ సృజన

image

ఆగష్టు 15వ తేదీ నుంచి నిరుపేదలకు తక్కువ ధరకే భోజనాన్ని అందించే అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్ సృజన అధికారులను ఆదేశించారు. విజయవాడలో అన్న క్యాంటీన్లను శుక్రవారం కలెక్టర్ సృజన, నగరపాలక సంస్థ కమీషనర్ ధ్యానచంద్ర, ఆర్డీవో భవానీ శంకరీలతో కలిసి కలెక్టర్ స్వయంగా పర్యటించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

News August 9, 2024

పంచాయతీలకు నిధులు పెంపు: డిప్యూటీ సీఎం పవన్

image

ఆగష్టు 15న వేడుకల నిర్వహణ కోసం పంచాయతీలకు నిధులు పెంచుతున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ ప్రకటించారు. మైనర్ పంచాయతీలకు రూ.100 నుంచి రూ.10వేలు, మేజర్ పంచాయతీలకు రూ.250 నుంచి రూ.25వేలకు పెంచామన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇదే విధంగా నిధులు ఇస్తామన్నారు. స్కూళ్లలో ఫ్రీడమ్ ఫైటర్లను సత్కరించాలని, విద్యార్థులకు క్రీడలతో పాటు క్విజ్ తదితర పోటీలు నిర్వహించాలన్నారు.