Krishna

News October 25, 2024

పెడన: పెళ్లి చేసుకున్న 18ఏళ్ల అమ్మాయి, 19ఏళ్ల అబ్బాయి

image

19ఏళ్ల అబ్బాయి, 18ఏళ్ల అమ్మాయి పెళ్లి చేసుకున్న ఘటన పెడనలో జరిగింది. గురువారం మండలంలోని నందిగామకు చెందిన ప్రేమికులు పెళ్లి చేసుకొని పెడన పోలీస్ స్టేషనుకు చేరుకున్నారు. చట్ట ప్రకారం వరుడికి 21 సం.లు ఉండవలసి ఉండగా 19 సం.లు కావడంతో పోలీసులు అంగీకరించలేదు. అమ్మాయి డిగ్రీ ఫస్టియర్ చదువుతుండగా, అతను ఇంటరుతో ఆపివేసినట్లు తెలిసింది. ఎస్ఐ ఇరువురు తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు.

News October 25, 2024

వంగవీటి రాధాకు MLC పదవి.?

image

TDP నేత వంగవీటి రాధాను MLC పదవి వరించనున్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ఆయనకు గుర్తింపు, గౌరవం ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. తాజాగా మంత్రి నారా లోకేశ్..రాధ ఇంటికి వెళ్లడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. గత 2పర్యాయాలు రాధకు MLA టికెట్ దక్కని నేపథ్యంలో MLC ఇవ్వాలని, ఈ మేరకు లోకేశ్ హామీ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై మీ COMMENT.

News October 25, 2024

నేటి నుంచి కృష్ణాజిల్లాలో పశుగణన : కలెక్టర్

image

ఈ నెల 25వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా పశు గణన చేపట్టనున్నట్టు కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఇందుకు సంబంధించిన గోడపత్రికలను గురువారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 25వ తేదీ నుంచి 2025 ఫిబ్రవరి 28వ తేదీ వరకు జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణ వార్డుల్లో పశు సంవర్ధక శాఖ సిబ్బందిచే పశుసంపద లెక్కింపు కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు.

News October 24, 2024

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టండి: మంత్రి

image

నిత్యం రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు బస్సు యజమానులు చర్యలు చేపట్టాలని రవాణా, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. విజయవాడలో నిర్వహించిన ప్రైవేటు ట్రావెల్స్ అసోసియేషన్ సమావేశంలో పలు అంశాలు, సమస్యలు, నూతన విధివిధానాలపై చర్చించారు. అనంతరం మంత్రి రోడ్డు ప్రమాదాల నివారణకు బస్సు యజమానులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

News October 24, 2024

వాసిరెడ్డి పద్మ రాజకీయ పయనమెటు.?

image

AP మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ YCPకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. బుధవారం రాజీనామా చేసిన సమయంలో ఆమె ఆ పార్టీ అధినేత జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అటు ఏ పార్టీలో చేరతారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆమె రాజకీయ పయనంపై జిల్లాలో చర్చ జరుగుతోంది. మరోవైపు, ఆమె జనసేనలో చేరతారనే ప్రచారం ఉంది. వాసిరెడ్డి పద్మ ఏ పార్టీలో చేరతారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News October 24, 2024

కృష్ణా: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

image

మత్స్యశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిన 3 డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఫిషరీస్, జువాలజీ అనుబంధ కోర్సులలో పీజీ చేసినవారు ఈ పోస్టులకు అర్హులు కాగా అభ్యర్థులు ఈ నెల 24లోపు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ నమూనా, విద్యార్హతల వివరాలకై https://fisheries.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చన్నారు. ఎంపికైన వారికి ప్రతి నెలా రూ.45 వేలు రెమ్యునరేషన్ కింద ఇస్తారు.

News October 24, 2024

సొంత చెల్లికి చెందాల్సిన ఆస్తులను జగన్ లాక్కున్నాడు: ఉమా

image

తన సొంత చెల్లి షర్మిలకు చట్టపక్రారం చెందాల్సిన ఆస్తులను జగన్ లాక్కున్నాడని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. ఆస్తులు లాక్కునేందుకు సెప్టెంబర్ 10న మాజీ సీఎం జగన్ హైదరాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)లో పిటిషన్లు దాఖలు చేశాడన్నారు. తల్లిపైనే కేసులు పెట్టి, చెల్లిని మోసం చేసే నైజం జగన్‌దని ఉమా ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.

News October 24, 2024

ముదినేపల్లి: సచివాలయ నిర్మాణానికి అరేకరం పొలం విరాళం

image

రాష్ట్ర సచివాలయ నిర్మాణానికి ముదినేపల్లికి చెందిన అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి అరేకరం పొలంను విరాళంగా అందించారు. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఆమె తండ్రి వైద్యులు మనోజ్‌తో కలిసి, దానికి సంబంధించిన నగదును అందించారు. అరేకరంకు సంబంధించిన రూ.12.5 లక్షలు, హైకోర్టు నిర్మాణానికి రూ.1 లక్ష విరాళంగా అందించారు. గతంలో అమరావతి అభివృద్ధికి ఆమె ఒక ఎకరం (రూ.25 లక్షలు) అందించారు.

News October 23, 2024

కృష్ణా: రేపటితో ముగియనున్న గడువు

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో పీజీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్(Y20 నుంచి Y23 బ్యాచ్‌లు) థియరీ పరీక్షలను డిసెంబర్ 5 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రేపు గురువారంలోపు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.

News October 23, 2024

కృష్ణా: “దానా” ప్రభావంతో రైళ్లు రద్దు

image

“దానా” తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ, గుడివాడలో ప్రయాణికులకు సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. ప్రయాణికులు 0866- 2576924, గుడివాడ 7815909462 హెల్ప్ డెస్క్ నంబర్లలో సంప్రదించవచ్చని సూచించింది.