Krishna

News July 2, 2024

వ్య‌వ‌సాయ‌, అనుబంధ శాఖ‌ల అధికారుల‌తో కలెక్టర్ సమీక్ష

image

ఎన్టీఆర్ జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులు నిర్దిష్ట కార్యాచ‌రణ ప్రణాళికతో ప్ర‌త్యేకంగా దృష్టిసారించి సీజ‌న్‌ను విజ‌య‌వంతం చేసేలా కృషిచేయాల‌ని జిల్లా కలెక్టర్ సృజ‌న ఆదేశించారు.సోమవారం క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ సృజ‌న‌ వ్య‌వ‌సాయం, ఉద్యాన‌, ప‌ట్టు, ప‌శుసంవ‌ర్థ‌క‌, మ‌త్స్య శాఖ‌ల‌తో పాటు మార్క్‌ఫెడ్‌, మార్కెటింగ్ శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.

News July 2, 2024

డ‌యేరియా క్యాంపెయిన్ ద్వారా విస్తృత అవ‌గాహ‌న: క‌లెక్ట‌ర్ సృజ‌న

image

రాష్ట్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా జులై 1 సోమ‌వారం నుంచి ఆగ‌స్టు 31 వ‌ర‌కు స్టాప్ డ‌యేరియా క్యాంపెయిన్ ద్వారా విస్తృత అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని కలెక్టర్ సృజన ఆదేశించారు. విజయవాడ కలెక్టరేట్‌లో డీఎమ్‌హెచ్‌ఓ సుహాసినితో కలిసి కలెక్టర్ స్టాప్ డ‌యేరియా పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించారు. కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌లో అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

News July 1, 2024

కృష్ణా: జిల్లాలో 95.58% మేర పెన్షన్ల పంపిణీ పూర్తి

image

NTR భరోసా పథకం కింద 95.58% మేర పెన్షన్ల పంపిణీతో రాష్ట్రంలోనే కృష్ణాజిల్లా 6వ స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 2,42,321 మంది పెన్షనర్లకు రూ.162.49కోట్లకు గాను రాత్రి 7.30ని.ల సమయానికి 2,31,598 మందికి రూ.155.31 కోట్లు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి అందజేశారు. అత్యధికంగా గుడ్లవల్లేరు మండలంలో 97.2% మందికి, అత్యల్పంగా తాడేపల్లి మున్సిపాల్టీలో 91.52% మందికి పెన్షన్ల పంపిణీ చేశారు.

News July 1, 2024

కృష్ణా: నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు

image

కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఉత్తమ అధ్యాపకులకు ఇచ్చే అవార్డులకై దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. UG, PG విద్యార్థులకు బోధించే అధ్యాపకులకు 2 కేటగిరీలలో ఇచ్చే ఈ అవార్డులకు https://www.awards.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ రోజులోపు దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఎంపికైన 35 మంది అధ్యాపకులకు మెడల్, సర్టిఫికెట్‌తో పాటు రూ.50వేల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

News July 1, 2024

ఎంపీ కారుపై రాళ్ల దాడి.. ఎంపీపీ భర్తపై కేసు నమోదు

image

ఏ.కొండూరు మండలం కంభంపాడులో పోలింగ్ జరిగిన రోజున ఎంపీ కేశినేని చిన్ని కారుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనపై తిరువూరు MLA కొలికపూడి శ్రీను తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. MLA ఫిర్యాదు మేరకు రాళ్ల దాడికి పాల్పడ్డ ఎంపీపీ నాగలక్ష్మి భర్త చెన్నారావు, రామకృష్ణ, శివకృష్ణతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఏ.కొండూరు పోలీసులు తెలిపారు.

News July 1, 2024

మండవల్లిలో జాతీయ రహదారిపై తిరగబడిన లారీ

image

మండవల్లిలో కైకలూరు సందు వద్ద జాతీయ రహదారిపై ధాన్యం లారీ తిరగబడింది. స్థానికుల వివరాల ప్రకారం.. జాతీయ రహదారి మరమ్మతుల్లో భాగంగా కైకలూరు సందు వద్ద రోడ్డు కటింగ్ పనులు చేస్తున్నారు. తణుకు నుంచి సింగరాయపాలెంకు ధాన్యం లోడుతో వెళుతున్న లారీ సాయంత్రం 6.30 సమయంలో మట్టిలో దిగబడి తిరగబడింది. వేసవిలో చేయాల్సిన పనులను కాంట్రక్టర్ వర్షాకాలంలో చేపట్టారని దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు.

News July 1, 2024

తొలిరోజే పింఛన్ 100 శాతం పంపిణీ పూర్తిచేయాలి: క‌లెక్ట‌ర్ సృజ‌న

image

జులై 1వ తేదీన ఎన్‌టీఆర్ భ‌రోసా ప‌థ‌కం కింద పెన్ష‌న్ల మొత్తాన్ని ల‌బ్ధిదారుల‌కు ఇళ్ల వ‌ద్దే అందించే ప్రక్రియను సజావుగా నిర్వహించాలని జిల్లా క‌లెక్ట‌ర్ సృజ‌న ఆదేశించారు. ఎన్‌టీఆర్ భ‌రోసా ప‌థ‌కం కింద చేప‌ట్టే సామాజిక భ‌ద్ర‌తా పెన్ష‌న్ పంపిణీ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై క‌లెక్ట‌ర్ టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. తొలిరోజే 100 శాతం పంపిణీ పూర్తిచేసేలా కృషిచేయాల‌న్నారు.

News July 1, 2024

నేటినుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కృష్ణా జిల్లా కలెక్టర్

image

జూలై 1వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వయంగా స్వీకరిస్తామని అన్నారు. జిల్లా కేంద్రంతోపాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

News June 30, 2024

పెడన: దేశ సరిహద్దుల్లో జవాన్ నాగరాజు మృతి

image

మండలంలోని చేవేండ్ర గ్రామానికి చెందిన జవాన్ సాదరబోయిన నాగరాజు దేశ సరిహద్దుల్లో మృతి చెందారు. 2 రోజుల క్రితం దేశ సరిహద్దుల్లో వరద ముంపులో ట్యాంకర్ కొట్టుకుపోగా అందులో ఉన్న నాగరాజు మృతి చెందాడు. నాగరాజు మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. ఎనిమిదేళ్ల క్రితం నాగరాజు సైన్యంలో చేరారు. నాగరాజుకు భార్య, యేడాది పాప ఉంది. సోమవారం నాగరాజు మృతదేహం స్వగ్రామానికి రానుందని కలెక్టర్ తెలిపారు.

News June 30, 2024

జూలై 1న ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్ బాలాజీ

image

జూలై 1వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వయంగా స్వీకరిస్తానని అన్నారు. జిల్లా కేంద్రంతోపాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

error: Content is protected !!