India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రయాణికుల రద్దీ మేరకు ఉమ్మడి జిల్లా మీదుగా సంబల్పూర్(SBP), ఈరోడ్(ED) మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆగస్టు 21 నుంచి నవంబర్ 27 వరకు ప్రతి బుధవారం SBP- ED(నెం.08311), ఆగస్టు 23 నుంచి నవంబర్ 29 వరకు ప్రతి శుక్రవారం ED- SPB(నెం.08312) ట్రైన్లు నడుపుతున్నామన్నారు. కాగా ఈ రైళ్లు కృష్ణా జిల్లాలో కైకలూరు, గుడివాడ, విజయవాడతో పాటు ఏపీలో పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి.

2010 నాటి బాబ్లీ ప్రాజెక్టు కేసు విచారణ నిమిత్తం మహారాష్ట్రలోని బిలోలి కోర్టులో శనివారం మాజీ మంత్రి దేవినేని ఉమ హాజరయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ ఘటనలో అప్పటి సీఎం చంద్రబాబు సహా 16 మందికి న్యాయస్థానం నోటీసులిచ్చిందని ఉమ తెలిపారు. నేడు జరిగిన విచారణకు తెలంగాణ ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, హనుమంత్ షిండేలతో కోర్టు విచారణకు హాజరయ్యామని ఉమ స్పష్టం చేశారు.

కృష్ణా యూనివర్శిటీ పరిధిలోని కళాశాలల్లో ఇటీవల నిర్వహించిన ఎం-ఫార్మసీ కోర్సు పరీక్షల 1వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలకై అధికారిక వెబ్సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేయకూడదని డీసీపీ చక్రవర్తి స్పష్టం చేశారు. ఒకవేళ మార్పు చేస్తే వాహనదారుడితో పాటు మార్పు చేసిన మెకానిక్పై కూడా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయవాడలో ఆయన ద్విచక్ర వాహన మెకానిక్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా బైకుల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరిత్యా నేరమని తెలిపారు.

కృష్ణా జిల్లాలో అన్న క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి. తొలిరోజు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చి భోజనం చేశారు. ఇంతకీ ఈ క్యాంటీన్లలో మీరు భోజనం చేశారా? రుచి ఎలా ఉంది? ప్రజలకు ఉపయోగ పడే ప్రాంతాల్లో క్యాంటీన్లు పెట్టారా? ఇంకా ఎక్కడెక్కడ క్యాంటీన్లు పెట్టాలి? అనేది మీరు కామెంట్ చేయండి.

వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్ బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ ఈనెల 20కి వాయిదా వేసింది. ఏసీబీ కోర్టు న్యాయాధికారి హిమబిందు సెలవులో ఉండడంతో ఈ కేసును 12వ అదనపు జిల్లా కోర్టు శుక్రవారం విచారించింది. బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలుకు సమయం కావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరడంతో విచారణ వాయిదా పడింది.

కోల్కత్తాలో వైద్య విద్యార్థినిపై హత్యాచారాన్ని నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) వైద్య సేవల బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు సేవలు నిలిచిపోనున్నాయి. అత్యవసర వైద్య సేవలు మినహా మిగిలిన ఓపీ, ఐపీ, స్కానింగ్, రక్త, ఇతర పరీక్షలను 24 గంటలపాటు నిలిపివేయనున్నారు. గుడివాడ మెడికల్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు తెలిపింది.

పోలీసులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందించగలమని ఎస్పీ గంగాధర్ రావు అన్నారు. శుక్రవారం మచిలీపట్నంలోని పోలీస్ కల్యాణ మండపంలో సిబ్బంది & వారి కుటుంబ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరగకుండా ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

విజయవాడకు చెందిన పొట్లూరి అలేఖ్యచౌదరి, మందడంకు చెందిన సాంబశివరావు 11 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో అలేఖ్య తల్లిదండ్రులు పెళ్లికి అభ్యంతరం తెలిపారు. దీంతో ఇంట్లో తెలియకుండా ఆగస్టు 15న పెళ్లి చేసుకుని శ్రీవారి దర్శనార్థం శుక్రవారం తిరుపతి వస్తుండగా తిరుచానూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన తల్లిదండ్రులతో ప్రాణహాని ఉందని, తమకి రక్షణ కల్పించాలని అలేఖ్య వీడియో మెసేజ్ చేసింది.

NTR జిల్లా పోలీస్ కమిషనరేట్లో ఎస్ఐలను భారీగా బదిలీ చేస్తున్నట్లు పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. ఏలూరు రేంజ్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న 100 మంది సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. గత కొంతకాలంగా వీఆర్లో ఉన్నా ఎస్ఐలకు స్థానచలనం కల్పించారు. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని సీపీ పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.