Krishna

News March 31, 2024

కృష్ణా: మరికొన్ని గంటల్లో ముగియనున్న గడువు

image

విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకై పేద విద్యార్థులకు 1వ తరగతిలో అడ్మిషన్లకై ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. కాగా అడ్మిషన్ల ఆన్‌లైన్ దరఖాస్తు గడువు నేడు ఆదివారంతో ముగియనుంది. అడ్మిషన్ కావాల్సిన వారు గ్రామ సచివాలయాలు, మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని గన్నవరం MEO కె.రవికుమార్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

News March 31, 2024

జిల్లా ప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ 

image

కలెక్టర్ పి రాజాబాబు జిల్లా ప్రజలకు ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. మానవాళి రక్షణార్థమై క్రీస్తు పునరుద్ధానం పొందిన పర్వదినం ఈస్టర్ అన్నారు. అటువంటి పర్వదినం జిల్లా ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈస్టర్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు. 

News March 31, 2024

కృష్ణా: APSDMA నుంచి ప్రజలకు ముఖ్యమైన గమనిక

image

ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కృష్ణా జిల్లాలో ఆదివారం కింద పేర్కొన్న మండలాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఆయా ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు డిగ్రీలు, సెంటీగ్రేడ్‌లలో నమోదవుతాయని స్పష్టం చేస్తూ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
☞కంకిపాడు 40
☞ఉయ్యూరు 40
☞బాపులపాడు 40.1
☞గుడివాడ 39.2
☞గన్నవరం 40.3
☞పెనమలూరు 40.1
☞ఉంగుటూరు 40.3
☞పెదపారుపూడి 39.9
☞తోట్లవల్లూరు 39.5
☞పామర్రు 38.7

News March 31, 2024

ఎన్టీఆర్ జిల్లాలో రూ.16.10లక్షల నగదు, బంగారం పట్టివేత

image

ఎన్నికలో నేపథ్యంలో జిల్లా కమిషనరేట్ పరిధిలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. CP కాంతిరాణా టాటా మాట్లాడుతూ.. పశ్చిమ DCP పరిధిలో ప్రకాశం బ్యారేజ్, గుంటుపల్లి, పాముల కాలువ, నున్న పవర్ గ్రిడ్ ప్రాంతాల్లోని చెక్‌పోస్టుల్లో రూ.5.55లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 1టౌన్ స్టేషన్ పరిధిలో రూ.10.55లక్షల నగదు, 79.1గ్రాముల గోల్డ్ పట్టుకుని ఎన్నికల అధికారులకు అందిచామన్నారు.

News March 31, 2024

కోడూరు: యువకుడిపై పోక్సో కేసు నమోదు

image

కోడూరుకు చెందిన బాలికను మందపాకల గ్రామానికి చెందిన ఓ యువకుడు(19) అపహరించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను అపహరించి తీసుకెళ్లాడని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ యువకుడిని, బాలికను హైదరాబాద్‌లో గుర్తించి స్టేషన్‌కి తరలించారు. ఆపై బాలికను విచారించగా, యువకుడు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపింది. దీంతో ఆ యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్సై తెలిపారు.  

News March 31, 2024

నూజివీడు అసెంబ్లీకి 72 ఏళ్లలో ఐదుగురే అభ్యర్థులు

image

నూజివీడు నియోజకవర్గం నుంచి 72 ఏళ్లలో 15 సార్లు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. ఇప్పటివరకు ఐదుగురు అభ్యర్థులు, 3 సామాజిక వర్గాలు మాత్రమే ఇక్కడ ప్రాతినిధ్యం వహించాయి. 1952 నుంచి 1972వరకు డాక్టర్ ఎంఆర్ అప్పారావు, 1978, 1989లో పాలడుగు వెంకటరావు, 1983, 1985, 1994, 1999లో కోటగిరి హనుమంతరావు, 2004, 2014, 2019లో మేక వెంకట ప్రతాప్ అప్పారావు, 2009లో చిన్నం రామకోటయ్య గెలుపొంది ప్రాతినిధ్యం వహించారు.

News March 30, 2024

మచిలీపట్నం: అరుదైన రికార్డు ముంగిట బాలశౌరి

image

మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో 16 సార్లు లోక్‌సభ ఎన్నికలు జరగగా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఒకే నాయకుడు రెండు వేర్వేరు పార్టీల నుంచి గెలుపొందలేదు. 2019లో వైసీపీ నుంచి గెలిచిన బాలశౌరి ఈసారి జనసేనలో చేరి NDA కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచారు. వచ్చే ఎన్నికల్లో బాలశౌరి గెలిస్తే 2 వేర్వేరు పార్టీల నుంచి మచిలీపట్నం ఎంపీగా గెలిచిన తొలి నాయకుడిగా గుర్తింపు పొందుతారు. మరి మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.  

News March 30, 2024

ఎన్టీఆర్‌ జిల్లా ఎన్నికల స్టార్‌ క్యాంపెయినర్లు వీరే

image

ఎన్టీఆర్‌ జిల్లా ఎన్నికల స్టార్‌ క్యాంపెయినర్లుగా విజయవాడకు చెందిన ఇద్దరు మహిళా క్రీడాకారిణులు, ఒక డాక్టర్‌ కమ్‌ సెక్సాలజిస్ట్‌ను స్టార్‌ క్యాంపెయినర్లుగా జిల్లా ఎన్నికల యంత్రాంగం ఎంపిక చేసింది. చదరంగంలో విజయవాడ కీర్తిపతాకను ప్రపంచస్థాయిలో ఇనుమడింపచేసిన కోనేరు హంపి, ఆర్చరీలో ప్రపంచాన్నే శాసించిన వెన్నం జ్యోతి సురేఖ, ప్రముఖ వైద్యుడు సెక్సాలజిస్ట్‌, సామాజికవేత్త డాక్టర్‌ జి. సమరంను ఎంపిక చేశారు.

News March 30, 2024

మచిలీపట్నం: ఈవీఎంల భద్రతను పరిశీలించిన కలెక్టర్

image

కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎంల గోడౌన్‌ను కలెక్టర్ పి. రాజాబాబు పరిశీలించారు. రోజువారీ తనిఖీల్లో భాగంగా గోడౌన్‌లో భద్రపర్చిన ఈవీఎంలను పరిశీలించిన ఆయన భద్రతా చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈవీఎంలన్నీ పటిష్టమైన భద్రతా చర్యల మధ్య భద్రంగా ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ పరిశీలనలో ఎలక్షన్ సెల్ అధికారులు ఉన్నారు. 

News March 30, 2024

మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థి రాజకీయ నేపథ్యం ఇదే..

image

ఎట్టకేలకు మచిలీపట్నం పార్లమెంట్ జనసేన అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరిని ఆ పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీగా ఉన్న బాలశౌరి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. 2004లో కాంగ్రెస్ నుంచి తెనాలి ఎంపీగా విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ నుంచి నరసరావుపేట ఎంపీగా, 2014లో వైసీపీ తరఫున గుంటూరు నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 2019లో వైసీపీ నుంచి ఎంపీగా విజయం సాధించారు.