Krishna

News July 26, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు గమనిక

image

విజయవాడ నుంచి తెనాలి వెళ్లే మెము రైళ్లను ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున కొద్ది రోజులపాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు ఆగస్టు 5 నుంచి 10 వరకు నం.07279 విజయవాడ-తెనాలి, నం.07575 తెనాలి-విజయవాడ మెము రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులు రైళ్ల రద్దు ప్రకటనను గమనించాలని సూచించింది.

News July 26, 2024

వేడుకలకు స్టేడియం సిద్దం చేయండి: కలెక్టర్‌ సృజన

image

78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను చేయాలని కలెక్టర్‌ సృజన తెలిపారు. ఆగస్టు 15న స్థానిక మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించనున్న 78వ స్వాతంత్య వేడుక పనులను పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధాన్యచంద్ర శుక్రవారం స్వయంగా పరిశీలించి, అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. 

News July 26, 2024

సుజనా చౌదరికి మంత్రి పదవి?

image

రాష్ట్ర మంత్రివర్గంలో సుజనా చౌదరికి చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఒక మంత్రి పదవిని భర్తీ చేయకుండా ఆయన కోసమే ఉంచినట్లు ప్రచారం సాగుతోంది. ఆ సీటుపై పలువురు నేతలు ఆశలు పెట్టుకున్నారు. కానీ, కేంద్రమంత్రిగా చేసిన అనుభవం ఉండడంతో సుజనా చౌదరికే మంత్రి పదవి ఇవ్వాలని CM చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. తాజా ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నుంచి ఆయన భారీ మెజార్టీలో గెలిచిన విషయం తెలిసిందే.

News July 26, 2024

సైనికుల స్ఫూర్తి దేశ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది: గవర్నర్

image

‘కార్గిల్ విజయ్ దివస్’ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కార్గిల్ యుద్ధంలో అత్యున్నత త్యాగం చేసిన భారత ఆర్మీ సైనికులకు నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన విజయవాడ రాజ్‌భవన్ నుంచి తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. భారతదేశ మాతృభూమిని రక్షించుకోవడానికి కార్గిల్ యుద్ధంలో సైనికులు అత్యంత కఠినమైన పరిస్థితుల్లో ధైర్యంగా పోరాడారని గవర్నర్ కొనియాడారు.

News July 26, 2024

కృష్ణా: ఒలింపిక్స్ అదరగొట్టిన ధీరజ్

image

పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ తరఫున ఆర్చరీ క్రీడలో బరిలోకి దిగిన విజయవాడ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర గురువారం జరిగిన మెన్స్ ర్యాంకింగ్ రౌండ్‌లో సత్తా చాటాడు. ధీరజ్, తరుణ్‌దీప్, ప్రణవ్‌లతో కూడిన భారత జట్టు 2,013 పాయింట్లు సాధించి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. కాగా ధీరజ్ 681 పాయింట్లు సాధించి జట్టు క్వార్టర్‌ ఫైనల్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు.

News July 26, 2024

కృష్ణా: అదరగొట్టిన ధీరజ్..క్వార్టర్‌ ఫైనల్‌కు భారత్

image

ప్యారిస్ ఒలంపిక్స్‌లో భారత్ తరపున ఆర్చరీ క్రీడలో బరిలోకి దిగిన విజయవాడ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర గురువారం జరిగిన మెన్స్ ర్యాంకింగ్ రౌండ్‌లో సత్తా చాటాడు. ధీరజ్, తరుణ్‌దీప్, ప్రణవ్‌లతో కూడిన భారత జట్టు 2013 పాయింట్లు సాధించి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. కాగా ధీరజ్ 681 పాయింట్లు సాధించి జట్టు క్వార్టర్‌ ఫైనల్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు.

News July 25, 2024

కృష్ణా జిల్లా TODAY TOP NEWS

image

* సౌదీకి కృష్ణా జిల్లా దంపతులు.. చిత్రహింసలు
* విజయవాడలో బాలికపై అత్యాచారం
* గుడివాడ-మచిలీపట్నం హైవేపై ప్రమాదం
* విజయవాడ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తాం: మంత్రి అశ్విని
* ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ MLAలపై ఎన్ని కేసులంటే.!
* కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల ఫలితాలు విడుదల
* విజయవాడ: జగన్‌పై మాజీ మంత్రి దేవినేని ఫైర్
* ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తాం: బొండా ఉమా

News July 25, 2024

బీటెక్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల ఫలితాల విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో ఇటీవల జరిగిన బీటెక్ 5, 7వ సెమిస్టర్ రీ వాల్యుయేషన్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ మేరకు రీ వాల్యుయేషన్‌కై దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవాలని కృష్ణా వర్సిటీ వర్గాలు సూచించాయి. ఫలితాలకై యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చూడాలని KRU పరీక్షల విభాగం తెలిపింది.

News July 25, 2024

పీజీ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల ఫలితాల విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో ఇటీవల జరిగిన పీజీ 3వ సెమిస్టర్ రీ వాల్యుయేషన్ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. రీ వాల్యుయేషన్‌కై దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవాలని కృష్ణా వర్సీటీ వర్గాలు సూచించాయి. ఫలితాలకై యూనివర్శిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చూడాలని KRU పరీక్షల విభాగం తెలిపింది.

News July 25, 2024

ఏఎన్‌యూ డిగ్రీ రెండవ సెమిస్టర్ పరీక్ష ఫలితాల విడుదల

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఏప్రిల్‌లో నిర్వహించిన డిగ్రీ కోర్సుల 2వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను గురువారం ఇన్‌ఛార్జ్ వీసీ ప్రొఫెసర్ గంగాధరరావు విడుదల చేశారు. ఈ పరీక్షలకు 9792 మంది హాజరు కాగా వారిలో 5670 మంది ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. అదనపు పరీక్షల నియంత్రణ అధికారి రెడ్డి ప్రకాష్ రావు మాట్లాడుతూ.. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్ www.anu.ac.inలో పొందుపరిచినట్లు చెప్పారు.