India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
US ప్రెసిడెంట్ ఎన్నికలలో వైస్ ప్రెసిడెంట్గా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న JD వాన్స్ భార్య ఉష చిలుకూరి తల్లిదండ్రులు పామర్రుకు చెందినవారు. ఉష తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మీ అమెరికా వలస వెళ్లగా 3వ సంతానంగా ఉష జన్మించారు. కాలేజీ చదువు అనంతరం వాన్స్ను ప్రేమించిన ఉష హిందూ పద్ధతిలో వివాహం చేసుకుంది. ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే మన జిల్లా అమ్మాయి ఉష USకి మిసెస్ వైస్ ప్రెసిడెంట్ అవుతారు.
పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలం తాడంకి గ్రామంలో గండికోట రాంబాబు(34) మంగళవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. కర్రలతో తలపై కొట్టిన ఆనవాళ్లు కనిపించాయి. సంఘటనా ప్రదేశంలో మద్యం సీసా ఉండగా.. రాంబాబు తాపీ మేస్త్రిగా పని చేస్తారని తెలిపారు. ఈ విషయంపై పమిడిముక్కల పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
గంజాయి మత్తులో భార్య, కూతురిని చంపాలనుకున్న వ్యక్తిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. విజయవాడ పరిధిలోని కొత్తపేటలో ఉండే రాంపిళ్ల బాబీ(26) గంజాయికి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో తాగడానికి డబ్బు ఇవ్వాలంటూ భార్యను చున్నీతో మెడకు బిగించి చంపేస్తానని బెదిరించేవాడు. ఒకరోజు డబ్బు ఇవ్వలేదని చిన్నారిని భవనంపైకి తీసుకెళ్లి 2 కాళ్లు తిరగేసి వేలాడదీశాడు. ఈ ఘటనలపై నిందితుణ్ని అరెస్ట్ చేశారు.
అమరావతి ప్రాంతాన్ని చెన్నై-కోల్కతా జాతీయ రహదారితో అనుసంధానం చేసేలా ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) ప్రణాళికలు రూపొందించింది. రాజధానిలోని సీడ్ యాక్సిస్ రోడ్ E-11,13లను జాతీయ రహదారి (NH-16)తో కలిపేలా CRDA అధికారులు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తాజాగా సమాచారం వెలువడింది. కొండ అంచు నుంచి ఈ రోడ్లు నిర్మించేలా CRDA కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అమరావతి ప్రాంతాన్ని చెన్నై-కోల్కతా జాతీయ రహదారితో అనుసంధానం చేసేలా ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(APCRDA) ప్రణాళికలు రూపొందించింది. రాజధానిలోని సీడ్ యాక్సిస్ రోడ్ E-11,13లను జాతీయ రహదారి(NH-16)తో కలిపేలా CRDA అధికారులు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తాజాగా సమాచారం వెలువడింది. కొండ అంచు నుంచి ఈ రోడ్లు నిర్మించేలా CRDA కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
విజయవాడ డివిజన్ పరిధిలో ఇంజినీరింగ్ పనులు జరుగుతున్న కారణంగా విజయవాడ నుంచి హుబ్లీ వెళ్లే రైళ్లను రద్దు చేశామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆగస్టు 1 నుంచి 10 వరకు నం.17329 హుబ్లీ- విజయవాడ, నం.17330 విజయవాడ-హుబ్లీ డైలీ ఎక్స్ప్రెస్లను ఆగస్టు 2 నుంచి 11 వరకు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులు రైళ్ల రద్దు అంశాన్ని గమనించాలని సూచించారు.
విజయవాడ మీదుగా KSR బెంగుళూరు, భువనేశ్వర్ మధ్య ప్రయాణించే ప్రశాంతి ఎక్స్ప్రెస్లకు అదనంగా 2 జనరల్ కోచ్లు జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.18463/18464 ప్రశాంతి ఎక్స్ప్రెస్లు ప్రస్తుతం 2 జనరల్ కోచ్లతో నడుస్తుండగా 2 బోగీలు జతచేసి మొత్తంగా 4 జనరల్ కోచ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 18463 ట్రైన్కు నవంబర్ 14, 18464 ట్రైన్కు నవంబర్ 15 నుంచి 2 అదనపు జనరల్ కోచ్లు ఉంటాయన్నారు.
పౌర్ణమి గిరి ప్రదక్షిణకు అరుణాచలం వెళ్లే భక్తుల కోసం విజయవాడ నుంచి అరుణాచలానికి ఆర్టీసీ స్పెషల్ సూపర్ లగ్జరీ బస్సులు నడుపుతున్నామని సంస్థ అధికారులు తెలిపారు. జూలై 19న ఈ బస్సులు విజయవాడ, ఆటోనగర్ డిపోల నుంచి శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీపురం మీదుగా అరుణాచలం వెళతాయన్నారు. ఈ బస్సు టికెట్లను APSRTC అధికారిక వెబ్సైట్ https://www.apsrtconline.in/లో బుక్ చేసుకోవచ్చన్నారు.
రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల కౌన్సిలింగ్ను ఈనెల 22 నుంచి నిర్వహిస్తున్నట్లు అడ్మిషన్స్ కన్వీనర్ ఆచార్య అమరేంద్ర కుమార్ తెలిపారు. ఈ నెల 22, 23 తేదీల్లో నూజివీడు, ఇడుపులపాయలలో, 24, 25 తేదీల్లో ఒంగోలు అభ్యర్థులకు ఇడుపులపాయలోనూ, 26,27 తేదీల్లో శ్రీకాకుళం అభ్యర్థులకు శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామన్నారు.
ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా తిరునల్వేలి(TEN), షాలిమార్(SHM) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR) పేర్కొంది. నం.06087 TEN- SHM ట్రైన్ను జూలై 18, 25 తేదీలలో నం.06088 SHM- TEN ట్రైన్ను జూలై 20, 27 తేదీలలో నడపనున్నట్లు SCR తెలిపింది. ఈ ట్రైన్లు ఏపీలో విజయవాడతో పాటు విజయనగరం, దువ్వాడ, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు తదితర స్టేషన్లలో ఆగుతాయని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.