Krishna

News April 1, 2024

హోంగార్డ్‌తో సహజీవనం.. మందలించాడని దాడి

image

వివాహేతర సంబంధం విషయమై హోంగార్డ్‌పై దాడి చేసిన యువకుడు, మహిళపై అజిత్‌సింగ్‌నగర్‌లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల మేరకు.. న్యూరాజేశ్వరిపేటకు చెందిన రవికుమార్(46)విజయవాడలో హోంగార్డ్‌. భార్యతో విభేదాల కారణంగా విడిగా ఉంటూ.. 18ఏళ్లుగా మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. కాగా సదరు మహిళ మరో యువకుడితో తిరగడం చూసిన రవి మందలించాడు. దీంతో ఆ మహిళ, యువకుడు రవిపై దాడి చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 1, 2024

మండవల్లి: భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య

image

మండవల్లి మండలంలో భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల మేరకు ఈ నెల 26న భార్యా భర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపం చెంది, రాత్రి కూల్ డ్రింక్‌లో ఎలుకుల మందు కలుపుకొని ఆత్మహత్యకు యత్నించిందన్నారు. విజయవాడలో చికిత్స పొందుతూ.. మహిళ మృతిచెందినట్లు SI రామచంద్రరావు తెలిపారు.

News April 1, 2024

USలో ఎన్టీఆర్ జిల్లా బాలిక మృతి

image

అమెరికాలోని పోర్టులాండ్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ బాలిక మృత్యువాత పడింది. పెనుగ్రంచిపోలు మండలం కొణకంచికి చెందిన నరేశ్, గీంతాంజలి దంపతులు జాబ్ నిమిత్తం 10ఏళ్లుగా USలో ఉంటున్నారు. ఈ క్రమంలో కారు ప్రమాదానికి గురై వారి కుమార్తె హానిక(6)మృతిచెందింది. తల్లి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కొణకంచిలో విషాధాన్ని నింపింది.

News April 1, 2024

విజయవాడ: నేటినుంచి మొదలు కానున్న దరఖాస్తు ప్రక్రియ

image

విజయవాడ మధురా నగర్‌లో ఉన్న కేంద్రీయ విద్యాలయలో 2024- 25 విద్యా సంవత్సరానికి 1వ తరగతిలో అడ్మిషన్లకై నోటిఫికేషన్ వెలువడింది. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తును https://no1vijayawada.kvs.ac.in/ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచామని ప్రిన్సిపాల్ ఆదిశేషవర్మ తెలిపారు. 1వ తరగతిలో అడ్మిషన్‌ కై మార్చి 2024 నాటికి 6 నుంచి 8 సంవత్సరాల వయసున్న పిల్లలు ఏప్రిల్ 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

News March 31, 2024

పెడనలో అత్యధిక మెజారిటీ రికార్డు బద్దలయ్యేనా..

image

2008లో ఏర్పడ్డ పెడన నియోజకవర్గంలో ఇప్పటి వరకు 3 సార్లు ఎన్నికలు జరిగాయి. 2014లో టీడీపీ తరఫున దివంగత కాగిత వెంకట్రావు 13,694 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇప్పటివరకు ఇదే అత్యధిక మెజారిటీ. తాజాగా వెంకట్రావు కుమారుడు కృష్ణప్రసాద్ టీడీపీ నుంచి బరిలో ఉండగా.. వైసీపీ ఉప్పాల రాముకు టికెట్ ఇచ్చింది. తాజా ఎన్నికల్లో వెంకట్రావు రికార్డు చెరిగిపోతుందా.. మీ అభిప్రాయం కామెంట్ చెయ్యండి.

News March 31, 2024

విస్సన్నపేటలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం

image

తిరువూరు నియోజకవర్గం విసన్నపేట మండలం నరసాపురం గ్రామంలో ఆదివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో రెడ్డిగూడెం మండలం ముచ్చనపల్లి గ్రామానికి చెందిన యాకోబు (55) అనే వ్యక్తి మృతి చెందినట్లుగా విసన్నపేట పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

News March 31, 2024

కైకలూరు: నాటు తుపాకీ కలిగిన ఇద్దరి అరెస్టు

image

ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కైకలూరు మండలం రామవరం గ్రామంలోని ఇద్దరు వ్యక్తుల వద్ద 2 నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారికి ఎటువంటి లైసెన్స్ లేదని పోలీసులు ఆదివారం తెలిపారు. సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని రూరల్ ఎస్ఐ రామకృష్ణ అన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News March 31, 2024

చాట్రాయి: సముద్రంలో కొట్టుకుపోయి యువకుడి మృతి

image

మండలంలోని సి.గుడిపాడు గ్రామానికి చెందిన పుల్లారావు(21)అనే యువకుడు శ్రమల దినాలలో జపమాల ఆచరించి యోగేశ్వరం పుణ్యక్షేత్రాలు దర్శించేందుకు తోటి జపమాల దారులతో కలిసి వెళ్లాడు. అక్కడ పుల్లారావు శనివారం రాత్రి ప్రమాదవశాత్తు సముద్రంలో కొట్టుకుని పోయి మృతిచెందాడు. గమనించిన స్థానికులు వెంటనే అతని మృతదేహాన్ని అదివారం తన గ్రామానికి తరలించారు.   

News March 31, 2024

కంచికచర్ల: భర్త, అత్తమామల వేధింపులకు వివాహిత బలి

image

మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన వివాహిత శ్రీలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తపేట గ్రామానికి చెందిన శ్రీలక్ష్మిని పెనుగంచిప్రోలు మండలం కొనకంచికి చెందిన సతీశ్‌తో గత ఏడాది వివాహం చేశారు. శ్రీలక్ష్మికి 2సార్లు గర్భస్రావం కావడంతో భవిష్యత్తులో పిల్లలు పుట్టరని భర్త, అత్తమామలు వేధించడంతో ఆత్మహత్య చేసుకుందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News March 31, 2024

విజయవాడ: పోలీసులకు సీపీ స్ట్రాంగ్ వార్నింగ్

image

ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి సీపీ క్రాంతి రానా టాటా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల నగరంలో పనిచేస్తున్న కింది స్థాయి పోలీసు సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్‌లో చేతివాటం ప్రదర్శిస్తున్నారని పలు ఆరోపణలు రావడంతో సీపీ శనివారం ట్రాఫిక్ అధికారులతో సమావేశం నిర్వహించారు. సిబ్బంది ఉద్యోగంలో నిర్లక్ష్యం వహించినా, అవినీతికి పాల్పడినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.