India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తన సొంత చెల్లి షర్మిలకు చట్టపక్రారం చెందాల్సిన ఆస్తులను జగన్ లాక్కున్నాడని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. ఆస్తులు లాక్కునేందుకు సెప్టెంబర్ 10న మాజీ సీఎం జగన్ హైదరాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)లో పిటిషన్లు దాఖలు చేశాడన్నారు. తల్లిపైనే కేసులు పెట్టి, చెల్లిని మోసం చేసే నైజం జగన్దని ఉమా ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.

రాష్ట్ర సచివాలయ నిర్మాణానికి ముదినేపల్లికి చెందిన అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి అరేకరం పొలంను విరాళంగా అందించారు. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఆమె తండ్రి వైద్యులు మనోజ్తో కలిసి, దానికి సంబంధించిన నగదును అందించారు. అరేకరంకు సంబంధించిన రూ.12.5 లక్షలు, హైకోర్టు నిర్మాణానికి రూ.1 లక్ష విరాళంగా అందించారు. గతంలో అమరావతి అభివృద్ధికి ఆమె ఒక ఎకరం (రూ.25 లక్షలు) అందించారు.

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో పీజీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్(Y20 నుంచి Y23 బ్యాచ్లు) థియరీ పరీక్షలను డిసెంబర్ 5 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రేపు గురువారంలోపు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు.

“దానా” తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ, గుడివాడలో ప్రయాణికులకు సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. ప్రయాణికులు 0866- 2576924, గుడివాడ 7815909462 హెల్ప్ డెస్క్ నంబర్లలో సంప్రదించవచ్చని సూచించింది.

అయోధ్యలో శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహా యాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ యాగాన్ని నవంబర్ 18 నుంచి జనవరి 1 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పాల్గొనే వారు తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు సెల్: 7780252277 సంప్రదించాలన్నారు.

ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ITI కళాశాలల్లో అడ్మిషన్ పొందేందుకు 8వ తరగతి పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని విజయవాడ ITI కాలేజీ ప్రిన్సిపల్ ఎం.కనకారావు తెలిపారు. https://www.iti.ap.gov.in/ వెబ్సైట్లో అడ్మిషన్లకు ఈ నెల 26లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఈ నెల 28న ప్రభుత్వ, 30న ప్రైవేట్ ITI కళాశాలల్లో అడ్మిషన్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో MBA&MCA చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ, 3వ సెమిస్టర్ థియరీ పరీక్షలను డిసెంబర్ 5 నుంచి నిర్వహిస్తామని KRU వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రేపు గురువారంలోపు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, పూర్తి వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవాలని వర్సిటీ తెలిపింది.

కృష్ణా: ‘దానా’ తుఫాన్ ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని తీరాల వెంబడి గంటకు 80-90కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. గడిచిన 6 గంటల్లో గంటకు 18 కి.మీ. వేగంతో తుఫాన్ కదులుతోందని పేర్కొంది. బుధవారం నుంచి 2 రోజుల పాటు సముద్రం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని APSDMA హెచ్చరించింది.

విజయవాడలోని ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ(APSDPS)లో 13 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కన్సల్టెంట్, అనలిస్ట్, అడ్వైజర్ తదితర పోస్టులకు అర్హులైన అభ్యర్థులు https://apsdpscareers.com/ వెబ్సైట్లో ఈ నెల 29లోపు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఆయా పోస్టుల విద్యార్హతలకై అభ్యర్థులు పైన ఇచ్చిన వెబ్సైట్ చూడవచ్చు.

విజయవాడ-గుంటూరు మధ్య ప్రయాణించే 2 మెము ఎక్స్ప్రెస్లకు అదనంగా 2 జనరల్ కోచ్లు జత చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.07783 విజయవాడ-గుంటూరు, నం.07788 గుంటూరు-విజయవాడ రైళ్లను ఈ నెల 23 నుంచి నవంబర్ 23 వరకు 2 అదనపు జనరల్ కోచ్లతో నడుపుతామన్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి ఏ.శ్రీధర్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
Sorry, no posts matched your criteria.