Krishna

News August 2, 2024

కృష్ణా: ఫార్మ్-డీ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున వర్సిటీ పరిధిలో ఫార్మ్-డీ 1వ ఏడాది కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు ఆగస్టు 23 నుంచి నిర్వహిస్తామని, విద్యార్థులు పరీక్ష ఫీజును అపరాధరుసుం లేకుండా ఆగస్టు 7లోపు చెల్లించాలని వర్శిటీ పరీక్షల విభాగం తెలిపింది. పరీక్ష ఫీజు వివరాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/examinationsection చెక్ చేసుకోవాలని సూచించింది.

News August 2, 2024

కంకిపాడు: సెల్ఫీ వీడియో తీసి వ్యక్తి ఆత్మహత్య

image

పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం ప్రొద్దుటూరు గ్రామస్థుడు జి.అఖిల్ పవన్ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. జాబ్ నిమిత్తం గుడివాడ సమీపంలో బేతవోలు గ్రామంలో జీవనం సాగిస్తున్నాడు. కొంత మంది తనను వేధిస్తున్నారని అర్ధరాత్రి సెల్ఫీ వీడియో తీసి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నా చావుకి కారణం పామర్తి కృష్ణ, వీరంకి వంశీ కుమార్’ అని వీడియోలో పేర్కొన్నాడు.

News August 2, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ఊరట

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా ప్రయాణించే దానాపూర్-SMVT బెంగుళూరు(నం.03247) ప్రత్యేక రైళ్లను పొడిగించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆగస్టు 8న నం.03247 రైలును, అదే విధంగా SMVT బెంగుళూరు-దానాపూర్(నం. 03248) రైలును ఆగస్టు 3,10 తేదీల్లో నడుపుతామని ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, వరంగల్ స్టేషన్లలో మాత్రమే ఈ రైళ్లు ఆగుతాయన్నారు.

News August 2, 2024

మైలవరం MLA వసంత సంచలన వ్యాఖ్యలు

image

మైలవరం MLA వసంత కృష్ణప్రసాద్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గత ప్రభుత్వ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూలో వసంత మాట్లాడుతూ.. చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లినందుకే జోగి రమేశ్‌కు, జగన్ మంత్రి పదవి ఇచ్చారన్నారు. ఐదేళ్లపాటు జగన్ అరాచకాన్ని ప్రోత్సహించారని, పరిపాలనలో ఆయన చేయని తప్పు లేదన్నారు. ప్రతిపక్ష హోదా దక్కకుండా వైసీపీ ఘోర పరాజయానికి కారణం జగనేనన్నారు. 

News August 2, 2024

విజయవాడ: విద్యుత్ షాక్‌కు గురై యువకుడి మృతి

image

విజయవాడలో విద్యుత్ షాక్‌కు గురై ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. పాత రాజరాజేశ్వరి పేటకు చెందిన సురేశ్ అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడైన అక్షయ్ కుమార్ 8వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో గురువారం ఇంట్లో స్నానానికి హీటర్ పెట్టుకున్నాడు. ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురై అక్షయ్ మృతిచెందినట్లు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొత్తపేట సీఐ గణేశ్ ఘటనపై కేసు నమోదు చేశారు.

News August 2, 2024

విజయవాడ: ఆర్ధిక ఇబ్బందులతో సూసైడ్

image

చిట్టినగర్‌కు చెందిన పద్మ అనే మహిళ ఆమె అక్క కొడుకు చైతన్యను దత్తత తీసుకుని పెంచుకుంటోంది. చైతన్య చిన్నప్పటి నుంచే మానసిక వికలాంగుడు. ఇటీవల పద్మ ఆర్థికంగా చితికిపోవడంతో చైతన్య, పద్మ చనిపోదామని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో చైతన్యకు గురువారం కూల్ డ్రింక్‌లో పురుగు మందు కలిపి ఇచ్చింది. వెంటనే ఆమె చైతన్యను హాస్పిటల్‌కు తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ.. మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News August 2, 2024

స్వాతంత్ర్య వేడుకలకు విస్తృతమైన ఏర్పాట్లు: సీఎస్

image

ఈ నెల 15వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించనున్న 78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ సృజన, అధికారులు వర్చువల్ గా హాజరయ్యారు. రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమానికి కూడా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

News August 2, 2024

తల్లి ముర్రుపాలు బిడ్డకు మొదటి టీకా: కలెక్టర్ బాలాజీ

image

ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బాలాజీ తెలిపారు. మచిలీపట్నం కలెక్టరేట్లో గురువారం తల్లిపాల వారోత్సవాలకు సంబంధించిన గోడ ప్రతులను, బ్యానర్లను, కరపత్రాలను డీఎంహెచ్ఓ గీతాభాయి కలిసి ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. తల్లి ముర్రుపాలు బిడ్డకు మొదటి టీకా అని అన్నారు.

News August 1, 2024

కృష్ణా: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన APSSDC

image

డిగ్రీ, MLT, DMLT, నర్సింగ్ తదితర కోర్సులు చదివినవారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించే కార్యక్రమానికి ఈ నెల 14న స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఈ ఇంటర్వ్యూలు విజయవాడ డోర్నకల్ రోడ్డులోని అమృత డయాగ్నోస్టిక్స్ సంస్థలో జరగనున్నాయి. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల 13లోపు APSSDC అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

News August 1, 2024

బాల్యవివాహాలను ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదు: కలెక్టర్

image

బాల్యవివాహాలను ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మచిలీపట్నంలోని కలెక్టరేట్లో కాన్ఫరెన్స్ హాల్లో ఐసిడిఎస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో బాల్య వివాహాలు జరిగితే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్, సంబందిత అధికారులను ఆదేశించారు. బాల్య వివాహాలు జరిగితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1098కి ఫోన్ చేసి తెలపాలన్నారు.