India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విజయవాడ సింగ్ నగర్లోని రూప లక్ష్మీ సాయి బార్ అండ్ రెస్టారెంట్లో మద్యం సేవించి అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు నాగేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరి ఆయన ఢిల్లీ చేరుకుంటారు. రేపు కూడా ఆయన హస్తినలోనే ఉంటారు. ఈ పర్యటనలో చంద్రబాబు పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై వారితో చర్చించనున్నారు. అనంతరం శనివారం రాత్రి ఆయన ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.

గుడివాడ మునిసిపల్ పార్క్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరితో ఎన్టీఆర్ స్టేడియానికి చేరుకున్నారు. అనంతరం చంద్రబాబు దంపతులు అన్న క్యాంటీన్ను ప్రారంభించారు. అనంతరం వారు ఆ అన్నక్యాంటీన్లో భోజనం చేశారు.

గుడివాడలో అన్న క్యాంటీన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ భోజనం చేస్తున్న వారితో సీఎం చంద్రబాబు ముచ్చటించారు. అనంతరం వారికి మంచి భవిష్యత్తు చూపించాలని కలెక్టర్ డీకే బాలాజీని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి, రావి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ముఖ్యనాయకులు పాల్గొన్నారు.

పామర్రు పట్టణ పరిధిలోని సనాహుల్లా అనే వ్యక్తి మాంసం వ్యాపారం చేసుకుంటాడు. ఈ క్రమంలో అతను పామర్రు పట్టణ పరిధిలోని ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు యువకుడిపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ, పోక్సో యాక్ట్ కింద బుధవారం కేసు నమోదు చేశామని ఎస్సై అవినాశ్ తెలిపారు. ఈ కేసును గుడివాడ డీఎస్పీ శ్రీకాంత్ దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు.

వైసీపీని తమ పార్టీలో విలీనం చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల స్పందించారు. బుధవారం విజయవాడలో కాంగ్రెస్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పిల్ల కాలువలు ఎప్పటికైనా సముద్రంలో కలవాల్సిందేనని జోస్యం చెప్పారు. ఒకవేళ వారు కలుస్తామని అంటే స్వాగతిస్తామని పేర్కొన్నారు. వైసీపీ చీఫ్గా కాంగ్రెస్ చర్చలు జరిపిందనే ప్రచారం అబద్ధమన్నారు. జగన్ తిరిగి అధికారంలోకి రారని జోస్యం చెప్పారు.

తల్లి మరణాన్ని తట్టుకోలేక కుమార్తె ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన నూజివీడు పట్టణంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన ఏ.లక్ష్మి (38) ఇంటిలోని ఫ్యానుకు ఉరి వేసుకుని మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం.. ఇటీవల లక్ష్మీ తల్లి మృతి చెందడంతో తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

విజయవాడకు సీఎం చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం రానున్నారని ఆయన కార్యాలయం ప్రతినిధులు తెలిపారు. రేపు ఉదయం 8:40కు రోడ్డు మార్గంలో ఉండవల్లి నుంచి 8:55కు ఇందిరాగాంధీ స్టేడియంకు చేరుకుంటారన్నారు. అలాగే 10:56 కు ఇందిరాగాంధీ స్టేడియం నుంచి ఉండవల్లి స్వగృహానికి చేరుకుంటారన్నారు. అలాగే 12:10 కి ఉండవల్లి హెలీప్యాడ్ ద్వారా గుడివాడ వెళ్లి అన్న క్యాంటీన్ను ప్రారంభిస్తారని తెలిపారు.

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి హైకోర్టులో ఊరట దక్కింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం ఈనెల 20 వరకు ఆయనపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని, కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా వంశీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. ఓటమి తర్వాత విదేశాలకు వెళ్లిన వంశీ అమెరికాలో గ్రీన్ కార్డు కోసం అప్లై చేసినట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.