Krishna

News August 9, 2024

పంచాయతీలకు నిధులు పెంపు: డిప్యూటీ సీఎం పవన్

image

ఆగష్టు 15న వేడుకల నిర్వహణ కోసం పంచాయతీలకు నిధులు పెంచుతున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ ప్రకటించారు. మైనర్ పంచాయతీలకు రూ.100 నుంచి రూ.10వేలు, మేజర్ పంచాయతీలకు రూ.250 నుంచి రూ.25వేలకు పెంచామన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇదే విధంగా నిధులు ఇస్తామన్నారు. స్కూళ్లలో ఫ్రీడమ్ ఫైటర్లను సత్కరించాలని, విద్యార్థులకు క్రీడలతో పాటు క్విజ్ తదితర పోటీలు నిర్వహించాలన్నారు.

News August 9, 2024

విజయవాడ: రైలు ప్రయాణికులకు శుభవార్త 

image

ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా ఎర్నాకులం(ERS), పాట్నా(PNBE) మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR) పేర్కొంది. నం.06085 ERS-PNBE ట్రైన్‌ను ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 6 వరకు ప్రతి శుక్రవారం, నం.06086 PNBE-ERS ట్రైన్‌ను ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 9 వరకు ప్రతి సోమవారం నడపనున్నట్లు SCR తెలిపింది. ఈ ట్రైన్లు ఏపీలో విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయంది. 

News August 9, 2024

చిన్నారుల పాలిట రియల్ సూపర్ స్టార్ మహేశ్ బాబు

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని వందలాది మంది చిన్నారులకు మహేశ్ బాబు పునర్జన్మనిచ్చారు. విజయవాడలోని ఒక ప్రముఖ ఆసుపత్రి సహకారంతో ఆయన నిర్వహిస్తున్న మహేశ్ బాబు ఫౌండేషన్ చిన్నారులకు విజయవంతంగా హృదయ సంబంధిత శస్త్రచికిత్సలు నిర్వహించింది. నేడు మహేశ్ జన్మదినం సందర్భంగా చిన్నారులకు ఆయన అందజేసిన సేవాకార్యక్రమాలను జిల్లావాసులు కొనియాడుతున్నారు.

News August 9, 2024

కృష్ణా నదికి వరద ఎఫెక్ట్.. భవానీ ద్వీపం మూసివేత

image

కృష్ణా నదికి భారీగా వరద నీరు రావడంతో విజయవాడలోని భవానీ ద్వీపాన్ని పర్యాటక శాఖ అధికారులు గురువారం మూసివేశారు. డబుల్ డెక్ క్రూయిజర్, ఇతర బోట్లను తీరంలో నిలిపేసిన అధికారులు బోటింగ్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున భవానీ ద్వీపంలో రక్షణ చర్యలు తీసుకుంటున్నామని, గజ ఈతగాళ్లను సిద్ధం చేశామని ఏపీటీడీసీ అధికారులు చెప్పారు.

News August 9, 2024

నేడు విజయవాడకు సీఎం చంద్రబాబు

image

విజయవాడకు నేడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రానున్నారని కలెక్టర్ సృజన తెలిపారు. అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు అవుతారని తెలిపారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర కలెక్టర్ సృజన డీసీపీ చక్రవర్తి తదితరులు సభా ప్రాంగణాన్ని పరిశీలించారు.

News August 8, 2024

కృష్ణా: TODAY TOP NEWS

image

* విజయవాడలో సీఎం చంద్రబాబు చీర కొన్నది.. ఎవరి దగ్గరంటే.?
* విజయవాడ: రేపు ITI కళాశాలలో జాబ్ మేళా
* విజయవాడ: ఎమ్మెల్యే సుజనా చౌదరితో వైసీపీ కార్పొరేటర్లు భేటీ
* ‘కృష్ణాకు భారీ వరద.. నదిలో ప్రయాణించొద్దు’
* విజయవాడలో ఘోర విషాదం.. ఇద్దరి మృతి
* గుడివాడలో రెస్టారెంట్ ప్రారంభించిన సినీ హీరో
* విజయవాడ: ఫ్యాషన్ షోలో మెరిసిన యువతులు

News August 8, 2024

కృష్ణా: ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల రద్దీ మేరకు శుక్రవారం మచిలీపట్నం నుంచి తిరుపతికి(నం.07249) ప్రత్యేక రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రేపు రాత్రి 11 గంటలకు మచిలీపట్నం నుంచి బయలుదేరి శనివారం ఉదయం 8 గంటలకు ఈ రైలు తిరుపతి చేరుతుందని తెలిపింది. ఈ రైలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెడన, గుడ్లవల్లేరు, గుడివాడ, విజయవాడలో ఆగుతుందని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది.

News August 8, 2024

కృష్ణా: డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో మే-2024లో నిర్వహించిన డిగ్రీ కోర్సుల 4వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షల రీవాల్యుయెషన్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News August 8, 2024

ఆదివాసి దినోత్స‌వ వేడుక‌లకి చీఫ్ గెస్ట్‌గా చంద్రబాబు

image

విజ‌య‌వాడ త‌మ్మ‌ల‌ప‌ల్లి క‌ళాక్షేత్రంలో శుక్ర‌వారం నిర్వహించనున్న ప్ర‌పంచ ఆదివాసి దినోత్స‌వ వేడుక‌ ఏర్పాట్లను గిరిజ‌న కార్పొరేష‌న్ ఎండీ న‌వ్య గురువారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా సీఎం చంద్ర‌బాబు రానున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఆదివాసీలు హాజ‌రుకానున్న‌ట్లు టీడీపీ నేత మాదిగాని గురునాథం తెలిపారు.

News August 8, 2024

విజయవాడ: ఎమ్మెల్యే సుజనా చౌదరితో వైసీపీ కార్పొరేటర్లు భేటీ

image

విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి పలువురు వైసీపీ కార్పొరేటర్లు గురువారం ఎమ్మెల్యే సుజనా చౌదరిని కలిశారు. కార్పొరేటర్లు రాజేశ్, మహదేవ్ అప్పాజీ, అర్షద్, నరేంద్ర, రత్నకుమారి, లావణ్య, ఆదిలక్ష్మి ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విజయవాడ వైసీపీ అగ్రనాయకత్వం తమను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.