Krishna

News October 12, 2024

కృష్ణా: ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే

image

దసరా ఉత్సవాల కోసం విజయవాడ(BZA) నుంచి శ్రీకాకుళం రోడ్(CHE) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను ఈ నెల 17 వరకు పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 12,14,15,16,17 తేదీల్లో BZA-CHE(నం.07215) మధ్య, 12,13,15,16,17 తేదీల్లో CHE-BZA(నం.07216) రైళ్లు నడుపుతామన్నారు. విజయవాడలో ఈ రైళ్లు పై తేదీల్లో రాత్రి 8 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 5.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటాయన్నారు.

News October 11, 2024

కృష్ణా: విమాన ప్రయాణికులకు శుభవార్త

image

విశాఖపట్నం నుంచి విజయవాడకు రాకపోకలు సాగించే ప్రయాణికుల సౌకర్యార్థం అక్టోబర్ 27న కొత్త విమాన సర్వీసును ప్రవేశపెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశాయి. ఏపీ ఎయిర్‌ ప్యాసింజర్స్‌ అసోసియేషన్‌ అభ్యర్థన మేరకు ఈ నెల 27 నుంచి ఈ నగరాల మధ్య అదనపు విమాన సర్వీసును అందుబాటులోకి తెస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు. ప్రస్తుతం విశాఖ నుంచి విజయవాడకు నేరుగా ఒక విమానం మాత్రమే అందుబాటులో ఉంది.

News October 11, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

ప్రయాణికుల రద్దీ మేరకు ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా సంబల్‌పూర్(SBP), ఈరోడ్(ED) మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ స్పెషల్ ట్రైన్స్ నవంబర్ 27 వరకు ప్రతి బుధవారం SBP-ED(నం.08311), నవంబర్ 29 వరకు ప్రతి శుక్రవారం ED-SPB(నం.08312) మధ్య నడుపుతున్నామన్నారు. కాగా ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కైకలూరు, గుడివాడ, విజయవాడతో పాటు ఏపీలో పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి.

News October 11, 2024

ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు పోలీసుల హెచ్చరికలు

image

కొరియర్ పేరిట మోసగాళ్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌పై స్పందించవద్దని ఎన్టీఆర్ జిల్లా ప్రజలను పోలీసులు హెచ్చరించారు. అనుమానాస్పద పార్సిల్ వచ్చిందంటూ సైబర్ నేరగాళ్లు..ప్రజల బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేస్తున్న ఘటనలు జరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని పోలీస్ యంత్రాంగం సూచించింది. ఈ విధమైన ఫోన్ కాల్స్ ప్రభావానికి గురి కావొద్దని, సైబర్ మోసానికి గురైతే వెంటనే సమీపంలోని పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయాలని కోరింది.

News October 11, 2024

కృష్ణా: డిగ్రీ పరీక్షల టైంటేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో బీకామ్ జనరల్ & కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్స్ చదివే విద్యార్థులు రాయాల్సిన 1,3వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 1వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 23 వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని, 3వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 24 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News October 11, 2024

ప్రభుత్వ జోక్యంతో ధరలు అదుపులోకి వచ్చాయి: మంత్రి కొల్లు

image

రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై ఉల్లి, టమాటో అందిస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం ట్వీట్ చేశారు. అన్ని రైతుబజార్లలో సబ్సిడీపై కిలో టమాటో రూ.40, కిలో ఉల్లి రూ.35కి అందజేస్తున్నామని కొల్లు తెలిపారు. అధిక ధరలకు ప్రభుత్వం కూరగాయలు అమ్ముతోందన్న ప్రచారం అవాస్తవమని, ప్రభుత్వ జోక్యంతో ఉల్లి, టమాటో ధరలు అదుపులోకి వచ్చాయని కొల్లు ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.

News October 11, 2024

హైదరాబాద్-విజయవాడ హైవేపై బారులు తీరిన వాహనాలు

image

దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఏపీ వచ్చే వాహనాలు జాతీయ రహదారిపై బారులు తీరాయి. దీంతో జాతీయ రహదారిపై టోల్ గేట్‌ల వద్ద అదనపు బూత్‌లు ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. వాహనాల రద్దీ పెరగడంతో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని జగ్గయ్యపేట నుంచి గన్నవరం వరకు విస్తరించి ఉన్న జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఎక్కువగా ఉంటోంది.

News October 11, 2024

కైకలూరులో రికార్డ్ స్థాయిలో ధరలు.. KG రూ.400

image

కైకలూరులో రికార్డు స్థాయిలో వెల్లుల్లి ధర పలుకుతోంది. అటు NTR జిల్లాలో కూడా భారీగా పెరిగాయి. ఇప్పటికే ఉల్లి, టమాటాలు సెంచరీకి దగ్గరలో ఉండగా.. వాటికి వెల్లుల్లి తోడయింది. ప్రస్తుతం వెల్లుల్లి కిలో రూ.400 పలుకుతోందని వినియోగదారులు, వ్యాపారస్థులు చెబుతున్నారు. ఇప్పటికే పలు నిత్యావసర సరుకులు ప్రభుత్వం తక్కువ ధరలకు ఇచ్చే ఏర్పాట్లు చేయగా.. వాటిలో వెల్లుల్లిని చేర్చాలంటున్నారు.

News October 11, 2024

ఇంద్రకీలాద్రిపై మహిషాసుర మర్దినిగా అమ్మవారు

image

ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు అమ్మవారు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. కొలిచిన వారికి కొంగుబంగారమై నిలుస్తూ భక్తుల కోరికలు నెరవేర్చే అమ్మవారిని నేడు దర్శించుకుంటే సకల శుభాలు జరుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నేటి తెల్లవారుజాము నుంచే ఆలయ పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

News October 11, 2024

కృష్ణా: BBA పరీక్షల టైంటేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో BBA కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 1, 3వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 1వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 23 వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. 3వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 24 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.