India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కృష్ణా: రాష్ట్రంలో కిడ్నీ బాధితుల వివరాలు మండలాలవారీగా సేకరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సోమవారం వైద్యశాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన ఈ మేరకు ఆదేశాలిచ్చారు. కిడ్నీ సమస్యలకు కారణాలు, కిడ్నీ రోగులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో నీటిపై అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. కాగా జిల్లాలోని ఏ.కొండూరు తదితర ప్రాంతాల్లో సైతం కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారు.

ఎన్టీఆర్: వైసీపీ పాలకులు వేల కోట్ల రూపాయల కేంద్ర నిధులు నిర్వీర్యం చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్వీట్ చేశారు. జల్ జీవన్ మిషన్ పథకం కింద కేంద్రం రూ.16,483 కోట్లు ఇస్తే, జగన్ తన అసమర్థతతో 20% కూడా ఖర్చు పెట్టలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన తాగునీరు ఇవ్వకుండానే జగన్ తన అవినీతితో అస్మదీయుల జేబులు నింపారని ఉమ ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.

పారిశ్రామికాభివృద్ధికి సంబంధించి దేశంలో టాప్-5 రాష్ట్రాలతో పోటీ పడే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన పారిశ్రామికాభివృద్ధి విధానం ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నూతన పారిశ్రామిక విధానం రూపకల్పనలో నీతి ఆయోగ్ ఆలోచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు.

గుంటూరుకు చెందిన రావి మస్తాన్ సాయి అనే యువకుడిని డ్రగ్స్ కేసులో విజయవాడ సెబ్ పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. నిందితుడు డిల్లీ నుంచి డ్రగ్స్ తెప్పించి రెండు తెలుగు రాష్ట్రాల్లో సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన విజయవాడ పశ్చిమ సెబ్ పోలీసులు గుంటూరు వచ్చినట్లు తెలియటంతో సెబ్ పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.

ప్రయాణికుల రద్దీ మేరకు ఈ నెల 14,15న విజయవాడ మీదుగా నాందేడ్(NED), శ్రీకాకుళం(CHE) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.07487 ఆగస్టు 14న NED-CHE, 15న CHE- NED మధ్య ఈ రైళ్లు నడుపుతామన్నారు. ఏపీలో ఈ రైళ్లు విజయవాడతో పాటు విజయనగరం, దువ్వాడ, అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. గతంలో ముందస్తు బెయిల్ పిటిషన్ను విచారించిన న్యాయమూర్తి వద్దకే ఈ పిటిషన్ వెళ్లాలని హైకోర్టుకు పోలీసుల తరఫు లాయర్ అశ్వినీకుమార్ సూచించారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి నిశితంగా పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తి వెల్లడించారు. అనంతరం కేసు తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది.

వచ్చే ఐదేళ్లలో రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్గా తయారు చేస్తామని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. సోమవారం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో శాప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హబ్గా చేసేందుకు అవసరమైన అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. క్రీడాకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు. గత ప్రభుత్వం క్రీడలను పూర్తిగా విస్మరించదని ఆరోపించారు.

ఎయిడ్స్ వ్యాధి పట్ల పూర్తి అవగాహన కల్పించి వ్యాధిని నివారించేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. మొగల్రాజపురం సిద్ధార్థ కళాశాలలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. క్రమశిక్షణా జీవితమే ఎయిడ్స్ వ్యాధి రక్షణకు ఏకైక మార్గమన్నారు. వ్యాధి బారిన పడిన వారి పట్ల వివక్షత చూపకుండా మనోధైర్యాన్ని నింపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

సీఎం చంద్రబాబు ఆగస్టు 15న ఉయ్యూరులో పర్యటించనున్నారు. 15వ తేదీన సాయంత్రం 6.30 గంటలకు సీఎం చంద్రబాబు ఉయ్యూరులో అన్న క్యాంటీన్ను ప్రారంభించనున్నట్లు తాజాగా సమాచారం వెలువడింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతలో ఆగస్టు 15న 100 అన్న క్యాంటీన్లను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి పదవిని భర్తీ చేసేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. కాగా ఈ పదవికి విజయవాడ పశ్చిమ MLA సుజనా చౌదరి పేరు సైతం వినిపిస్తోంది. గతంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేయడంతో సుజనా ఈ పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్ ర్యాంక్తో కూడిన కీలకమైన ఈ పదవిలో CM చంద్రబాబు ఎవరిని నియమిస్తారో త్వరలో తెలియనుంది.
Sorry, no posts matched your criteria.