India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తాడేపల్లి ఎయిమ్స్ రోడ్డు వద్ద ఆదివారం ఓ ప్రేమోన్మాది నర్సుగా పనిచేస్తున్న అవనిగడ్డకు చెందిన కావ్యపై బ్లేడ్తో గొంతు కోసేందుకు ప్రయత్నించాడు. స్థానికులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు విజయవాడకు చెందిన క్రాంతిగా గుర్తించారు.
గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అర్హులైన గిరిజన విద్యార్థుల కోసం డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారని దీన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ బాలాజీ తెలిపారు. జిల్లాలో 30వ తేదిన గిరిజన విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు కలెక్టరేట్లోని గిరిజన సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయంలో ఈ నెల 12వ తేదీలోపు దరఖాస్తులను సమర్పించాలన్నారు.
జి. కొండూరులో ఓ వివాహిత(23)ఇంట్లో శనివారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. CI కిషోర్ మాట్లాడుతూ.. జి.కొండూరుకి చెందిన సాంబయ్య, కవిత పెద్దల సమక్షంలో 5ఏళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. సాంబయ్య పుట్టింటి వారితో మాట్లాడవద్దని వాదించేవాడు. ఈ క్రమంలో కవిత తండ్రి శ్రీను మనువడు, మరవరాలికి చిరుతిండి కొనివ్వడంతో సాంబయ్య చూసి గొడపడగా మనస్తాపం చెందిన కవిత ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకొని కనిపించందన్నారు.
నాన్ ఇంటర్లాకింగ్ పనులు జరుగుతున్నందున కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే నరసాపురం- నాగర్సోల్ ఎక్స్ప్రెస్లను దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.12787, 12788 ట్రైన్లను ఆగస్టు 3 -10 వరకు విజయవాడ మీదుగా కాక రామవరప్పాడు- రాయనపాడు మీదుగా నడుపుతామన్నారు. ఆయా రోజుల్లో ఈ రైళ్లకు విజయవాడలో స్టాప్ లేదని, సమీపంలోని రామవరప్పాడులో ఈ రైళ్లకు స్టాప్ ఇచ్చామన్నారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలోని కళాశాలల్లో ఏప్రిల్-2024లో జరిగిన M.Sc. నానో టెక్నాలజీ 2, 3, 5వ సెమిస్టర్ల రెగ్యులర్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవాలని ANU వర్గాలు సూచించాయి. ఫలితాలకై యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in/examcell/results చూడాలని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
ఉపాధి హామీ పథకం ద్వారా పశువులకు, జీవాలకు షెడ్లు నిర్మించుకునే వారికి గోకులం పథకం అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పథకం కింద లబ్ధి పొందాలను కునేవారు జాబ్ కార్డుతో ఉపాధి హామీ కార్యాలయంలో లేదా స్థానిక గోపాలమిత్రలు, పశువైద్య సహాయకులను సంప్రదించాలని కోరారు. ఈ పథకంలో షెడ్ నిర్మాణ వ్యయంలో పశుపోషకులకు 90%, జీవాలు, కోళ్లు పెంచేవారికి 70% రాయితీ ఇస్తామన్నారు.
గత ఐదేళ్లలో రాష్ట్రంలో నమోదైన పోక్సో కేసులలో ఉమ్మడి కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఈ మేరకు పార్లమెంటులో సంబంధిత మంత్రి వివరాలు వెల్లడించారు. ఏపీలో గత ఐదేళ్లలో 6,927 పోక్సో కేసులు నమోదవగా కృష్ణాలో అత్యధికంగా 1,214 కేసులో నమోదయ్యాయని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి బదులిచ్చారు. 6,927 కేసులలో 134(1.93%) మందికి మాత్రమే శిక్షలు పడ్డాయని మంత్రి చెప్పారు.
గిరిజన ఆశ్రమ పాఠశాలల ద్వారా గిరిజన విద్యార్థులకు నూరు శాతం ఉత్తమ ఫలితాలను సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ సృజన సూచించారు. ఎ.కొండూరులో స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు శనివారం కలెక్టర్ సృజన, గిరిజన సంక్షేమ శాఖ అధికారి సునీతతో కలిసి పునరుద్ధరణ నియామకపు పత్రాలను కలెక్టరేట్లోని ఆమె ఛాంబర్లో అందజేశారు. ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను కాంట్రాక్ట్ పద్ధతిపై నియమించినట్లు తెలిపారు.
ఆచార్య నాగార్జున వర్శిటీ పరిధిలోని కళాశాలల్లో యోగాలో పీజీ డిప్లొమా కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు ఆగస్టు 19 నుంచి నిర్వహిస్తామని, విద్యార్థులు పరీక్ష ఫీజును అపరాధరుసుము లేకుండా ఆగస్టు 9లోపు చెల్లించాలని పరీక్షల విభాగం తెలిపింది. పరీక్ష ఫీజు వివరాలకై అధికారిక వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని సూచించింది.
ఆగస్టు 15న విజయవాడ మున్సిపల్ స్టేడియంలో జరిగే వేడుకలకు స్టేడియం ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సృజన అధికారులను ఆదేశించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు హాజరయ్యే కార్యక్రమం అయినందున అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే 6వేల మంది విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం, తాగునీరు అందించాలని కలెక్టర్, అధికారులకు ఆదేశాలిచ్చారు.
Sorry, no posts matched your criteria.