Krishna

News July 19, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని బోధనా సిబ్బందికి 23న డెమో

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాసంస్థల్లో పార్ట్‌టైమ్ గెస్ట్ ఉపాధ్యాయ/అధ్యాపక ఉద్యోగాల భర్తీకి ఈనెల 23న డెమో నిర్వహించనున్నట్లు జిల్లా సమన్వయ అధికారిణి ప్రేమావతి తెలిపారు. విజయవాడలోని ప్రభుత్వ అతిథిగృహంలో ఈ డెమో జరగనున్నట్లు ఆమె చెప్పారు. ఈ ఉద్యోగాలకు బీఈడీ, పీజీ, టెట్ పూర్తిచేసిన వారు అర్హులన్నారు.

News July 19, 2024

విజయవాడ: ఇన్ స్ట్రా గ్రామ్‌లో ప్రేమ.. బాలిక అదృశ్యం

image

ఇన్‌స్ట్రాలో పరిచయమైన యువకుడి కోసం ఓ బాలిక(16)ఇల్లు వదిలి అదృశ్యమైన ఘటన అజిత్‌సింగ్‌నగర్ PS పరిధిలో జరిగింది. కుంటుంబ సభ్యుల వివరాలు.. బాలిక 10వ తరగతి పూర్తి చేసింది. తరచూ..ఫోన్‌లో మాట్లాడుతుండటంతో తల్లి ప్రశ్నించింది. తిరుపతికి చెందిన జాన్సన్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో తల్లి మందలించింది. ఆ రాత్రి నుంచి తమ కుమార్తె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

News July 19, 2024

కృష్ణా: ఆక్వాటిక్ క్రీడాకారులకు ముఖ్య గమనిక

image

విజయవాడలోని VMC సర్ విజ్జి ఈత కొలనులో ఆగస్టు 4న ఎన్టీఆర్ జిల్లా సీనియర్ ఆక్వాటిక్ జట్టు ఎంపిక పోటీలు జరుగనున్నాయి. ఈ మేరకు ఆక్వాటిక్ సంఘ కార్యదర్శి రమేశ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. పోటీల్లో పాల్గొనే స్విమ్మర్లు(17-25 సంవత్సరాలలోపు వారు మాత్రమే) జులై 30లోపు జాతీయ స్విమ్మింగ్ సమాఖ్య UID సంఖ్యతో ఆక్వాటిక్ సంఘం వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని రమేశ్ సూచించారు.

News July 19, 2024

కృష్ణా: బంగారం దోచుకెళ్లిన కేసులో నిందితుడికి జైలు శిక్ష

image

గుడివాడకు చెందిన బస్సులో ప్రయాణిస్తున్న వృద్ధురాలి వద్ద గోల్డ్ చైన్ దొంగిలించిన కేసులో నిందితుడు వెంకటేశ్వరరావు(37)కు న్యాయస్థానం 3ఏళ్ల జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధించింది. 2022 ఫిబ్రవరిలో ఆమె కోదాడ వెళుతుండగా.. ఆమెతో మాటలు కలిపిన నిందితుడు మత్తుమందు ఇచ్చి బంగారం దోచుకున్నాడు. వృద్ధురాలు కేసు నమోదు చేయగా విజయవాడ పోలీసులు ఛార్జిషీట్ వేయగా, గురువారం కోర్టు తుది తీర్పు ఇచ్చింది. 

News July 19, 2024

కృష్ణా: ఈ నెల 21న చెస్ జట్ల ఎంపిక పోటీలు

image

గుడివాడ త్రివేణి స్కూల్‌లో ఈ నెల 21న కృష్ణా జిల్లా అండర్-11 బాలబాలికల చెస్ జట్ల ఎంపిక పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు జిల్లా చెస్ సంఘ కార్యదర్శి NM ఫణికుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి గల బాలలు ఈ నెల 20లోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఈ పోటీల్లో ఎంపికైనవారు ఈ నెల 27, 28 తేదీలలో భీమవరంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో కృష్ణా జిల్లా తరఫున ఆడతారని ఫణికుమార్ చెప్పారు.

News July 19, 2024

కృష్ణా: పర్యవేక్షక కమిటీల్లో సభ్యుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

SC, ST అత్యాచార నిరోధక చట్ట అమలుపై జిల్లా నిఘా, పర్యవేక్షక కమిటీలో నాన్ అఫిషియల్ సభ్యులను నియమించేందుకు అధికారులు అర్హులైన వ్యక్తుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ షాహిద్ బాబు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 22లోపు దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు మచిలీపట్నంలోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

News July 19, 2024

కృష్ణా: ప్రయాణికులకు ఊరటనిచ్చే వార్త చెప్పిన రైల్వే అధికారులు

image

ట్రాక్ పనుల కారణంగా గుంటూరు-విజయవాడ మధ్య పాక్షికంగా రద్దు చేసిన నరసాపురం- గుంటూరు ఎక్స్‌ప్రెస్ రైళ్లను యధావిధిగా గుంటూరు వరకూ నడుపుతామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. నం.17282 నరసాపురం- గుంటూరు రైలును ఈ నెల 21, నం.17281 గుంటూరు- నరసాపురం రైలును ఈ నెల 22 నుంచి యధావిధిగా నడుపుతామన్నారు.

News July 18, 2024

కృష్ణా జిల్లా TODAY TOP NEWS

image

* CM చంద్రబాబుపై కొడాలి నాని ట్వీట్
* కృష్ణా యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా శ్రీనివాసరావు
* మంత్రి నారా లోకేశ్‌పై వైసీపీ నేత పోతిన మహేశ్ ఫైర్
* కృష్ణా: హత్య కేసులో ట్విస్ట్… హంతకురాలు తల్లే
* గన్నవరం చేరుకున్న మాజీ సీఎం జగన్
* విజయవాడ: CRDA పరిధిలో ఉద్యోగాలు
* గుడివాడ పోలీస్ స్టేషన్‌‌లో రాత్రి ప్రేమోన్మాది బీభత్సం
* విజయసాయిరెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి: బుద్ధా వెంకన్న

News July 18, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే పలు రైళ్లకు ప్రయోగాత్మకంగా కొన్ని స్టేషన్లలో స్టాప్‌లు ఇచ్చామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.07866 విజయవాడ-మచిలీపట్నం ట్రైన్‌కు ఈ నెల 21 నుంచి ఉప్పులూరులో, నం.17281 గుంటూరు-నరసాపురం ట్రైన్‌కు ఈ నెల 20 నుంచి పుట్లచెరువులో స్టాప్ ఇచ్చామన్నారు. ఈ స్టాప్‌ల కారణంగా ఆయా ట్రైన్లు బయలుదేరే సమయాలలో మార్పులు లేవని రైల్వే అధికారులు చెప్పారు.

News July 18, 2024

కృష్ణా: సీఎం చంద్రబాబును ప్రశ్నిస్తూ.. ట్వీట్ చేసిన కొడాలి నాని

image

వినుకొండలో రషీద్‌ అనే వైసీపీ కార్యకర్తను నడిరోడ్డు మీద దారుణంగా నరికి చంపడం అత్యంత హేయమైన చర్య అని మాజీ మంత్రి కొడాలి నాని ట్వీట్ చేశారు. ఇదేనా మీరు ప్రజలకు అందిస్తామన్న సంక్షేమ పాలన అంటూ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. వరుస ఘటనలు జరుగుతున్నా.. పట్టించుకోకుండా పాలనను గాలికి వదిలేసి చోద్యం చూడ్డానికి సిగ్గుగా లేదా అంటూ నాని చంద్రబాబుపై ట్విటర్ వేదికగా ప్రశ్నలు సంధించారు.