India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడ వన్ టౌన్ మెయిన్రోడ్లో విజయా కాంప్లెక్స్లోని కృష్ణ బ్యాంగిల్స్ షాప్లో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఫ్యాన్సీ సామగ్రి, పైపులు అగ్నికి ఆహుతయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణ బ్యాంగిల్స్ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగి మంటలు వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.
రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం త్రిబుల్ ఐటీలకు సంబంధించిన అడ్మిషన్లలో భాగంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఈనెల 11న ఉదయం 11 గంటలకు ఛాన్సలర్ ఆచార్య కేసిరెడ్డి విడుదల చేయనున్నట్లు ట్రిపుల్ ఐటీ వర్గాలు తెలిపాయి. నూజివీడు ట్రిపుల్ ఐటీలోని స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు.
హజ్ యాత్రను ముగించుకొని ఏపీకి తిరిగొచ్చిన యాత్రికులకు గన్నవరం విమానాశ్రయంలో మంత్రి ఎన్ఎండీ ఫరూక్ బుధవారం ఘనస్వాగతం పలికారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం తరపున అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. ప్రభుత్వం నుంచి లభించిన సహాయ సౌకర్యాలతో హజ్ యాత్ర ముగించుకుని స్వస్థలాలకు చేరుకున్నామని, ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నామని యాత్రికులు ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు.
జగన్ విధ్వంస పాలనలో వ్యవస్థలు కుదేలయ్యాయని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్వీట్ చేశారు. అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే చంద్రబాబు రాష్ట్రాన్ని అన్నివిధాలుగా గాడిలో పెట్టే పని మొదలుపెట్టారని ఉమ వ్యాఖ్యానించారు. సంపద సృష్టి ద్వారా టీడీపీ ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు ప్రణాళికలు చేపడుతోందని ఉమ ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) నిరుద్యోగులకు ఆన్లైన్లో సేల్స్ ఫోర్స్లో ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణ జూలై 15 నుంచి 30 వరకు రోజుకు 2 గంటలపాటు ఇస్తామని APSSDC పేర్కొంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, పూర్తి వివరాలకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హెల్ప్ లైన్ నంబరులో సంప్రదించాలని, అధికారిక వెబ్సైట్ చూడాలని సూచించింది.
ప్రయాణికుల రద్దీ మేరకు మచిలీపట్నం- నాగర్సోల్(నం.07169) మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ జులై 15న మధ్యాహ్నం 12.20 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి 16వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు నాగర్సోల్ చేరుకుంటుందన్నారు. ఏపీలో ఈ ట్రైన్ గుడివాడ, విజయవాడ, మంగళగిరి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్లలో ఆగుతుందని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
మండలంలోని బుధవాడ సిమెంటు కర్మాగారంలో బాయిలర్ పేలుడు ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. గత నాలుగు రోజుల నుంచి విజయవాడ మణిపాల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బానోతు స్వామి మృతి చెందినట్లు హాస్పటల్ సిబ్బంది వెల్లడించారు. మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అధికారులు బాధిత కుటుంబ సభ్యులకు తెలిపారు.
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (VMC) స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. తాజాగా ఈ కమిటీలో 6 పోస్టులకి ఎన్నిక జరగగా 6 స్థానాలలోనూ YCP కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. కాగా వీఎంసీలో వైసీపీకి 49 కార్పొరేటర్ల బలముండగా టీడీపీ నుంచి ఎన్నికైన కార్పొరేటర్లు 14 మంది ఉన్నారు. దీంతో అన్ని స్థానాలు వైసీపీ వశమయ్యాయి.
విజయవాడ నుంచి బిట్రగుంట మధ్య ప్రయాణించే మెమూ ఎక్స్ప్రెస్లను ట్రాఫిక్ నిర్వహణ కారణాల రీత్యా, కొద్దిరోజులపాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 29 నుంచి ఆగస్టు 4 వరకు నం.07977 బిట్రగుంట- విజయవాడ, నం.07978 విజయవాడ- బిట్రగుంట మెము ఎక్స్ప్రెస్ను ఈ నెల 29 నుంచి ఆగస్టు 2 వరకు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.
కిడ్నీ కొట్టేసిన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని హోం మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. విజయవాడలో కిడ్నీ రాకెట్ వార్తలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె మంగళవారం గుంటూరు కలెక్టర్, ఎస్పీ విజయవాడ సీపీతో ఫోన్లో మాట్లాడారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు నిఘా పెట్టాలని సూచించారు. బాధితుడి ఫిర్యాదుపై హోం మంత్రి ఆదేశాలతో పోలీసులు విచారణ ప్రారంభించారు.
Sorry, no posts matched your criteria.