Krishna

News March 23, 2024

ఎన్టీఆర్‌: భర్త గొంతు కోసిన భార్య

image

వత్సవాయిలో భర్త గొంతును భార్య బ్లేడుతో కోసిన ఘటన కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన ఏడుకొండలు, పార్వతీ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. అయితే గత కొంతకాలం నుంచి దంపతులు మధ్య కలహాలు జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య మాట మాటా పెరగడంతో భార్య పార్వతీ తన దగ్గర ఉన్న బ్లేడుతో భర్త గొంతు కోసింది. గమనించిన స్థానికులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. 

News March 23, 2024

కృష్ణా: డీఎడ్ విద్యార్థులకు ముఖ్య గమనిక

image

గుడ్లవల్లేరు మండలం అంగలూరులోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ పరిధిలోని డీఎడ్ విద్యార్థులు (2022- 24 బ్యాచ్) రాయాల్సిన సెకండియర్ 3వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 22 నుంచి 27 మధ్య ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగ సంచాలకులు దేవానందరెడ్డి అధికారిక ఉత్తర్వులు జారీచేశారు.

News March 23, 2024

విజయవాడ: సమాచార శాఖలో ఇకపై వారి సేవలకు సెలవు

image

రాష్ట్ర సమాచార శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను ఉపసంహరించుకున్నట్లు ఆ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో పెద్ద ఎత్తున తమ సానుభూతిపరులను సమాచార శాఖలోకి తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో వీరందరినీ విధుల నుంచి తొలగిస్తూ సర్క్యులర్ మెమో నంబర్. 4539/అడ్మిన్-1-1/2019ను జారీ చేశారు.

News March 23, 2024

గంపలగూడెం: భార్యతో గొడవలు.. కొడుకు కిడ్నాప్

image

తెనాలి లలితానగర్‌లో భార్యాభర్తలు రవికాంత్, స్వాతి నివాసం ఉంటున్నారు. భర్త వేధిస్తున్నాడని భార్య కృష్ణా జిల్లా గంపలగూడెం మం. ఉటూకూరులో అత్తగారి ఇంటికి వెళ్లి చెప్పింది. ఆ తర్వాత కొడుకు(5)ని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. తన సోదరి ఆనారోగ్యం కారణంగా స్వాతి విజయవాడకు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న రవికాంత్ అక్కడికి వచ్చి కుమారుడిని తీసుకొని పారిపోయాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News March 23, 2024

కృష్ణా: MP అభ్యర్థి, ముగ్గురు MLA అభ్యర్థులది ఒకే గ్రామం

image

కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం బందలాయిచెరువు గ్రామానికి చెందిన నలుగురు నేతలు ప్రస్తుత ఎన్నికల బరిలో దిగుతున్నారు. అంబటి రాంబాబు పల్నాడు(D) సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఆయన సోదరుడు అంబటి మురళి గుంటూరు(D) పొన్నూరు MLA అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అవనిగడ్డ MLA సింహాద్రి రమేశ్ బాబు మరోసారి పోటీకి సిద్ధం కాగా, సింహాద్రి చంద్రశేఖరరావు బందరు MP అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.

News March 23, 2024

కృష్ణా: హోళీ సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడపనున్న రైల్వే

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా ఈ నెల 23, 25 తేదీల్లో సత్రాగచ్చి(SRC), సికింద్రాబాద్(SC) మధ్య స్పెషల్ రైళ్లను నడుపుతామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 23న నెం.07645 SC- SRC, ఈ నెల 25న నెం.07646 SRC- SC మధ్య ఈ రైళ్లు నడుస్తాయని తెలిపారు. ఏపీలో ఈ రైళ్లు శ్రీకాకుళం రోడ్, విజయనగరం, విశాఖపట్నం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు విజయవాడ, గుంటూరు తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News March 23, 2024

కృష్ణా: డిగ్రీ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల టైంటేబుల్ విడుదల

image

కృష్ణా వర్సిటీ పరిధిలోని డిగ్రీ(2019- 20 బ్యాచ్) విద్యార్థులు రాయాల్సిన 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 2 నుంచి 20 వరకు ఈ పరీక్షలు ఆయా తేదీల్లో జరుగుతాయి. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్షలు జరుగుతాయని, పరీక్షల టైం టేబుల్ పూర్తి వివరాలకు విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం తెలిపింది.

News March 22, 2024

జిల్లాలో పదవ తరగతి గణితం పరీక్ష ప్రశాంతం

image

పది పరీక్షల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన గణితం పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని జిల్లా విద్యాశాఖాధికారిణి తాహేరా సుల్తానా తెలిపారు. జిల్లాలో మొత్తం 151 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా గణితం పరీక్షకు 21,539 మంది విద్యార్థులకు గానూ 391 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 30 పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షలు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారని డీఈఓ తెలిపారు.

News March 22, 2024

కృష్ణా: టీడీపీ నుంచి.. నాడు తండ్రి, నేడు కుమారుడు

image

మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ తండ్రి నాగేశ్వరరావు 1972లో కాంగ్రెస్, 1983, 85లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి నందిగామ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కృష్ణప్రసాద్ 2019(మైలవరం)లో వైసీపీ తరఫున గెలిచారు. తాజాగా ఆయన టీడీపీ నుంచి బరిలో దిగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వసంత మరోసారి గెలిస్తే రెండు వేర్వేరు పార్టీల తరఫున విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టిన తండ్రీకుమారులుగా రికార్డెలకెక్కనున్నారు.

News March 22, 2024

విజయవాడలో భారీగా నగదు, బంగారం స్వాధీనం

image

విజయవాడలో శుక్రవారం భారీగా నగదు, బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్ వద్ద రెండు కేజీల బంగారం, కిలోన్నర వెండి, కోటిన్నర నగదు పట్టుబడింది.ఎన్నికల నిబంధన మేరకు ఒక మనిషి రూ.50,000 మాత్రమే తీసుకొని వెళ్లాల్సి ఉంది. ఇది నగరంలోని ఓ బంగారు షాపుకు చెందినదిగా భావిస్తున్నారు. పూర్తి వివరాలను త్వరలో పోలీసులు వెల్లడించనున్నారు.