Krishna

News July 7, 2024

అమరావతిలో ORR విశేషాలు ఇలా.!

image

ఉమ్మడి గుంటూరు జిల్లా CRDA పరిధిలో 189 KM పొడవున ORR నిర్మాణం జరగనుంది. 150 మీటర్ల వెడల్పుతో 2 వైపులా సర్వీస్‌ రోడ్లు కాకుండా 6 వరుసల యాక్సెస్‌ కంట్రోల్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మిస్తారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో నిర్మాణం పూర్తయితే కంచికచర్ల, వీరులపాడు, జి.కొండూరు, మైలవరం, ఆగిరిపల్లి, బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, తోట్లవల్లూరు కలిపి 10 మండలాల్లోని 49 గ్రామాల మీదుగా ORR వెళ్తుంది.

News July 7, 2024

కృష్ణా: సైకిల్‌ పంపుతో దాడిచేసి హత్య.!

image

బంటుమిల్లి మండలం జానకిరామపురం వ్యాపారి చిగురుశెట్టి సుభాశ్ (42) శుక్రవారం రాత్రి హత్యకు గురయ్యారు. DSP తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి నారాయణపురంలో ఆటోలో ఉల్లి డెలివరీ చేసేందుకు వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు గాలికొట్టే పంపుతో దాడి చేసినట్లు తెలిపారు. దీనిని ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఆటోను పక్కనున్న పంట బోదెలోకి తోసేశారు. దర్యాప్తు చేస్తున్నామని మచిలీపట్నం DSP సుభాని తెలిపారు.

News July 7, 2024

గుడివాడలో అర్ధరాత్రి నగ్నంగా క్షుద్రపూజల కలకలం

image

గుడివాడ పరిధిలోని రాజేంద్రనగర్‌లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు నగ్నంగా ఇద్దరు మంత్రగాళ్లు క్షుద్రపూజలు చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గుడివాడ పరిధిలోని ఓ భవనంలో అఘోరాలను పోలిన ఇద్దరు తాంత్రికులు పూజలు చేపట్టినట్లు స్థానికులు తెలిపారు. క్షుద్రపూజలపై గుడివాడ వన్‌టౌన్‌ పోలీసులకు సమాచారం అందగా పరిశీలిస్తున్నామని SI గౌతమ్‌ తెలిపారు.

News July 7, 2024

పెనుగంచిప్రోలు తిరుపతమ్మ హుండీల లెక్కింపు

image

పెనుగంచిప్రోలులో కొలువైన శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో శనివారం హుండీలను లెక్కించారు. 97రోజులకు గాను అమ్మవారి సాధారణ ఖాతా, అన్నదాన ట్రస్ట్ ద్వారా రూ.1,64,77,583 నగదు లభించినట్లు కార్యనిర్వాహణాధికారి రమేశ్ నాయుడు తెలిపారు. నగదుతో పాటు 0.83 గ్రాముల బంగారం, 1.850 గ్రాముల వెండి సమకూరిందన్నారు. కార్యక్రమంలో పాలకమండలి ఛైర్మన్ శ్రీనివాసరావు, సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. 

News July 6, 2024

దేశానికి, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురండి: రాంప్రసాద్ రెడ్డి 

image

పారిస్ ఒలింపిక్స్‌కు రాష్ట్రం నుంచి 7మంది క్రీడాకారులు అర్హత సాధించినట్లు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సింధు, సాత్విక్ సాయిరాజ్(బ్యాడ్మింటన్), ధీరజ్ (ఆర్చరీ), జ్యోతి, జ్యోతికశ్రీ(అథ్లెటిక్స్), నారాయణ (పారా రోయింగ్), ఆర్షద్ (పారా సైక్లింగ్)లు ఉన్నారు. వారిని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అభినందించి దేశానికి, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తేవాలన్నారు.  

News July 6, 2024

కృష్ణా: ప్రేమ వ్యవహారంతో.. సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్య

image

ప్రేమ వ్యవహారంలో తల్లిదండ్రులు మందలించారని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కానూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆజాద్‌ (23) అస్సాం రాష్ట్రం ననత్‌బస్తి పట్టణ నివాసి. ఇతని కుటుంబం మూడేళ్ల క్రితం కానూరు వచ్చి స్థిరపడ్డారు. హుస్సేన్‌ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ యువతిని ప్రేమించాడు. గుర్తించిన తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.

News July 6, 2024

అథ్లెట్లకు CM చంద్రబాబు అభినందనలు

image

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు అథ్లెట్లు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధి ఏవీ రాఘవేంద్ర పేర్కొన్నారు. పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో వై జ్యోతి, జ్యోతిక శ్రీలు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. వీరిని నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్ ఉన్నారు.

News July 6, 2024

కృష్ణా: గ్రేట్.. ఆస్పత్రి నిర్మాణానికి రూ. 4.5 కోట్ల విరాళం

image

పెనమలూరు నియోజకవర్గం యనమలకుదురు వాసుల కల ఓ దాత సాయంతో నెరవేరనుంది. ఇప్పటివరకు ఇక్కడి పేదలకు ఉచిత వైద్యం అందుబాటులో లేక పక్కనున్న పెనమలూరు PHCకి వెళ్లేవారు. ఈ ఆసుపత్రి నిర్మాణానికి నిధులు, స్థలం వంటి అడ్డంకులే కారణం. కాగా వెలగపూడి ఉమామహేశ్వరరావు జ్ఞాపకార్థం వెలగపూడి ట్రస్టు నిర్వాహకురాలు విజయలక్ష్మి రూ.4.5 కోట్ల విరాళం ఇవ్వడంతో నిర్మాణం పూర్తి చేశారు. కాగా నేడు ఈ ఆసుపత్రిని ప్రారంభించనున్నారు.

News July 6, 2024

ఎన్టీఆర్ జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చిన గోదావరి జలాలు

image

పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా విడుదల చేసిన గోదావరి జలాలు శుక్రవారం పోలవరం కాలువ ద్వారా ఎన్టీఆర్ జిల్లాకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం ఫెర్రీఘాట్‌ వద్ద కృష్ణా నదిని తాకడానికి ప్రవహిస్తున్న నీరు, జక్కంపూడి సమీపంలో కొండల మధ్య ఇలా ప్రవహిస్తున్నాయి. కాగా పట్టిసీమ ఎత్తిపోతల వద్ద 16 పంపుల ద్వారా 5,664 క్యూసెక్కుల నీరు పోలవరం కుడి కాలువలోకి విడుదల చేసిన విషయం తెలిసిందే.

News July 6, 2024

ముదినేపల్లి: కత్తిదాడి ఘటనలో మహిళ మృతి

image

ముదినేపల్లి మండలం చిగురుకోటలో నడకదారిలో మురుగునీటి విషయమై ఈ నెల 3న <<13559596>>కత్తులతో దాడి చేసిన ఘటన<<>>లో, తీవ్ర గాయాలకు గురై అపస్మారక స్థితిలో ఉన్న పరసాదేవి (32) అనే మహిళ శుక్రవారం చనిపోయింది. ఈ ఘటనలో పరసా వెంకట బాలాజీ, అతని భార్య దేవిపై బాలాజీ తమ్ముడు సురేశ్, అతని భార్య అనిత కత్తితో దాడి చేసిన విషయం విదితమే. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దేవి శుక్రవారం మృతి చెందిందని SI వెంకట్‌ తెలిపారు.

error: Content is protected !!