Krishna

News March 26, 2024

వీరపనేనిగూడెం వద్ద ఆటో బోల్తా.. ఇద్దరు మృతి

image

గన్నవరం మండలంలో వీరపనేని గూడెం వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిరిపల్లి నుంచి కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిగా, 18 మందికి గాయాలయ్యాయి. ఆగిరిపల్లి నుంచి కూలీలు తీసుకొస్తున్న ఆటో మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. 

News March 26, 2024

విజయవాడ: ‘ప్రకటనలు చూసి పెట్టుబడి పెట్టకండి’

image

రెట్టింపు లాభాలకు ఆశపడి, అపరిచిత వ్యక్తులు చెప్పింది నమ్మి, మోసపూరిత వెబ్ సైట్ లేదా యాప్‌లో డబ్బులు పెట్టుబడి పెట్టి మోసపోవద్దని విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం హెచ్చరికలు జారీ చేశారు. సైబర్ నేరాల పట్ల అవగాహనతో, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేయాలనీ లేదా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ https://cybercrime.gov.in/ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు.

News March 25, 2024

నేడు విజయవాడ రానున్న “ఓం భీం బుష్” మూవీ టీం

image

“ఓం భీం బుష్” మూవీ టీం నేడు విజయవాడ రానుంది. ఈ మేరకు ఆ సినిమా ప్రొడక్షన్ బృందం తాజాగా ట్వీట్ చేసింది. “ఓం భీం బుష్” చిత్రం విజయవంతమైనందున చిత్రబృందం తలపెట్టిన వీర విజయ యాత్రలో భాగంగా.. ఈ రోజు రాత్రి 11.15 గంటలకు విజయవాడ శైలజ థియేటర్‌కు ఆ చిత్ర తారాగణం వస్తారని “ఓం భీం బుష్” సినిమా ప్రొడక్షన్ విభాగం తెలిపింది.

News March 25, 2024

ఐటీ శిక్షణ ఇప్పిస్తానని.. అఘాయిత్యం

image

కరీంనగర్‌కు చెందిన ఓ వివాహిత హైదరాబాద్ KPHPపరిధిలోని ఓ ఇనిస్టిట్యూట్‌‌లో సాఫ్ట్‌వేర్ ఆన్‌లైన్ శిక్షణలో చేరింది. శిక్షకుడు నరేంద్రకుమార్ ధ్రువపత్రాల తనిఖీ కోసం ఆమెను పిలిచి శారీరకంగా లోబరచుకున్నాడు. విషయాన్నిఆ మహిళ శిక్షణ తరగతుల సహచరుడు కృష్ణా జిల్లా వాసి సంతోష్‌‌కి తెలపడంతో అతను ఆమెను వేధింపసాగాడు. అది తట్టుకోలేక మహిళ నిద్రమాత్రలు మింగింది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.

News March 25, 2024

‘సువిధ’ యాప్‌లో అనుమతులు పొందండి: కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వివిధ రకాల పర్మిషన్ల కోసం సువిధ ఆన్‌లైన్ పోర్టర్ ద్వారా అనుమతులు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి రాజాబాబు ఓ ప్రకటనలో తెలిపారు. సువిధ ఆన్ లైన్ పోర్టర్‌తో పాటు ఆఫ్ లైన్‌లో కూడా అనుమతులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇతర వివరాల కోసం రిటర్నింగ్ అధికార్లను సంప్రదించాలని కలెక్టర్ కోరారు.

News March 25, 2024

గన్నవరం: జాతీయస్థాయి లాక్రోస్ పోటీలకు ఎంపికైన హరికుమార్

image

జాతీయ స్థాయి సీనియర్ లాక్రోస్ పోటీలకు గన్నవరం క్రీడాకారుడు హరికుమార్ ఎంపికైనట్లు ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి నాగరాజు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల29 నుంచి 31వ తేదీ వరకు ఆగ్రాలో జరుగనున్న జాతీయ స్థాయి సీనియర్ లాక్రోస్ పోటీలలో హరి పాల్గొనున్నట్లు చెప్పారు. అనంతరం హరి క్రీడలో ప్రతిభ కనపరిచి బంగారు పతకం సాధించాలని ఆకాంక్షించారు.

News March 25, 2024

విజయవాడ: బొండా తన రికార్డు చెరిపేస్తారా?

image

2008లో ఏర్పడ్డ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకూ 3 సార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో మినహా ప్రతిసారి బొండా టీడీపీ తరపున బరిలో నిలిచారు. 2019లో వైసీపీ అభ్యర్థి విష్ణు చేతిలో 25 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఓడిన ఆయన 2014లో 27,161 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. బొండా సాధించిన ఈ మెజారిటీనే సెంట్రల్‌లో అత్యధికం కాగా..2024లో టీడీపీ నుంచి మరోసారి బరిలో ఉన్న బొండా ఈ రికార్డును చెరిపేస్తారా.. కామెంట్ చేయండి.

News March 25, 2024

అవనిగడ్డ: జనసేన అభ్యర్థిపై వీడని టెన్షన్

image

జనసేన పార్టీ ప్రకటించాల్సిన పెండింగ్ స్థానాల్లో ఒకటైన అవనిగడ్డలో అభ్యర్థి ఎవరనే టెన్షన్ కొనసాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తుది పరిశీలనలో పార్టీ జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, కాంట్రాక్టర్ విక్కుర్తి శ్రీనివాస్ పేర్లు ఉన్నాయి. అయితే బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరిని అవనిగడ్డ MLA అభ్యర్థిగా బరిలో దింపి, MP అభ్యర్థిగా బండారు నరసింహారావును పోటీకి పెట్టే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

News March 25, 2024

హొలీను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: కలెక్టర్ 

image

రాధ, కృష్ణుల ప్రేమకు ప్రతి రూపంగా జరుపుకునే అతి ముఖ్యమైన హోలీ పండుగను జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కలెక్టర్ డిల్లీరావు ఆకాంక్షించారు. సోమవారం హోలీ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగ విశిష్ఠతను ప్రతి ఒక్కరూ తెలుసుకొని సంప్రదాయ బద్ధంగా రసాయన రహిత రంగులతో పండుగ జరుపుకోవాలన్నారు.
ప్రతి ఒక్కరి జీవితం ఇంద్రధనస్సులో సప్తవర్ణ శోభితం కావాలని కోరారు. 

News March 24, 2024

NDA కూటమిలో కొలిక్కిరాని విజయవాడ పశ్చిమ పంచాయితీ

image

విజయవాడ పశ్చిమ నుంచి పోటీచేసే NDA కూటమి అభ్యర్థిపై ఇంకా సస్పెన్స్ వీడకపోవడంతో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. జనసేన నేత మహేష్‌కు ఇవ్వాలని JSP క్యాడర్ బలంగా కోరుతుండగా, పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో గత కొద్దిరోజులుగా విజయవాడ నగరంలో మహేష్ అనుచరులు తమ విజ్ఞప్తిని పరిశీలించాలని జనసేన అధిష్ఠానానికి పలు రీతుల్లో నిరసన తెలుపుతున్నారు.