India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కలెక్టర్ సృజన బుధవారం విజయవాడ కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పంచాయితీరాజ్, ఉపాధి హామీ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు. సమీక్షలో భాగంగా ఆయా మండలాల్లో నిర్వహిస్తున్న అభివృద్ధి పనుల పురోగతిపై ఆమె అధికారులతో చర్చించారు. నిర్దేశిత గడువులోపు ఆయా అభివృద్ధి పనులను పూర్తి చేసేలా క్షేత్రస్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
కృష్ణా జిల్లా స్పోర్ట్స్ అథారిటీ కమిటీ సమావేశం బుధవారం మచిలీపట్నంలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ DK బాలాజీ అధ్యక్షత వహించారు. స్పోర్ట్స్ క్యాలెండర్ రూపొందించి అమలు చేయడం ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో క్రీడాభివృద్ధికి విస్తృతంగా కృషి చేయాలని ఆయన క్రీడా శాఖ అధికారులకు సూచించారు.
జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (PACS) బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా PACSల కంప్యూటరీకరణ, PACSలలో విద్యుత్, హార్డ్వేర్, PM కిసాన్ సమృద్ధి కేంద్రాలు తదితర అంశాలపై సమీక్షించారు.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని నోబుల్ కళాశాల విద్యార్థుల డిగ్రీ కోర్సుల 1, 3, 5వ సెమిస్టర్ల రీ వాల్యుయేషన్ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
రాష్ట్రంలో చేనేతకు పూర్వ వైభవం తెస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని చేనేత జౌలి శాఖ ఆధ్వర్యంలో బుధవారం విజయవాడ మేరీస్ కాలేజీ వద్ద ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రభుత్వ హయాంలో చేనేత కార్మికులకు స్వర్ణ యుగమని అన్నారు. చేనేతల అన్నపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. చేనేత కార్మికుల కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
బాలికను అత్యాచారం చేసిన ఘటనలో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. గుడ్లపల్లేరుకు చెందిన ఓ వ్యక్తి స్నేహితుడైన తాపీమేస్త్రి వలివెల రామకృష్ణ సదరు బాలికను ప్రేమ పేరుతో వలలో వేసుకున్నాడు. కొద్దిరోజుల కిందట బాలికను హైదరాబాద్కు తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడు. దీనికి శేరీదగ్గుమిల్లికి చెందిన కార్తీక్ సహకరించాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కార్తీక్, రామకృష్ణలపై పోలీసులు పోక్సో కేసులు నమోదు చేశారు.
పామర్రు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక నిమ్మకూరులో చదువుతోంది. తెలుగు ఉపాధ్యాయుడు డి.వెంకటరాజేశ్వరరావు ఈనెల 1న విద్యార్థులను గదికి రమ్మని, సదరు బాలికకు పుస్తకంలోని విషయాన్ని సరిచేయాలని సూచిస్తూ.. విద్యార్థిని శరీరాన్ని తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక ఇంట్లో చెప్పగా, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదుచేసి రిమాండ్ విధించారు. గతంలో ఈయనపై ఇలాంటి ఆరోపణలే ఉన్నాయి.
జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో నుజ్జు నుజ్జై శరీరం ఛిద్రమైఉంది. మృతుడు పడి ఉన్న తీరని చూస్తే భారీ వాహనం ఢీకొన్నట్లు స్థానికులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చిల్లకల్లు ఎస్ఐ సూచించారు.
జగ్గయ్యపేట వైసీపీ నేత గింజుపల్లి శ్రీనివాసరావుపై ఆదివారం హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి మాజీ సీఎం జగన్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసరావును పరామర్శించనున్నారు. బాధితుడికి ధైర్యం చెప్పడంతో పాటు కుటుంబానికి అండగా ఉంటామని ఆయన హామీ ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో మంగళవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ రోనంకి కూర్మనాథ్ తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వాసులంతా అప్రమత్తంగా ఉండాలని, వర్షం కురుస్తున్న సమయంలో చెట్లు, కరెంట్ పోల్స్ వద్ద నిలబడవద్దని తెలిపారు.
Sorry, no posts matched your criteria.