India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీడీపీ కూటమి ప్రభుత్వ కృషి ఫలితంగా కేంద్ర బడ్జెట్లో ఏపీకి భారీగా కేటాయింపులు జరిగాయని మంత్రి కొలుసు పార్థసారథి ట్వీట్ చేశారు. పోలవరం, అమరావతి నిర్మాణానికి, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించిందని కొలుసు వ్యాఖ్యానించారు. టీడీపీ సర్కారు చేసిన నిర్విరామ కృషి వలన విభజన చట్టంలోని హామీలు నెరవేరుతున్నాయని కొలుసు ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.
ఇబ్రహీంపట్నం ఖిల్లా రోడ్డులో ఇంటి ముందు ఆడుకుంటున్న సిద్ధార్థ నాయక్(3) మంగళవారం అదృశ్యం అయ్యాడు. ఈ మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. <<13690032>>గంటల వ్యవధిలోనే ఆడుకుంటూ <<>>ప్రమాదవశాత్తు సమీపంలోని ఎన్టీటీపీఎస్ బూడిద కాలువలో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. న్యాయం చేయాలంటూ బాలుడి మృతదేహంతో ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ ముందు ఆందోళనకు దిగారు.
పమిడిముక్కల మండలంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలకు ఓ మహిళ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. మంటాడకు చెందిన స్రవంతికి ఓ యాప్ నిర్వహాకులు వంద రూపాయలు పెట్టుబడి పెడితే 400 వస్తాయని నమ్మబలికారు. దీంతో ఆమె ఆదివారం రూ.1,35,000లు పెట్టుబడి పెట్టింది. నిర్వాహకుల నుంచి సమాధానం రాకపోవడంతో మోసపోయానని గ్రహించి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది.
*జగ్గయ్యపేటలో సందడి చేసిన హీరోయిన్
*బ్రాహ్మణిపై అనుచిత వ్యాఖ్యలు.. కేసు నమోదు
* విజయవాడ: యువతి ప్రైవేట్ ఫొటోలు షేర్
* నూజివీడు IITలో నేడు కౌన్సెలింగ్
* విజయవాడలో నిత్య పెళ్లికొడుకు అరెస్ట్
*కొడాలి నాని PAపై దాడి
*నూజివీడు IIIT విద్యార్థులకు లోకేశ్ భరోసా
* ఎన్టీఆర్: ‘బాబాయి హత్య గుండెపోటుగా చిత్రీకరణ’
కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరి-2024లో నిర్వహించిన పీజీ-ఆర్ట్స్ గ్రూపుల 1వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు జులై 29వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.900 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది. వివరాలకు https://kru.ac.in/వెబ్సైట్ చూడాలని సూచించింది.
రాష్ట్ర బడ్జెట్పై మంత్రి కొలుసు పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం అసెంబ్లీకి వెళుతూ.. ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు టీడీపీ సర్కారు కృషి చేస్తోందన్నారు. ప్రస్తుతం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడుతున్నామని, త్వరలో రాష్ట్రానికి దిక్సూచిలాంటి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. వైసీపీ పాలనలో అన్ని శాఖల్లో దోపిడీ మాత్రమే జరిగిందన్నారు.
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 16 మంది MLAలు అసెంబ్లీలో తమ గళం వినిపించనుండగా..వారిలో కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే వర్ల, కాగిత, కొలికపూడి, సుజనా, యార్లగడ్డ, వెనిగండ్ల మొదటి గళం వినిపించనున్నారు. మరి మీ MLA ఏ సమస్యపై అసెంబ్లీలో ప్రస్తావించాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఎమ్మెల్యేలు పసుపు దుస్తులు, కండువాలు ధరించి అసెంబ్లీకి హాజరు కానున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రజా ప్రతినిధులకు అధిష్ఠానం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది.. సమావేశాలకు ముందు సీఎం చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ శాసనసభాపక్షం వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించనుంది.
మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో మారు పేర్లతో ప్రొఫైల్ అప్లోడ్ చేసుకొని ఒంటరి మహిళలకు వల వేసిన నిత్య పెళ్లికొడుకును గవర్నర్ పేట పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణకు చెందిన మోహన్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తానంటూ పలు మ్యాట్రిమోనీ సైట్లలో ఒంటరి మహిళలను మోసం చేసి నగదు వసూలు చేసి పారిపోయేవాడు. పలు ఫిర్యాదులు రావడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.
లక్ష కడితే రూ.10 లక్షలు ఇస్తామంటూ పవన్, నాగూర్, అనిత, నాగరాజు అనే నలుగురు మోసం చేశారంటూ, నున్న పోలీసులకు గుంటూరుకు చెందిన సరస్వతి అనే మహిళ ఫిర్యాదు చేసింది. ఈ ముఠా డబ్బుతో ఉన్న ఒక గోడౌన్ చూపించి లక్షకు పది లక్షలిస్తామంటే అప్పు చేసి రూ.36 లక్షలు వారికి ఇచ్చానని సరస్వతి పోలీసులకు తెలిపింది. విజయవాడ సుందరయ్యనగర్లోని నాగూర్ ఇంటికి వచ్చి డబ్బు అడగగా స్పందించలేదని బాధితురాలు వాపోయింది.
Sorry, no posts matched your criteria.