Krishna

News September 26, 2024

గన్నవరంలో ఘోర రోడ్డు ప్రమాదం

image

కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని చెన్నై-కోల్‌కత్తా హైవేపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి వస్తున్న కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. మృతులు బాపట్ల జిల్లా కోటపాడుకు చెందిన మార్క్(25), మేరీ(38)గా గుర్తించారు. క్షతగాత్రుల్ని విజయవాడ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 26, 2024

NTR: రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి

image

ఏ.కొండూరు అడ్డరోడ్డులో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తండ్రి కొడుకులను లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. మామిళ్ల శ్రీనివాసరావు(45), కుమారుడు ప్రసంగి(16) షాపు క్లోజ్ చేసి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నారు. వెనుకనుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News September 26, 2024

వైసీపీ PAC కమిటీ మెంబర్‌గా వెల్లంపల్లి

image

ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ నేతలతో బుధవారం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో జిల్లాలోని పలు విషయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసును పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా నియమిస్తూ జగన్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా దేవినేని అవినాశ్‌ను నియమించారు.

News September 26, 2024

కృష్ణా: ప్రయాణీకుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా భువనేశ్వర్(BBS), యశ్వంత్‌పూర్(YPR) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.02811 BBS-YPR ట్రైన్‌ను అక్టోబర్ 5 నుంచి నవంబర్ 30 వరకు ప్రతి శనివారం, నం.02812 YPR-BBS ట్రైన్‌ను అక్టోబర్ 7 నుంచి డిసెంబర్ 2 వరకు ప్రతి సోమవారం నడుపుతామని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.

News September 26, 2024

ఏ.కొండూరు అడ్డరోడ్డులో ప్రమాదం.. ఇద్దరు మృతి

image

ఎన్టీఆర్ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏ.కొండూరు అడ్డరోడ్డులో రోడ్డుపై నడిచి వెళ్తున్న ఇద్దరు వ్యక్తులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. వీరిద్దరూ తండ్రీకొడుకులుగా తెలుస్తోండగా.. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 26, 2024

కేసుల్లో పురోగతి సాధించండి: ఎస్పీ గంగాధర్

image

కేసుల్లో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్‌తో పురోగతి సాధించి, బాధితులకు సత్వర న్యాయమందించే దిశగా ప్రణాళికల రూపొందించాలని ఎస్పీ ఆర్ గంగాధర్ రావు తెలిపారు. మచిలీపట్నం
జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారులతో ఎస్పీ బుధవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై దిశా నిర్దేశం చేసి, స్నేహపూర్వక పోలీసింగ్ ప్రజలకు అందించి, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలన్నారు.

News September 25, 2024

కృష్ణా: బీ-ఫార్మసీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో బీ ఫార్మసీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2,4,6వ సెమిస్టర్(రెగ్యులర్) థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 4 మధ్య నిర్ణీత తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని ANU తెలిపింది. సబ్జెక్టు వారీగా పరీక్షల టైం టేబుల్ వివరాలకై విద్యార్థులు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలంది.

News September 25, 2024

కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల YCP నూతన అధ్యక్షులు వీరే

image

కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల వైసీపీ నాయకులతో బుధవారం మాజీ సీఎం జగన్ తాడేపల్లిలోని తన కార్యాలయంలో భేటీ అయ్యారు. అనంతరం కృష్ణా జిల్లాకు పేర్నినానిని, ఎన్టీఆర్ జిల్లాకు దేవినేని అవినాశ్‌ను.. జగన్ వైసీపీ జిల్లా అధ్యక్షులుగా నియమించారని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

News September 25, 2024

విజయవాడలో 25న హ్యాండ్ బాల్, చెస్ జట్ల ఎంపికలు

image

విజయవాడలోని కేబీఎన్ కళాశాలలోని క్రీడా మైదానంలో సెప్టెంబర్ 26న ఎస్జీఎఫ్ అండర్ 19 ఉమ్మడి కృష్ణా జిల్లా హ్యాండ్ బాల్, చెస్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అండర్ 19 ఎస్జీఎఫ్ కార్యదర్శి రతికాంత బుధవారం తెలిపారు. ఈ పోటీలకు 01-01-2006 తరువాత పుట్టినవారు అర్హులన్నారు. జిల్లాలో ఆసక్తి గలవారు జనన ధ్రువీకరణ, స్టడీ, ఆధార్ పత్రాలతో హాజరుకావాలన్నారు.

News September 25, 2024

ఉమ్మడి కృష్ణాజిల్లా బాస్కెట్ బాల్ జట్ల ఎంపిక

image

నూజివీడు పట్టణంలోని విక్టోరియా టౌన్ హాల్ క్రీడా మైదానంలో బుధవారం హోరా హోరీగా ఉమ్మడి కృష్ణాజిల్లా బాస్కెట్ బాల్ పోటీలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం అండర్ 14,17 విభాగాలలో బాలికలు, బాలుర ఉమ్మడి కృష్ణాజిల్లా బాస్కెట్ బాల్ జట్లను ఎంపిక చేశారు. త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలలో ఈ జట్లు పాల్గొంటాయని సీనియర్ పీడీ, కోచ్ నాగరాజు తెలిపారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.