Krishna

News July 8, 2024

కృష్ణా: కైకలూరులో మాజీ ఎమ్మెల్యేపై ఫ్లెక్సీల కలకలం

image

కైకలూరు మాజీ MLA దూలం నాగేశ్వరరావు 2019 నుంచి 2024 వరకు చేసిన అరాచకాలు అంటూ.. మంగళవారం పలుచోట్ల ఫ్లెక్సీలు కలకలం రేపాయి. నాగేశ్వరావు ఐదేళ్ల పాలనలో అనేక అక్రమాలు, ఆక్రమణలు, దౌర్జన్యాలు చేశారంటూ పట్టణంలోని నాలుగు ప్రధాన కూడళ్లలో ప్లెక్సీ ఏర్పటు చేశారు. ఎమ్మెల్యే బాధితుల సంఘం అధ్యక్షుడు అంటూ వరప్రసాద్(బాబి) పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.

News July 8, 2024

విజయవాడ: ఆర్‌ఐని సస్పెండ్ చేసిన సీపీ

image

పోలీసు సిబ్బందిపై అనుచితంగా వ్యవహరిస్తున్న ఆర్‌ఐ శ్రీనివాసరావును విజయవాడ కమిషనర్ రామకృష్ణ ఆదివారం సస్పెండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా సిటీ సెక్యూరిటీ వింగ్‌లో ఆర్‌ఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు తన క్రింది మహిళా సిబ్బంది పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై విచారించి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని చెప్పారు.

News July 8, 2024

జగ్గయ్యపేట: సిమెంట్ కర్మాగారంలో ప్రమాదం.. ఐదుగురిని కాపాడిన యువకుడు

image

జగ్గయ్యపేటలోని ఓ సిమెంట్ కర్మాగారంలో ఆదివారం ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద ఘటనలో ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన హేమంత్ కుమార్ ఐదుగురి ప్రాణాలు కాపాడారు. ఆయన మాట్లాడుతూ.. ప్రమాదం సమయంలో 4వ అంతస్తులో పనిచేస్తున్నాని, కంగారులో పై అంతస్తులోని వారు కిందకు దిగుతుంటే వేడి తగ్గేవరకు ఇక్కడే ఉండాలని వారిని నిలువరించానన్నారు. కంగారులో కొందరు కిందకు వెళ్లడంతో వేడి సిమెంట్ ధూళి పడి గాయపడ్డారని చెప్పాడు.

News July 8, 2024

విజ‌య‌వాడ‌: ముగిసిన UPSC EPFO, ESICప‌రీక్ష‌లు

image

విజ‌య‌వాడ‌లో ఆదివారం యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించిన EPFO ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్‌, ESIC న‌ర్సింగ్ ఆఫీస‌ర్ ప‌రీక్ష‌లు ప్ర‌శాంతంగా ముగిసిన‌ట్లు క‌లెక్ట‌ర్ సృజ‌న తెలిపారు. EPFO ప‌రీక్ష‌కు సంబంధించి 2,401 మందికి, ESIC ప‌రీక్ష‌కు 5,433 మంది అభ్య‌ర్థులకు విజయవాడలో ఏర్పాటు చేసిన 25 ప‌రీక్షా కేంద్రాలను క‌లెక్ట‌ర్ సృజ‌న పరిశీలించారు. 

News July 7, 2024

విజయవాడ: క్షతగాత్రులను పరామర్శించిన కలెక్టర్ సృజన

image

జగ్గయ్యపేట మండలం, బూదవాడ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన సంఘటనలో పలువురు గాయపడి విజయవాడలోని మణిపాల్, గొల్లపూడి ఆంధ్రా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులను జిల్లా కలెక్టర్ సృజన పరామర్శించి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు.

News July 7, 2024

గంపలగూడెం: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

మండలంలోని పెనుగొలను గ్రామంలో ఓ వ్యభిచార గృహంపై శనివారం సాయంత్రం పోలీసులు దాడులు చేశారు. తిరువూరు సీఐ అబ్దుల్ తెలిపిన వివరాల ప్రకారం.. పెనుగొలనులోని ఓ వ్యభిచార గృహంపై చేసిన దాడుల్లో అదే గ్రామానికి చెందిన ఒక మహిళను, ఐదుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు.

News July 7, 2024

గంపలగూడెం: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

మండలంలోని పెనుగొలను గ్రామంలో ఓ వ్యభిచార గృహంపై శనివారం సాయంత్రం పోలీసులు దాడులు చేశారు. తిరువూరు సీఐ అబ్దుల్ తెలిపిన వివరాల ప్రకారం.. పెనుగొలనులోని ఓ వ్యభిచార గృహంపై చేసిన దాడుల్లో అదే గ్రామానికి చెందిన ఒక మహిళను, ఐదుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు.

News July 7, 2024

అమరావతిలో ORR విశేషాలు ఇలా.!

image

ఉమ్మడి గుంటూరు జిల్లా CRDA పరిధిలో 189 KM పొడవున ORR నిర్మాణం జరగనుంది. 150 మీటర్ల వెడల్పుతో 2 వైపులా సర్వీస్‌ రోడ్లు కాకుండా 6 వరుసల యాక్సెస్‌ కంట్రోల్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మిస్తారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో నిర్మాణం పూర్తయితే కంచికచర్ల, వీరులపాడు, జి.కొండూరు, మైలవరం, ఆగిరిపల్లి, బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, తోట్లవల్లూరు కలిపి 10 మండలాల్లోని 49 గ్రామాల మీదుగా ORR వెళ్తుంది.

News July 7, 2024

కృష్ణా: సైకిల్‌ పంపుతో దాడిచేసి హత్య.!

image

బంటుమిల్లి మండలం జానకిరామపురం వ్యాపారి చిగురుశెట్టి సుభాశ్ (42) శుక్రవారం రాత్రి హత్యకు గురయ్యారు. DSP తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి నారాయణపురంలో ఆటోలో ఉల్లి డెలివరీ చేసేందుకు వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు గాలికొట్టే పంపుతో దాడి చేసినట్లు తెలిపారు. దీనిని ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఆటోను పక్కనున్న పంట బోదెలోకి తోసేశారు. దర్యాప్తు చేస్తున్నామని మచిలీపట్నం DSP సుభాని తెలిపారు.

News July 7, 2024

గుడివాడలో అర్ధరాత్రి నగ్నంగా క్షుద్రపూజల కలకలం

image

గుడివాడ పరిధిలోని రాజేంద్రనగర్‌లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు నగ్నంగా ఇద్దరు మంత్రగాళ్లు క్షుద్రపూజలు చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గుడివాడ పరిధిలోని ఓ భవనంలో అఘోరాలను పోలిన ఇద్దరు తాంత్రికులు పూజలు చేపట్టినట్లు స్థానికులు తెలిపారు. క్షుద్రపూజలపై గుడివాడ వన్‌టౌన్‌ పోలీసులకు సమాచారం అందగా పరిశీలిస్తున్నామని SI గౌతమ్‌ తెలిపారు.