India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) నిరుద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణ జులై 16 నుంచి 22 వరకు రోజుకు 2 గంటల పాటు ఇస్తామని తెలిపింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, పూర్తి వివరాలకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ http://engineering.apssdc.in/ అధికారిక వెబ్సైట్ చూడాలని సూచించింది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) నిరుద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణ జులై 16 నుంచి 22 వరకు రోజుకు 2 గంటల పాటు ఇస్తామని తెలిపింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, పూర్తి వివరాలకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ http://engineering.apssdc.in/ అధికారిక వెబ్సైట్ చూడాలని సూచించింది.
కృష్ణా జిల్లాలో రెగ్యులర్, ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సమస్యలపై రేపు సోమవారం సాయంత్రం 4.30 గంటలకు కలెక్టరేట్లో గ్రీవెన్స్ డే నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు వారి పరిధిలోని ఉద్యోగులకు ఈ విషయం తెలియజేయాలని కలెక్టర్ సూచించారు.
విజయవాడ మీదుగా సికింద్రాబాద్, గూడూరు మధ్య ప్రయాణించే సింహపురి ఎక్స్ప్రెస్లకు అదనంగా 2 జనరల్ కోచ్లు జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.12710/12709 సింహపురి ఎక్స్ప్రెస్ ప్రస్తుతం 2 జనరల్ కోచ్లతో నడుస్తుండగా 2 బోగీలు జతచేసి మొత్తంగా 4 జనరల్ కోచ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 12710 ట్రైన్ను నవంబర్ 8 నుంచి, 12709ట్రైన్ను నవంబర్ 9 నుంచి 2 అదనపు జనరల్ కోచ్లతో నడుపుతామన్నారు.
విజయవాడ, చెన్నై సెంట్రల్ మధ్య ప్రయాణించే పినాకిని ఎక్స్ప్రెస్లను ట్రాక్ మరమ్మతుల కారణంగా ఆరు రోజుల పాటు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆగస్టు 5 నుంచి 10 వరకు నం.12712 చెన్నై సెంట్రల్-విజయవాడ, నం.12711 విజయవాడ-చెన్నై సెంట్రల్ పినాకిని ఎక్స్ప్రెస్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులు రైళ్ల రద్దును గమనించాలని కోరారు.
మరో శ్వేతపత్రం విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు ఏపీ సీఎంఓ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు. పోలవరం, అమరావతి, విద్యుత్ శాఖపై ఇప్పటికే శ్వేతపత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం రేపు గత ప్రభుత్వ భూదందాలు, సహజవనరుల దోపిడీపై స్వయంగా సీఎం చంద్రబాబు వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు ఈ శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నారు.
*విజయవాడ రైల్వే డివిజన్పై CBI దృష్టి, * జగన్పై పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు, *ఎన్టీఆర్: అన్న హత్యకు తమ్ముడే సూత్రధారి, *విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు క్లోజ్, * కృష్ణా: ఉధృతంగా ప్రవహిస్తున్న కట్టలేరు వాగు, * కేతిరెడ్డి చెప్పిన మాట నిజం: పేర్ని నాని, *ఫారిన్ అమ్మాయితో..NTR జిల్లా అబ్బాయి పెళ్లి, , *ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటా: MP బాలశౌరి, *మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రి సిబ్బందిపై వేటు,
మాజీ మంత్రి దివంగత పర్వతనేని ఉపేంద్ర 88వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి పర్వతనేని ఫౌండేషన్ ఆదివారం ఆయన స్మారకార్థం అధునాతన ఆంబులెన్స్ అందజేసింది. ఈ మేరకు పర్వతనేని ఫౌండేషన్, లుగాంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు ఆదివారం సీఎం చంద్రబాబుకు అంబులెన్స్ను అందజేశారు. కాగా ఉపేంద్ర 1996-99 మధ్య విజయవాడ లోక్సభ సభ్యుడిగా పనిచేశారు.
రాజమండ్రిలో ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు జరిగిన ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో విజయవాడకు చెందిన యశ్వంత్ కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. అండర్-11 సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించాడు. యశ్వంత్ పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో శిక్షణ పొందుతున్నాడు. అనంతరం యశ్వంత్ను కోచ్ దామోదరరెడ్డి, భార్గవి, అసోసియేషన్ సభ్యులు అభినందించారు.
విజయవాడలోని కనకదుర్గమ్మ గుడి ఘాట్ రోడ్డును అధికారులు ముసివేశారు. వర్షాలకు కొండ చరియలు విరిగి పడుతుండటంతో ఘాట్ రోడ్డు మూసివేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
మహా మంటపం వైపు నుంచి ఆలయానికి చేరుకోవాలని భక్తులకు సూచించారు. ఆషాడం సారె సమర్పణకు వస్తున్న భక్తులతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
Sorry, no posts matched your criteria.