Krishna

News June 30, 2024

కృష్ణా: పీజీ విద్యార్థులకు అలర్ట్..రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో ఫిబ్రవరి-మార్చి 2024లో నిర్వహించిన పీజీ- ఆర్ట్స్ గ్రూపులు(సెమిస్టర్ ఎండ్)పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు జూలై 4వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది. వివరాలకు http://anucde.info/ వెబ్‌సైట్ చూడాలంది.

News June 30, 2024

కృష్ణా: నేడు రాష్ట్ర చెస్ జట్టు ఎంపిక పోటీలు

image

విజయవాడలోని స్ప్రింగ్ బోర్డు ప్లే స్కూల్‌లో రేపు ఆదివారం రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ జట్టు ఎంపిక పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు టోర్నీ డైరెక్టర్ తాళ్ల నరేశ్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర చెస్ సంఘ అనుమతితో ఈ పోటీలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. టోర్నీలో తొలి 10 స్థానాల్లో నిలిచిన వారిని, అండర్- 7, 9, 11, 13, 15 కేటగిరీల్లో తొలి స్థానం పొందిన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తామన్నారు.

News June 30, 2024

కృష్ణా: B.A. LL.B కోర్సు విద్యార్థులకు ముఖ్య గమనిక

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని B.A.LL.B కోర్సు చదువుతున్న విద్యార్థులు రాయాల్సిన ఎనిమిదవ సెమిస్టర్ థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. జూలై 24, 26, 29, 31, ఆగస్టు 2వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.

News June 30, 2024

ఫించన్ల పంపిణీపై కలెక్టర్లతో వీసీ నిర్వహించిన నీరభ్ కుమార్

image

రాష్ట్రంలో జులై 1వ తేదీన ఎన్టిఆర్ భరోసా ఫించన్ల పంపిణీలో పొరపాట్లకు ఆస్కారం లేకుండా సక్రమంగా పంపిణీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. ఫించన్ల పంపిణీపై శనివారం విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. జులై 1వ తేదీన 65,18,496 మందికి వివిధ ఫించన్ దారులకు పెన్షన్ అందిస్తామన్నారు.

News June 30, 2024

కృష్ణా: ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే

image

ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా అగర్తల (AGTL), సికింద్రాబాద్(SC) మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.07029 AGTL- SC ట్రైన్‌ను జూలై 5 నుంచి అక్టోబర్ 4 వరకు, నెం. 07030 SC- AGTL ట్రైన్‌ను జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నడుపుతామని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఈ ట్రైన్లు ఏపీలో విజయవాడతో పాటు ఏలూరు, రాజమండ్రి, గుంటూరు తదితర స్టేషన్లలో ఆగుతాయి.

News June 30, 2024

ప‌టిష్ఠ ప్ర‌ణాళిక‌తో పెన్ష‌న్ల పంపిణీపై దృష్టిపెట్టండి: కలెక్టర్ సృజన

image

రాష్ట్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ఎన్‌టీఆర్ భ‌రోసా ప‌థ‌కం కింద పెరిగిన పెన్షన్ మొత్తాన్ని ల‌బ్ధిదారుల‌కు అందించేందుకు ప‌టిష్ఠ ప్ర‌ణాళిక‌తో, స‌మ‌న్వ‌యంతో కృషిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ సృజ‌న అధికారుల‌ను శనివారం ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ.. 1వ తేదీ ఉద‌యం 6గంట‌ల‌కు పెన్ష‌న్ పంపిణీని ప్రారంభించి ల‌బ్ధిదారులంద‌రికీ పెన్ష‌న్ మొత్తం అందించేందుకు కృషిచేయాల‌న్నారు.

News June 29, 2024

కృష్ణా: ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్

image

కల్కి 2898 AD చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రత్యేక వాహనం అయిన బుజ్జి రేపు విజయవాడ రానుంది. ఈ మేరకు చిత్ర బృందం తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విజయవాడ ట్రెండ్‌సెట్ మాల్ వద్ద బుజ్జి అందుబాటులో ఉంటుందని తెలిపింది.

News June 29, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

విజయవాడ, భద్రాచలం రోడ్ మధ్య ప్రయాణించే మెము ఎక్స్‌ప్రెస్‌లను ట్రాఫిక్ నిర్వహణ పనులు జరుగుతున్నందున కొద్ది రోజుల పాటు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు జూలై 1 నుంచి 31 వరకు నం.07278 భద్రాచలం రోడ్-విజయవాడ, నం.07279 విజయవాడ- భద్రాచలం రోడ్ మెము ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులు ఆయా రైళ్ల రద్దు ప్రకటనను గమనించాలని సూచించారు.

News June 29, 2024

కృష్ణా: స్త్రీ శిశు సంక్షేమ శాఖపై కలెక్టర్ సమీక్ష

image

జిల్లాలో స్త్రీ శిశు సంక్షేమానికి తోడ్పాటునందించి వారి అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం నగరంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న సమగ్ర శిశు అభివృద్ధి పథకం, సమగ్ర శిశు సంరక్షణ పథకం, గృహహింస, చైల్డ్ హెల్ప్ లైన్-1098, చిల్డ్రన్ హోమ్, శిశు గృహ, స్వధార్ గృహ తదితర అంశాలపై సమీక్షించారు.

News June 29, 2024

ఈవీఎం, వీవీప్యాట్లకు కట్టుదిట్టమైన భద్రత: కలెక్టర్ సృజన

image

ఈవీఎం, వీవీప్యాట్ గోదాము భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సృజన తెలిపారు. గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్ గోదామును సీఈవో ముకేశ్ కుమార్ మీనా, కలెక్టర్ సృజన, సమన్వయ శాఖల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీప్యాట్ల భద్రతకు చేసిన ఏర్పాట్లను క్షుణ్నంగా తనిఖీ చేశారు. సీసీ కెమెరాల భద్రతా వ్యవస్థను పరిశీలించారు.

error: Content is protected !!