India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సింగపూర్ నుంచి చెన్నైకి వస్తున్న దీప్తి అనే మహిళ విమానంలోనే ప్రసవించి. బుధవారం రాత్రి ఆమె సింగపూర్ నుంచి చెన్నైకి బయలుచేరారు. మార్గమధ్యంలో అర్థరాత్రి పురిటినొప్పులు మొదలయ్యాయి. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న ఓ వైద్యురాలు, అక్కడున్న మహిళల సాయంతో క్షేమంగా దీప్తికి ప్రసవం చేశారు. అనంతరం ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు. విమానం చెన్నై చేరుకోగానే వైద్యబృందం తల్లి, బిడ్డను పరిశీలించి క్షేమంగా ఉన్నారన్నారు.

హత్యాయత్నం కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. గుణదలలో అరుణ్ కుమార్ అనే వ్యక్తిపై అదే ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు బుధవారం అర్ధరాత్రి దాడికి తెగబడ్డారన్నారు. ఈ ఘటనలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గంటల వ్యవధిలో నిందితులను అదుపులోకి తీసుకున్నమని చెప్పారు. విద్యాధర్, సుంకర చందు, అరుణ్, గణేశ్ అనే వ్యక్తులను అరెస్టు చేసి కత్తిని స్వాధీనం చేసుకున్నామన్నారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను వైసీపీ విజయవాడ లీగల్సెల్ న్యాయవాదులు గవాస్కర్, ఆదాం గురువారం కలిశారు. జగన్ నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వారు జగన్ను కలిసి ఎన్టీఆర్ జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను వివరించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం నమోదు చేస్తున్న కేసులపై దృష్టి సారించాలని జగన్ వారికి సూచించినట్లు సమాచారం.

* తిరువూరు: చిరంజీవి మూవీ చూసిన ఎమ్మెల్యే కొలకపూడి
* కంకిపాడుకు CM చంద్రబాబు రాక
* విజయవాడ: టీడీపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు
* విష ప్రచారం చేస్తున్నారు: ఎంపీ మిథున్ రెడ్డి
* విజయవాడ: బాలికతో ఉపాధ్యాయుని అసభ్య ప్రవర్తన
* విజయవాడ: పార్ట్ టైం జాబ్ పేరిట భారీ మోసం

న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి లోక్ ఆదాలత్లు దోహద పడతాయని కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారెక అన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 14వ తేదీన జిల్లాలో జాతీయ లోక్ ఆదాలత్ నిర్వహించనున్నట్టు తెలిపారు. రాజీ పడదగిన క్రిమినల్, సివిల్, రోడ్ యాక్సిడెంట్, చెక్ బౌన్స్ కేసులను లోక్ ఆదాలత్లో పరిష్కరిస్తారన్నారు.

ఈ నెల 24న CM చంద్రబాబు కంకిపాడుకు రానున్నారు. స్థానిక అయానా కన్వేన్షన్లో 2 రోజుల పాటు జరిగే క్రెడాయ్ సమావేశానికి హాజరుకానున్నారు. ఈనెల 25న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఈ సమావేశంలో హాజరుకానున్నారు. అలాగే ఈ నెల 28న ఇక్కడ జరిగే టీడీపీ సీనియర్ నేత గొట్టిపాటి రామకృష్ణ తనయురాలు వివాహ వేడుకకు మరో మారు చంద్రబాబు రానున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 23న అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే గ్రామసభలను విజయవంతం చేసేందుకు గ్రామ, మండల, ప్రత్యేక అధికారులు సమన్వయంతో కృషిచేయాలని కలెక్టర్ సృజన అధికారులను ఆదేశించారు. గ్రామసభల నిర్వహణపై కలెక్టర్ గురువారం ఉదయం క్యాంపు కార్యాలయం నుంచి పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, డ్వామా, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

జిల్లా పరిధిలోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సృజన ఆదేశించారు. గురువారం విజయవాడ కలెక్టరేట్లో జాతీయ రహదారులు, రైల్వేలకు సంబంధించి వివిధ ప్రాజెక్టుల భూ సేకరణ ప్రక్రియపై ఆమె సమావేశం నిర్వహించారు. భూ సేకరణ విస్తీర్ణం, అవార్డు పాస్ వివరాలు, ప్రక్రియ ఏ దశలో ఉందనే వివరాల ఆరా తీశారు.

అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదం దిగ్భ్రాంతి కలిగించిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇప్పటికే కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేశామన్నారు. కంపెనీ నుంచి బాధితులకు పరిహారం ఇప్పిస్తామని, ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందిస్తామన్నారు. ప్రతి బాధితుడికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

ఓ యువతి వద్ద రూ.5.53 లక్షలు దోచుకున్న నేరగాళ్లపై విజయవాడ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. రెడ్డిగూడేనికి చెందిన యువతికి గత నెల 9న పార్ట్ టైం జాబ్ ఉందంటూ మెసేజ్ వచ్చింది. అమృత్ అనే వ్యక్తి ఫోన్ చేసి లింక్ పంపించాడు. రిజిస్ట్రేషన్ చేసుకోగానే రూ.500 వచ్చాయి. ఆమె డబ్బులు చెల్లించిన ప్రతిసారీ అదనంగా వచ్చాయి. పలుమార్లు రూ.5.53 లక్షలు పంపింది. ఈ సారి డబ్బులు రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది.
Sorry, no posts matched your criteria.