India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడ రూరల్ మండలం రాయనపాడులో ఒంటరి మహిళపై మాజీ హోంగార్డు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఒంటరి మహిళ ఇళ్లల్లో పని చేసుకుని జీవనం కొనసాగిస్తోంది. 8ఏళ్ల కిందట గతంలో హోంగార్డుగా పనిచేసిన నాగరాజు ఆమెను వేధించడంతో పోలీసులు విధుల నుంచి తొలగించారు. శుక్రవారం రాత్రి ఆమె ఇంటికి వెళుతున్న సమయంలో ఆమెను అడ్డగించి అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు.
కృష్ణా జిల్లాకు చెందిన నాగరాజు(HC-2991) ఇటీవల అనారోగ్య కారణాలతో మరణించాడు. ఈ నేపథ్యంలో అతడి బ్యాచ్ సభ్యులు నాగరాజు కుటుంబానికి రూ.63వేల ఆర్థికసహాయం అందించారు. శనివారం మచిలీపట్నంలోని తన కార్యాలయంలో నాగరాజు కుటుంబసభ్యులకు జిల్లా ఎస్పీ గంగాధర్ వారు కూడగట్టిన రూ.63 వేలు అందజేశారు. దాతృత్వం ప్రదర్శించిన సిబ్బందిని ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు.
* పెనమలూరులో బస్సు డ్రైవర్పై యువకుల దాడి
* ఉమ్మడి కృష్ణా జిల్లాకు నేడు వర్షసూచన
* కృష్ణా: ప్రయాణికులకు గుడ్ న్యూస్
* విజయవాడ: RTC బస్సు కింద పడి మహిళ మృతి
* విజయవాడ ఎయిర్పోర్ట్కు NTR పేరు పెట్టండి
* వైసీపీ అధినేత YS జగన్కు ఎంపీ కేశినేని చిన్ని సవాల్
* కూటమి ప్రభుత్వంపై పోతిన మహేశ్ ఫైర్
రామవరప్పాడులోని సెయింట్ ఆన్స్ పాఠశాల క్రీడా మైదానంలో జులై 31న కృష్ణా జిల్లా షూటింగ్ బాల్ సంఘం ఆధ్వర్యంలో సబ్ జూనియర్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజశేఖర్, విజయ్ కుమార్ శనివారం తెలిపారు. ఇక్కడ ఎంపికైన విద్యార్థులు ఆగస్టు 10, 11 తేదీలలో కుప్పంలో జరగబోయే రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలలో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు.
విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల అండర్-17, అండర్-20, సీనియర్ స్త్రీ, పురుషుల వెయిట్ లిఫ్టింగ్ జట్ల ఎంపిక పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు ఇరు జిల్లాల వెయిట్ లిఫ్టింగ్ సంఘాల కార్యదర్శులు రవి, నరేంద్ర శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పోటీల్లో పాల్గొనే ఆసక్తి కలిగిన క్రీడాకారులు ధ్రువపత్రాలతో రేపు ఉదయం 8గంటలకు స్టేడియంలోని వెయిట్ లిఫ్టింగ్ హాలు వద్దకు రావాలని సూచించారు.
జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రజాప్రతినిధులు అధికారులు కలిసికట్టుగా కృషి చేద్దామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలో కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ డీకే బాలాజీ సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మలతో కలిసి ఎమ్మెల్యేలు, అధికారులతో ఆయన శనివారం సమావేశం నిర్వహించారు. అనంతరం కొల్లు మాట్లాడుతూ.. అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలలో సమన్వయంతో ముందుకు వెళదామన్నారు.
కృష్ణా వర్సిటీ పరిధిలోని కళాశాలలలో బీ ఫార్మసీ విద్యార్థులకై నిర్వహించే సప్లిమెంటరీ(One time Opportunity) పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. Y14, Y15, Y16తో ప్రారంభమయ్యే రిజిస్టర్డ్ నంబర్ కలిగిన విద్యార్థులు ఈ పరీక్షలు రాసేందుకు ఆగస్టు 5లోపు అపరాధ రుసుము లేకుండా ఒక్కో సబ్జెక్టుకు రూ.2,000 ఫీజు చెల్లించాలని వర్సిటీ సూచించింది. వివరాలకు https://kru.ac.in/అధికారిక వెబ్సైట్ చూడాలని స్పష్టం చేసింది.
విజయవాడ ఎయిర్పోర్ట్కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు పౌరవిమానయాన సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు తిరుపతి ఎయిర్పోర్టుకు శ్రీవేంకటేశ్వర, ఓర్వకల్లు ఎయిర్పోర్ట్కు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేర్లను పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ ప్రతిపాదనలపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఉమ్మడి జిల్లా మీదుగా భువనేశ్వర్, సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే విశాఖ ఎక్స్ప్రెస్లకు అదనంగా 2 జనరల్ కోచ్లు జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.17015/17016 విశాఖ ఎక్స్ప్రెస్ ప్రస్తుతం 2 GEN కోచ్లతో నడుస్తుండగా 2 బోగీలు జతచేసి 4 GEN కోచ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 17016 ట్రైన్ను నవంబర్ 14 నుంచి, 17015 ట్రైన్ను నవంబర్ 16 నుంచి 2 అదనపు జనరల్ కోచ్లతో నడుపుతామన్నారు.
జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ బాలాజీ తెలిపారు. శుక్రవారం సచివాలయం నుంచి ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా ఉచిత ఇసుక విధానం అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానాన్ని జిల్లాలో అమలు చేస్తున్నామని తెలిపారు.
Sorry, no posts matched your criteria.