India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రయాణికుల రద్దీ మేరకు మచిలీపట్నం- నాగర్సోల్(నం.07169) మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ జులై 15న మధ్యాహ్నం 12.20 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి 16వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు నాగర్సోల్ చేరుకుంటుందన్నారు. ఏపీలో ఈ ట్రైన్ గుడివాడ, విజయవాడ, మంగళగిరి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్లలో ఆగుతుందని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
మండలంలోని బుధవాడ సిమెంటు కర్మాగారంలో బాయిలర్ పేలుడు ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. గత నాలుగు రోజుల నుంచి విజయవాడ మణిపాల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బానోతు స్వామి మృతి చెందినట్లు హాస్పటల్ సిబ్బంది వెల్లడించారు. మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అధికారులు బాధిత కుటుంబ సభ్యులకు తెలిపారు.
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (VMC) స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. తాజాగా ఈ కమిటీలో 6 పోస్టులకి ఎన్నిక జరగగా 6 స్థానాలలోనూ YCP కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. కాగా వీఎంసీలో వైసీపీకి 49 కార్పొరేటర్ల బలముండగా టీడీపీ నుంచి ఎన్నికైన కార్పొరేటర్లు 14 మంది ఉన్నారు. దీంతో అన్ని స్థానాలు వైసీపీ వశమయ్యాయి.
విజయవాడ నుంచి బిట్రగుంట మధ్య ప్రయాణించే మెమూ ఎక్స్ప్రెస్లను ట్రాఫిక్ నిర్వహణ కారణాల రీత్యా, కొద్దిరోజులపాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 29 నుంచి ఆగస్టు 4 వరకు నం.07977 బిట్రగుంట- విజయవాడ, నం.07978 విజయవాడ- బిట్రగుంట మెము ఎక్స్ప్రెస్ను ఈ నెల 29 నుంచి ఆగస్టు 2 వరకు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.
కిడ్నీ కొట్టేసిన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని హోం మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. విజయవాడలో కిడ్నీ రాకెట్ వార్తలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె మంగళవారం గుంటూరు కలెక్టర్, ఎస్పీ విజయవాడ సీపీతో ఫోన్లో మాట్లాడారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు నిఘా పెట్టాలని సూచించారు. బాధితుడి ఫిర్యాదుపై హోం మంత్రి ఆదేశాలతో పోలీసులు విచారణ ప్రారంభించారు.
జగ్గయ్యపేట పరిధి బూదవాడలోని సిమెంట్ ఫ్యాక్టరీ బాయిలర్ పేలుడు ఘటనలో క్షతగాత్రులైన ఐదుగురు కార్మికుల ఆరోగ్య పరిస్థితి, విషమంగా ఉందని DMHO సుహాసిని తెలిపారు. తీవ్రగాయాలైన అర్జున్, గుగులోతు స్వామి, గోపి, సైదా, శ్రీమన్నారాయణలకు ప్రస్తుతం చికిత్స అందుతోందని ఆమె తెలిపారు. ఈ ఘటనలో గాయపడినవారిలో 10 మంది కోలుకున్నారని, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న కార్మికులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారన్నారు.
విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టాకు మరికొద్దిసేపట్లో అధికారులు సాగునీటిని విడుదల చేయనున్నారు. పోలవరం కుడి కాలువ (పట్టిసీమ) ద్వారా గోదావరి జలాలు కృష్ణా నదికి చేరుకోవటంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద 11.01 అడుగుల మేర నీటి నిల్వలు చేరాయి. దీంతో గోదావరి జలాలను మరికాసేపట్లో మంత్రులు నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర విడుదల చేయనున్నారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. విజయవాడ కృష్ణలంకకు చెందిన పవన్ కుమార్, భాగ్యరాజ్, సుధాకర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు మంగళగిరి గ్రామీణ పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరికొందరిని అతి త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
రాష్ట్రానికి చెందిన బాస్కెట్ బాల్ ఆటగాడు కె ద్వారకానాథ్ రెడ్డి సౌత్ ఏషియన్ బాస్కెట్ బాల్ ఛాంపియన్షిప్లో ఆడే భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఈ మేరకు రాష్ట్ర బాస్కెట్ బాల్ సంఘ ప్రధాన కార్యదర్శి జి చక్రవర్తి తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. కొలంబోలో (శ్రీలంక) నేటి నుంచి 13వ తేదీ వరకు జరిగే సౌత్ ఏషియన్ బాస్కెట్ బాల్ ఛాంపియన్షిప్లో ద్వారకానాథ్ రెడ్డి భారత్ తరఫున ఆడతారని చక్రవర్తి చెప్పారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాల పట్ల నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకునేలా చూడాలని, ఇందుకోసం వివిధ కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం అధికారులకు సూచించారు. అగ్నివీర్ పథకంలో భాగంగా అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో.. వాయుసేనకు చెందిన నాన్ కమిషన్ ఆఫీసర్ సందీప్, జిల్లా ఉపాధి కల్పనాధికారి డి విక్టర్ బాబు కలెక్టర్కు వివరాలు తెలియజేశారు.
Sorry, no posts matched your criteria.